స్ఫూర్తి ప్రదాత రోశయ్య
మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనతో అనుబంధం ఉన్న జిల్లా వాసుల గుండెలు బరువెక్కాయి.ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు.
ప్రొద్దుటూరుతో అనుబంధం మరువరానిది
శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీదేవి సన్నిధిలో రోశయ్య (దాచిన చిత్రం)
ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు గ్రామీణ, ప్రొద్దుటూరు పట్టణం, కడప విద్య, న్యూస్టుడే: మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనతో అనుబంధం ఉన్న జిల్లా వాసుల గుండెలు బరువెక్కాయి.ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు.
* రాష్ట్ర ఆర్థిక, వ్యవహారాలశాఖ మంత్రి హోదాలో 2005లో ప్రొద్దుటూరులో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు రోశయ్య.. ఆర్యవైశ్య మహాసభ 125వ వార్షికోత్సవానికి వచ్చి శ్రీకన్యకా పరమేశ్వరీదేవికి వజ్ర కిరీటధారణ చేశారు. పెన్నాతీరంలో ఉన్న శ్రీఅయ్యప్ప స్వామి, అమృతేశ్వర స్వామి, వైఎంఆర్ కాలనీలోని సాయిబాబా ఆలయాలను ఆయన సందర్శించారు. ఆర్యవైశ్య సభ దివ్య శతాధిక రజతోత్సవాల్లో పాల్గొన్నారు. సావనీరు పుస్తకాన్ని ఆవిష్కరించారు.
* గొప్ప వ్యక్తిని కోల్పోయామని తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు చిప్పగిరి వెంకట ప్రసాద్ కుమార్ శెట్టి కొనియాడారు. ఆయనతో తనకు 25 ఏళ్ల పాటు అనుబంధం ఉందని, నా రాజకీయ గురువు, మార్గదర్శి అని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
* మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతికి ప్రొద్దుటూరు ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్రావు, సభ కార్యవర్గ సభ్యులు సంతాపం ప్రకటించారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని వాసవీ మాతను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
* మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి తీరనిలోటని ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా, రాష్ట్ర గవర్నర్గా విశేష సేవలు అందించారని కొనియాడారు.
* రాజకీయాల్లో అజాత శత్రువుగా విమర్శకులను సైతం మెప్పించిన మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నరు రోశయ్య మృతి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి తెలిపారు. 1989 నుంచి ఆయనతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు పాతతరం రాజకీయాల్లో విశేష అనుభవంతో వివాదాస్పదం లేనివిధంగా రోశయ్య అందరి మన్ననలు పొందారన్నారు.
ప్రొద్దుటూరు : గాంధీజీ విగ్రహం ఆవిష్కరణ శిలాఫలకం వద్ద నాటి ఆర్థిక మంత్రి రోశయ్య, జిల్లా నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది: వైఎస్ షర్మిల
[ 04-05-2024]
పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్పించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. -
న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తోంది: వైఎస్ షర్మిల
[ 04-05-2024]
జగన్ హామీలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. -
ప్రధాని మోదీ పర్యటనపై డేగ కన్నుతో నిఘా
[ 04-05-2024]
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీˆహెచ్ విజయరావు అధికారులను ఆదేశించారు. -
ఐదేళ్ల పాలనలో ఏం చేశావ్... కార్మికుల బతుకులు కూల్చేశావ్..!
[ 04-05-2024]
జిల్లాలో 55 వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోనివారు మరో 50 వేల మంది పైగా కార్మికులు ఉన్నారు. ఒకనాడు పల్లెసీమలు పాడి పంటలతో విలసిల్లాయి. -
పెద్దిరెడ్డికి రైతుల ఉసురు తగలక తప్పదు
[ 04-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి, మామిడి రైతులను దోపిడీ చేసి వారిని తీవ్రంగా నష్టపరిచారని ఆ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
అయ్యో పాపం...!
[ 04-05-2024]
మండుటెండలు, వడగాలుల మధ్య పింఛను సొమ్ము కోసం రెండో రోజైన శుక్రవారం ఉదయం నుంచే పండుటాకులు బ్యాంకుల బాట పట్టారు. తమ వంతు కోసం అక్కడే గంటలతరబడి పడిగాపులు కాశారు. -
ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతాం
[ 04-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. -
జగన్ పాపానికి ఇద్దరి బలి
[ 04-05-2024]
పింఛను కోసం బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎండథాటికి తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు మృతిచెందిన ఘటన బద్వేలులో శుక్రవారం చోటుచేసుకుంది. -
వైకాపా కంచుకోటకు బీటలు
[ 04-05-2024]
వైకాపాకు కంచుకోట ఉన్న కోమన్నూతలలో దేవిరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నుంచి ఓబులరెడ్డి, బీష్మారెడ్డి, భార్గవ్, ప్రతాప్, మరో 30 కుటుంబాలు శుక్రవారం తెదేపాలో చేరాయి. -
రాజోలి ప్రాజెక్టును పట్టించుకోని వారికి ఎందుకేయాలి ఓట్లు
[ 04-05-2024]
మీఎమ్మెల్యే ఏరోజైనా పలకడా.. ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా... ఎర్రచందనం స్మగ్లింగ్, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే మట్టి, ఇసుక మాఫియా ఇక చెప్పనవసరం లేదని -
షర్మిలకు ఓటేయాలని పిలుపు
[ 04-05-2024]
పోరుమామిళ్ల, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి వివేకాల ఆత్మలు శాంతించాలంటే కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటేయాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు వైకాపా ఎర!
[ 04-05-2024]
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో వైకాపా నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నాయకులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!