రోడ్డు సమస్యను విన్నవిస్తే చేయిచేసుకున్న ఎమ్మెల్యే
మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని నీరుగట్టువారిపల్లెలో శుక్రవారం రాత్రి జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’ ఉద్రిక్తతకు దారితీసింది.
బాధితుడిని స్టేషన్కు తరలించిన పోలీసులు
బాధితుడిని ఇంటి బయట నుంచి విచారిస్తున్న పోలీసులు
మదనపల్లె పట్టణం, న్యూస్టుడే : మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని నీరుగట్టువారిపల్లెలో శుక్రవారం రాత్రి జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’ ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీనారాయణపై ఎమ్మెల్యే నవాజ్బాషా చేయిచేసుకున్నారు. ఘటన జరిగిన కొన్ని నిముషాల్లోనే బాధితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఒకటో పట్టణ పోలీసుస్టేషన్కు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు... మదనపల్లెలోని 32వ వార్డులో శుక్రవారం రాత్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రామిరెడ్డి లేఅవుట్ వినాయకునివీధిలోకి ఎమ్మెల్యే రావడంతో ఇంట్లో నుంచి లక్ష్మీనారాయణ బయటకొచ్చి ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యే మొదట అతని భుజంపై చేయి వేసి పలకరించారు. అనంతరం ఇంటి ముందున్న రోడ్డుకు మరమ్మతులు చేయిస్తే బాగుంటుందని కోరారు. దీంతో ఎమ్మెల్యే ప్రస్తుతమున్న రోడ్డుపైనే రోడ్డు నిర్మించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పగా, అలా చేస్తే రోడ్డు ఎత్తు పెరిగి ఇల్లు పల్లంలోకి చేరుతుందని, వాస్తు ప్రకారం ఇబ్బంది కలుగుతుందని వివరిస్తూ ఎమ్మెల్యే చేయి పట్టుకున్నట్లు స్థానికుల తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన ఎమ్మెల్యే నవాజ్బాషా లక్ష్మీనారాయణపై చేయిచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అనంతరం బాధితుడిని పోలీసులు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన స్థానికులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొంతమంది ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ వద్దకు వెళ్లి బాధితుడిని విడిచిపెట్టాలని పట్టుబట్టారు. పర్యటనలో ఉన్న ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు తొగటవీర క్షత్రియ సంఘం నాయకులు అక్కడికి వచ్చారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. అనంతరం ఎమ్మెల్యే వారిని పిలిపించి సమస్యను వారికి వివరించడంతో గొడవ సద్దుమణిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..