ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆనందప్రకాశ్పై కేసు
వైకాపా అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి)తో కలిసి ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది.
పాలకొల్లు పట్టణం, న్యూస్టుడే: వైకాపా అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి)తో కలిసి ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. ఏప్రిల్ 13న వైకాపా ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్ నుంచి యడ్లబజారు వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్ పాల్గొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సీ-విజిల్ యాప్ ద్వారా 3 సార్లు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకుండా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రాదంటూ విచారించలేదు. దీనిపై ఫిర్యాదుదారు కలెక్టర్ సుమిత్కుమార్కు, ఎన్నికల కమిషన్కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) బి.ఎస్.నారాయణరెడ్డిని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై నారాయణరెడ్డి ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్కు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసు జారీ చేశారు. ఆయనిచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాలకొల్లు మున్సిపల్ కమిషనర్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నోడల్ అధికారి బి.విజయసారధిని సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో పాలకొల్లు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి గుడాల గోపి ఏప్రిల్ 13న జరిగిన ప్రదర్శనకు సంబంధించిన ఎన్నికల ప్రచారం వీడియోను తన ఫేస్బుక్లో పెట్టారు. చెల్లం ఆనందప్రకాశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు రుజువు కావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని నిర్ధారించి నోడల్ అధికారి నివేదిక ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరుతూ పట్టణ సీఐ మంగాదేవికి ఆర్వో ఫిర్యాదు చేశారు. దీనిపై సెక్షన్ 188, 171-ఎఫ్ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ఇవా మెరున వైద్య సేవలు?
[ 30-04-2024]
ఏలూరు సర్వజన ఆసుపత్రిలో వైద్యం రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామంటూ సీఎం జగన్ బోధనాసుపత్రి ఏర్పాటు చేశారు కానీ సేవల గురించి పట్టించుకోకుండా వదిలేశారు. -
జనసేన అభ్యర్థులు లేనిచోట్ల గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాలను సోమవారం విడుదల చేశారు. వీటిలో జనసేన పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. -
మనవడిని కొట్టిందని..కోడలిని హతమార్చిన మామ
[ 30-04-2024]
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. -
ప్రజల ఆస్తుల స్వాహాకు జగన్ కుట్ర
[ 30-04-2024]
ప్రజల ఆస్తులను స్వాహా చేసే కుట్రలో భాగంగానే సీఎం జగన్మోహన్రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
అభివృద్ధి కావాలా.. జూద శిబిరాలు కావాలా
[ 30-04-2024]
సోమవారం సాయంత్రం 5.45 గంటలకు పవన్ గణపవరం మహాలక్ష్మి థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడికి భారీగా చేరుకున్న నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. -
యంత్రాంగం ఉండీ.. ఎందుకీ మంత్రాంగం?
[ 30-04-2024]
ఇంటింటి పింఛన్ల పంపిణీపై వైకాపా మరో కొత్త కుట్రకు శ్రీకారం చుట్టింది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉన్నా.. సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడింది. మే నెల పింఛన్లు బ్యాంకులో వేస్తామంటూ కొత్తగా జగన్నాటకం మొదలు పెట్టింది. -
నూజివీడు కూటమిలో జోష్
[ 30-04-2024]
నూజివీడులో కూటమికి మరింత జోష్ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు ఆయన భార్య సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కూటమి కార్యకర్తల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. -
నిర్వాసితులను నిలువునా ముంచారు
[ 30-04-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఎన్నికలకు ముందు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదవీ కాలం ముగుస్తున్నా కనీసం ఒక్క ఎకరానికి కూడా పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. -
ఎన్నికల బరిలో 99 మంది
[ 30-04-2024]
జిల్లాలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 99 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. నామపత్రాలను ఉపసంహరించుకునే ఘట్టం సోమవారం ముగిసింది. -
ఏలూరు పార్లమెంట్ అభ్యర్థులు వీరే
[ 30-04-2024]
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు నిలిచారు. -
సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారని వేధిస్తారా?
[ 30-04-2024]
కైకలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆయన కుమారుడి అకృత్యాలు పెరిగిపోతున్నాయని, అక్రమ కేసులు బనాయించి కూటమి శ్రేణులను ఇబ్బంది పెడితే సహించనని కూటమి కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. -
ఆగని ఇసుక దందా
[ 30-04-2024]
ఆచంట మండలం కరుగోరుమిల్లిలో సోమవారం కూడా ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరిగాయి. ఆదివారం గ్రామస్థులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఇసుక రవాణా నిలిచింది. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 30-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు
తాజా వార్తలు (Latest News)
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..