Andhrapradesh news: కడపలో అన్న క్యాంటీన్ కూల్చివేత..
కడప పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్ భవనాన్ని అధికారులు రాత్రికి రాత్రే కూల్చివేశారు.
కడప: కడప పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని అన్న క్యాంటీన్ భవనాన్ని అధికారులు రాత్రికి రాత్రే కూల్చివేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు పేదల ఆకలి తీర్చేందుకు నిర్మించిన ఈ అన్నక్యాంటీన్లను అధికారంలోకి రాగానే వైకాపా మూసివేసింది. దీంతో ఖాళీగా ఉన్న ఈ భవనాలను కరోనా సమయంలో కొవిడ్ నిర్ధారణ కేంద్రాలుగా ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం హఠాత్తుగా క్యాంటీన్ భవనాలను కూల్చివేయడంతో నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. ప్రజా ధనం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాన్ని అలాగే ఉంచి ఏదైనా ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయలసీమలో ప్రాజెక్టుల పూర్తికి ప్రధాని భరోసా
[ 09-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా అన్నమయ్య జిల్లాలో అడుగుపెట్టడంతో సీమ ప్రజలు పులకించిపోయారు. ముఖ్యంగా భాజపా నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి పోటీ చేస్తుండడం, ఆయన గెలుపు కోసం మోదీ ఇక్కడకు రావడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. -
నమో నమామి... నమో నమామి... మురిసిన కూటమి
[ 09-05-2024]
కలికిరిలోని ప్రజాగళం ప్రాంగణం మూడు పార్టీల కలయికతో త్రివేణి సంగమంలా మారింది... బుధవారం జరిగిన సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవగా తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి దళం కదం తొక్కింది. -
కేంద్రం పాఠ్యాంశంగా చేర్చితే... రాష్ట్రం రోడ్డు వేయలే
[ 09-05-2024]
అవి కొండల్లో దాగి ఉన్న రేఖాచిత్రాలు. ఆదిమానవుడు వాటిని గీసినట్లుగా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలో ఉన్న శిలా చిత్ర లేఖనాలు దేశంలోనే రెండో అతిపెద్దవిగా ప్రసిద్ధి పొందాయి. -
జగన్ చిత్రాలపై ముసుగేదీ..?
[ 09-05-2024]
మండలంలో కోడ్ ఉల్లంఘనల పరంపర కొనసాగుతూనే ఉంది. పుల్లూరు సచివాలయంపై వైఎస్ జగన్ చిత్రం స్పష్టంగా కనిపిస్తున్నా.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిశీలనాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. -
అకాల వర్షం... అపార నష్టం
[ 09-05-2024]
జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు ఉద్యాన పంటలైన మామిడి, అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాలలో మామిడి, అరటి, నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. -
వానొస్తే పాట్లు... వైకాపాకు వేసేదెలా ఓట్లు?
[ 09-05-2024]
వానొస్తే ఇది మదనపల్లె పట్టణం పరిస్థితి... సెల్లార్లు వాననీటితో నిండిపోతాయి... మురుగు కాలువలు పొంగుతాయి... వాన వెలిసిన తర్వాత ఎటు చూసినా దుర్వాసన, దుర్గంధం... ఏళ్లుగా పట్టణం వానాకాలంలో నిత్యం మునుగుతున్నా నాయకులు ప్రత్యామ్నాయం చూపలేకపోయారు. -
మాజీ సీఎం కిరణ్ రాకతో పుంజుకున్న భాజపా బలం
[ 09-05-2024]
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి రాకతో నిమ్మనపల్లెలో భాజపా బలం పుంజుకుందని నిమ్మనపల్లె మాజీ సర్పంచి రెడ్డివారి పెమ్మిరెడ్డి తనయుడు సునీల్కుమార్రెడ్డి అన్నారు. -
ఎన్నికల ఆహ్వాన పత్రిక
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. ఆ రోజున జరిగే ఓటింగ్లో అందరూ పాల్గొనాలని తెలుపుతూ ఆంగ్లంలో ముద్రించిన ఆహ్వాన పత్రిక ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
పరిస్థితి బాగోలేదు... రంగంలోకి దిగండి!
[ 09-05-2024]
పోలింగ్ సమీపిస్తుండగా వైకాపాలో అలజడి మొదలైంది. వాలంటీర్లను వేడుకుని సమీకరించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పరిస్థితి బాగోలేదంటూ.. రంగంలోకి దిగాలంటూ విన్నవిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి