కమలాపురం... ప్రగతికి దూరం!
‘నువ్వు మా బిడ్డ... రాష్ట్రం వైపు చూడు.. మిగిలిన విషయాలు మేము చూసుకుంటామంటూ మీరు దీవించి పంపడంతోనే ఈ రోజు మీ బిడ్డ ముఖ్యమంత్రిగా దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు.
కలగానే రైల్వే పైవంతెన
సర్వేకే పరిమితమైన బైపాస్ రోడ్డు
సర్వరాయసాగర్ కింద ఆయకట్టేది?
కొప్పర్తి పారిశ్రామికవాడ ఉనికేదీ?
గేట్ మూయడంతో నిరీక్షిస్తున్న వాహనదారులు
* ‘నువ్వు మా బిడ్డ... రాష్ట్రం వైపు చూడు.. మిగిలిన విషయాలు మేము చూసుకుంటామంటూ మీరు దీవించి పంపడంతోనే ఈ రోజు మీ బిడ్డ ముఖ్యమంత్రిగా దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. ఎన్నికలు వస్తుంటాయి... పోతుంటాయి.. ఒక్కటి మాత్రం నిజం. సాటి మనిషికి మంచి చేస్తే ఆ మనిషి గుండెల్లో చనిపోయిన తర్వాత కూడా బతకడం ఒక వరం. దాని కోసం మీ బిడ్డ పాకులాడుతాడు. ఈ రోజు మీ ప్రాంత అభివృద్ధి కోసం రూ.905 కోట్ల నిధులతో చేపట్టబోమే వివిధ పనులకు శంకుస్థాపన చేస్తున్నా. ’
* 2022, డిసెంబరు 23న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కమలాపురం సీఎస్ఐ చర్చి మైదానంలో జరిగిన సభలో అన్నమాటలివి. ఈ మాటలు విన్న నియోజకవర్గ ప్రజలు ఆనందపరవశులయ్యారు. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లేనని భావించిన వారంతా ఇప్పుడు నిరాశ, నిస్సహాయతతో ఉన్నారు.
* కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి స్వయానా మేనమామ. సీఎం మేనమామ తలుచుకుంటే అభివృద్ధికి కొదవా... అంటూ అందరూ భావిస్తారు. ఈ మేరకు ఇక్కడ పరిస్థితులు కనిపించడంలేదు. ఆశించినంత అభివృద్ధి జరగలేదనే అసంతృప్తితో ఇక్కడ ప్రజలు రగిలిపోతున్నారు. సీˆఎం జగన్ కమలాపురం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేరకుండా పోయాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా వచ్చిన ఆయన అనేక హామీలు గుప్పించారు.
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, కమలాపురం
* కొప్పర్తి పారిశ్రామికవాడలో ఆశించినంత ప్రగతి కనిపించలేదు. బ్రహ్మంసాగర్ నుంచి తాగునీటి పైపులైను పనులు చేపట్టాల్సి ఉండగా ప్రక్రియ సాగలేదు. ఇక్కడ పలు యూనిట్లు స్థాపన జరగాల్సి ఉండగా ఆశించినంతగా అడుగులు పడడంలేదు. మౌలిక సదుపాయాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నీరు అందుబాటులో లేకపోకడం ప్రతిబంధకంగా ఉంది. ఇక్కడ మూడు లక్షల ఉద్యోగాలొస్తాయని సీఎం జగన్ పలుమార్లు ప్రకటించినా.. ఆమేరకు లభించిన దాఖలాలు.. సమీపంలో వస్తాయనే ఆశలు కనిపించడంలేదు.
* కమలాపురం పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న రైల్వే పైవంతెనను నిర్మిస్తామని చెప్పి చేతులెత్తేశారు. సీఎం జగన్ సైతం బహిరంగ సభలో రూ.39 కోట్లతో రైల్వే పై వంతెన, లోవంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంతవరకు పనులు ప్రారంభించిన దాఖలాల్లేవు.
* రూ.88 కోట్లతో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పి సర్వేలకే పరిమితం చేశారు. కమలాపురం-ఖాజీపేట రోడ్డు నుంచి గంగవరం వయా మొలకవారిపల్లె మీదుగా సంబటూరు వరకు రూ.3.82 కోట్లతో 4.35 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు.
* రూ.22 కోట్లతో వల్లూరు నుంచి ఆదినిమ్మాయపల్లె వరకు రోడ్డు, చిన్నమాచుపల్లె, పుష్పగిరి రోడ్డు విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన పనులు చేపట్టారు. వల్లూరు నుంచి ఆదినిమ్మాయపల్లె వరకు రోడ్డు పనులు పూర్తికాగా, చిన్నమాచుపల్లె, పుష్పగిరి రోడ్డు విస్తరణ పనులు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి.
* కోగటం- పాయసంపల్లె రోడ్డు నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వాల్పిన రూ.8 కోట్లు పరిహారం ఇంతవరకు అందలేదు.
* కమలాపురంలో రూ.58.20 కోట్లతో సమగ్ర నీటి సరఫరా కోసం 67.66 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టి 5,500 ఇళ్లకు ఇస్తామన్న నీటి కనెక్షన్లకు టెండర్లు కూడా పూర్తయినా శంకుస్థాపనకే పరిమితమైంది.
* వరద నీరు ప్రవహించేందుకు రూ.8 కోట్లతో చేపట్టిన మురికినీటి కాలువ నిర్మాణం నిధుల లేమితో గుత్తేదారు మధ్యలోనే నిలిపేశారు. రోజుకు 5 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో పనిచేసే మురుగునీటి పారిశుద్ధ్య ప్లాంట్ రూ.18.60 కోట్లతో నిర్మిస్తామని ఇంత వరకు నిర్మించలేదు.
* రూ.3 కోట్లతో అన్ని వసతులతో నగర పంచాయతీ కార్యాలయాన్ని నిర్మిస్తామని చెప్పగా ప్రస్తుతం ఆ ఊసే లేదు. పేరొందిన దర్గా-ఏ-గఫారియాకు రూ.2.50 కోట్లతో ప్రహరీ, ఫంక్షన్హాలు, గదుల నిర్మాణాలు చేపట్టనే లేదు.
* రూ.36 కోట్లతో బీసీ బాలుర గురుకుల పాఠశాల నిర్మాణం చేపట్టకపోవడంతో అద్దె భవనంలోనే చాలీ చాలని వసతుల నడుమ కొనసాగిస్తున్నారు.
* రూ.15 కోట్లతో రూ.2.18 ఎకరాల్లో రాష్ట్ర సహకార బ్యాంకు(ఆప్కాబ్)కు సంబంధించిన ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఇంత వరకు నిర్మాణానికి నోచుకోలేదు.
* రూ.213 కోట్లతో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి జీఎన్ఎస్ ఫేజ్-1 ప్యాకేజీ-2లో మిగిలిన పనులన్నీ పూర్తి చేయడంతోపాటు సర్వరాయసాగర్, వామికొండ రిజర్వాయర్ సాగునీటి కాలువలు నిర్మించి 35 వేల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఈ పనులు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
కొప్పర్తి పారిశ్రామికవాడ
మొలకవారిపల్లె రహదారి దుస్థితి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..