అయిదు నెలలుగా అవస్థలు!
హామీలు అమలు పక్కన పెడితే విధుల నిర్వహణకు అవసరమైన చీపుర్లు, ఇతరత్రా పరికరాలను గత మూడేళ్లుగా అందించడంలేదు. చివరకు ఆరోగ్య భత్యం సైతం గత అయిదు నెలలుగా నిలిపి వేయడం గమనార్హం. కొవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో
పారిశుద్ధ్య కార్మికులకు అందని ఆరోగ్య భత్యం
గత మూడేళ్లుగా సమకూరని శుభ్రత పరికరాలు
దయనీయ పరిస్థితుల్లో విధుల నిర్వహణ
- ఈనాడు డిజిటల్, కడప
విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
నగర, పురపాలక సంఘాల్లోని పొరుగుసేవల, ఒప్పంద కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తాం. సమాన పనికి సమాన వేతనం అందిస్తాం. - ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన హామీ
హామీలు అమలు పక్కన పెడితే విధుల నిర్వహణకు అవసరమైన చీపుర్లు, ఇతరత్రా పరికరాలను గత మూడేళ్లుగా అందించడంలేదు. చివరకు ఆరోగ్య భత్యం సైతం గత అయిదు నెలలుగా నిలిపి వేయడం గమనార్హం. కొవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య భత్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2020, ఆగస్టు నుంచి ప్రతినెలా ఆరోగ్య భత్యం కింద రూ.6 వేలు చెల్లిస్తుండగా, ఈ ఏడాది జనవరి నుంచి పూర్తిగా నిలిపివేసింది. ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యల దృష్ట్యా ఖర్చుల నిమిత్తం ఈ మొత్తాన్ని మంజూరు చేస్తుండగా, ప్రస్తుతం నిలిపి వేయడంతో వైద్య ఖర్చులకు చిల్లిగవ్వ లేక పారిశుద్ధ్య కార్మికులు అవస్థలు వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని కార్మికులకు మొత్తం రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంది.
వైయస్ఆర్ జిల్లా కమలాపురంలో 50, పులివెందులలో 140, జమ్మలమడుగులో 170, ప్రొద్దుటూరులో 300, మైదుకూరులో 40, కడపలో 700, బద్వేలులో 73, ఎర్రగుంట్లలో 40, అన్నమయ్య జిల్లా రాయచోటిలో 140 మంది, రాజంపేటలో 90, మదనపల్లెలో 240 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ ప్రతి మూడు నెలలకొకసారి శుభ్రత పరికరాలు అందించాల్సి ఉంది. ఒక్కో కార్మికునికి మూడేసి చొప్పున చీపుర్లు ఇవ్వాలి. ప్రస్తుతం కార్మికులే సొంత నిధులతో కొనుగోలు చేసుకుని వాడుతున్నారు. ఆటోలు, రిక్షాల మరమ్మతులకు నిధులివ్వడంలేదు. ప్రతి మూడు నెలలకొకసారి ఇవ్వాల్సిన నూనెలు, సబ్బులు, పాదరక్షలు, టవళ్లు, ఏకరూప దుస్తులు ఇవ్వడంలేదు. వీటన్నింటినీ సొంతంగా కొనుక్కొనే స్తోమత లేకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. సరఫరా లేకపోవడంతో చేతులకు గ్లౌజులు తొడుక్కునే పరిస్థితి లేకుండా పోయింది. వీరికిచ్చే జీతం రూ.13 వేల వరకే వస్తుండడంతో ఈ మొత్తాన్ని కుటుంబ పోషణ, వైద్యం కోసం వెచ్చించడం భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిని ఉద్యోగులుగా పరిగణిస్తూ అమ్మఒడి, విద్యాదీవన, వసతి దీవెన వంటి సంక్షేమ పథకాలు వర్తింపజేయడంలేదు. వీరికి మొదటి విడతలో మంజూరు కాగా తదుపరి విడతలో నిలిపివేశారు. భవిష్యత్తులో తెల్ల రేషన్కార్డులు తొలగిస్తారనే భయం వారిలో నెలకొంది.
ఆప్కోస్తో తీవ్ర నష్టం
ఆప్కోస్ ప్రవేశించక ముందు గుత్తేదారు సంస్థలతో కార్మికులు పలు ప్రయోజనాలు పొందారు. కార్మికులు మృతిచెందితే వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం కల్పించారు. ఆప్కోస్ యజమాని ఎవరో తెలియకపోవడంతో జీతభత్యాలు గురించి అడిగే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో గుత్తేదారుపై ఒత్తిడి తీసుకొచ్చి తమ డిమాండ్లను సాధించుకునేవారు. ప్రస్తుతం ఆప్కోస్ జ్ఞతో అన్ని ప్రయోజనాలు కోల్పయినట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదో నియంతృత్వ సంస్థగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చీపుర్లు కూడా ఇవ్వలేదంటూ నిరసన తెలుపుతున్న కార్మికులు
అనారోగ్యంతో మరణిస్తున్నారు
ధరలు పెరిగాయి. ఆ మేరకు జీతాలు పెరగడంలేదు. ఆఖరుకు నెలవారీగా చెల్లించే ఆరోగ్య భత్యం రూ.6 వేలు చెల్లించడం నిలిపివేశారు. పారిశుద్ధ్య పనులు చేస్తూ అనారోగ్యం పాలైతే వైద్య ఖర్చులకు నగదు లేక ఇబ్బందులు పడుతున్నాం. పలువురు అనారోగ్యంతో మరణిస్తున్నారు. - తారకరామారావు, కార్మికుడు, ప్రొద్దుటూరు
కార్మికులకు మోసం
ముఖ్యమంత్రి జగన్ పారిశుద్ధ్య కార్మికులకు ఎన్నో హామీలిచ్చారు. ఇప్పుడు ఒక్కటి కూడా అమలు కావడంలేదు. నడ్డి విరుస్తూ ఆప్కోస్ సంస్థను రంగంలోకి తీసుకొచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. చివరకు సంక్షేమ పథకాలను వర్తింపజేయకుండా నిలిపివేశారు. కారుణ్య నియామకాలు చేపట్టకుండా కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. - సుంకర రవి, నగర అధ్యక్షుడు, ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయలసీమలో ప్రాజెక్టుల పూర్తికి ప్రధాని భరోసా
[ 09-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా అన్నమయ్య జిల్లాలో అడుగుపెట్టడంతో సీమ ప్రజలు పులకించిపోయారు. ముఖ్యంగా భాజపా నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి పోటీ చేస్తుండడం, ఆయన గెలుపు కోసం మోదీ ఇక్కడకు రావడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. -
నమో నమామి... నమో నమామి... మురిసిన కూటమి
[ 09-05-2024]
కలికిరిలోని ప్రజాగళం ప్రాంగణం మూడు పార్టీల కలయికతో త్రివేణి సంగమంలా మారింది... బుధవారం జరిగిన సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవగా తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి దళం కదం తొక్కింది. -
కేంద్రం పాఠ్యాంశంగా చేర్చితే... రాష్ట్రం రోడ్డు వేయలే
[ 09-05-2024]
అవి కొండల్లో దాగి ఉన్న రేఖాచిత్రాలు. ఆదిమానవుడు వాటిని గీసినట్లుగా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలో ఉన్న శిలా చిత్ర లేఖనాలు దేశంలోనే రెండో అతిపెద్దవిగా ప్రసిద్ధి పొందాయి. -
జగన్ చిత్రాలపై ముసుగేదీ..?
[ 09-05-2024]
మండలంలో కోడ్ ఉల్లంఘనల పరంపర కొనసాగుతూనే ఉంది. పుల్లూరు సచివాలయంపై వైఎస్ జగన్ చిత్రం స్పష్టంగా కనిపిస్తున్నా.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిశీలనాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. -
అకాల వర్షం... అపార నష్టం
[ 09-05-2024]
జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు ఉద్యాన పంటలైన మామిడి, అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాలలో మామిడి, అరటి, నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. -
వానొస్తే పాట్లు... వైకాపాకు వేసేదెలా ఓట్లు?
[ 09-05-2024]
వానొస్తే ఇది మదనపల్లె పట్టణం పరిస్థితి... సెల్లార్లు వాననీటితో నిండిపోతాయి... మురుగు కాలువలు పొంగుతాయి... వాన వెలిసిన తర్వాత ఎటు చూసినా దుర్వాసన, దుర్గంధం... ఏళ్లుగా పట్టణం వానాకాలంలో నిత్యం మునుగుతున్నా నాయకులు ప్రత్యామ్నాయం చూపలేకపోయారు. -
మాజీ సీఎం కిరణ్ రాకతో పుంజుకున్న భాజపా బలం
[ 09-05-2024]
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి రాకతో నిమ్మనపల్లెలో భాజపా బలం పుంజుకుందని నిమ్మనపల్లె మాజీ సర్పంచి రెడ్డివారి పెమ్మిరెడ్డి తనయుడు సునీల్కుమార్రెడ్డి అన్నారు. -
ఎన్నికల ఆహ్వాన పత్రిక
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. ఆ రోజున జరిగే ఓటింగ్లో అందరూ పాల్గొనాలని తెలుపుతూ ఆంగ్లంలో ముద్రించిన ఆహ్వాన పత్రిక ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
పరిస్థితి బాగోలేదు... రంగంలోకి దిగండి!
[ 09-05-2024]
పోలింగ్ సమీపిస్తుండగా వైకాపాలో అలజడి మొదలైంది. వాలంటీర్లను వేడుకుని సమీకరించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పరిస్థితి బాగోలేదంటూ.. రంగంలోకి దిగాలంటూ విన్నవిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్