సీఎం మాట నిలబెట్టుకోకుంటే ఆందోళన ఉద్ధృతం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు హెచ్చరించారు.
కడప కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల రిలేనిరాహార దీక్ష
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు హెచ్చరించారు. కడప కలెక్టరేట్ ఎదుట బుధవారం వారు ఉద్యోగులతో కలిసి నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రమేష్కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీనిచ్చి అయిదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఆ ఊసేలేదన్నారు. సలహాదారుల పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక సమస్యలు పరిష్కరించడంలో తాత్సారం చేస్తోందని విమర్శించారు. ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించేవిధంగా చట్టం తీసుకురావాలని, 1993 కంటే ముందుగా నియమితులైన ఎన్ఎంఆర్, ఒప్పంద, డైలీవేజెస్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండు చేశారు. వేతన సవరణ సంఘం లేకుండానే ఉద్యోగ సంఘాలతో నేరుగా సంప్రదింపులు జరిపి 12వ వేతన సవరణ చేపట్టాలని డిమాండు చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుదర్శన్రెడ్డి, కడప తాలూకా అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి మునెయ్య, ఐసీడీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, బీసీ సంక్షేమ ఉద్యోగుల సంఘం నాయకుడు ఆంజనేయులు, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు మస్తాన్, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు మస్తాన్వలీ, వివిధ శాఖల ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
[ 07-05-2024]
రాజంపేట పార్టమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రాజ్యం అమల్లో ఉందని మాజీ సీఎం, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. ఇక్కడ జరిగే దోపిడీలు, దౌర్జన్యాలు, వైకాపా నాయకుల పాపాలకు ఆ పెద్దిరెడ్డే కారకుడని ఆరోపించారు. -
సీఎం జగన్ కంచుకోటలో ఎందుకీ కలవరం?
[ 07-05-2024]
సీఎం జగన్కే కాదు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం నుంచి వారి కుటుంబానికి పులివెందుల కంచుకోట. ఓట్లు అడగకపోయినా ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. -
రాజోలి అన్నావ్.. జోలాలి పాడావ్!
[ 07-05-2024]
మాట తప్పను..మడమ తిప్పను అని సీఎం జగన్ తరచూ అంటుంటారు. రాజోలి ఆనకట్ట విషయంలో ఆయన మాట తప్పారు, మడమ తిప్పారు... రైతుల ప్రయోజనాలకు గండి కొట్టారు. సీఎం జగన్ మన జిల్లా వాసే కదా ఆయన ఏదైనా శంకుస్థాపన చేస్తే అమలవుతుందని మొదట్లో ప్రజలు నమ్మారు. -
రాక్షస రాజ్యం!
[ 07-05-2024]
దుష్టులకు అవకాశమిస్తే ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారో ప్రత్యక్ష సాక్ష్యం ఈ నియోజకవర్గం. ఇక్కడ గత ఐదేళ్లుగా అరాచకం రాజ్యమేలుతోంది. తమ వ్యతిరేకులను రాచిరంపాన పెట్టే పెడపాలనతో వైకాపా నేతలు చెలరేగిపోతున్నారు. వైకాపా దత్తపుత్రులైన ఖాకీల పెద్ద మనుషులు నేతల అరాచకకాండకు నిర్లజ్జగా సహకరిస్తున్నారు. -
బోరుమంటున్న జగన్ హామీ!
[ 07-05-2024]
వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయడంతో పాటు, మోటారు, పైపులు, విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేయిస్తామని సీఎం జగన్ గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. -
150 స్థానాల్లో కూటమి విజయం ఖాయం
[ 07-05-2024]
ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో కూటమి 150 అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ఖాయమని, ముస్లిం మైనార్టీలు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి వారి విజయానికి సహకరించాలని ఎమ్మెల్సీ, విశ్రాంత ఐజీ ఇక్బాల్ పేర్కొన్నారు. -
పోస్టల్ బ్యాలట్లో గందరగోళం!
[ 07-05-2024]
జిల్లాలో రెండో రోజైన సోమవారం కూడా పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. పలుచోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాలకు అధికారులు పంపిన ఓటర్ల జాబితాలో చాలా మంది ఉద్యోగుల పేర్లు లేకపోవడం, -
రెండో రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలట్ పోలింగ్
[ 07-05-2024]
జిల్లాలో రెండోరోజు సోమవారం పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 934 మంది ఉద్యోగులకు గాను 511 మంది ఓటేశారు. -
జగన్ హామీలు... నీటిపై రాతలు
[ 07-05-2024]
జిల్లాలో వైకాపాకు పులివెందుల తర్వాత బద్వేలు నియోజక వర్గంలోనే అత్యధికంగా ఆదరిస్తారు. అందులో అట్లూరు మండలం మరింత ఎక్కువని ఎమ్మెల్యే సుధ పలు కార్యక్రమాల్లో ప్రస్తావించారు. -
పోస్టల్ బ్యాలట్కు అధికార పార్టీ నగదు బదిలీ
[ 07-05-2024]
నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు సోమవారం జరిగిన పోలింగ్లో 867 ఓటర్లకు 701 మంది హాజరయ్యారు. ఓటు వేసేందుకు వచ్చిన కొందరు అధికారులు ఎన్నికల విధులకు సంబంధించి ప్రోసీడింగ్ కాపీలు తీసుకు రాకపోవడంతో వెనక్కి పంపారు. -
వైకాపాను గెలిపిస్తే అభివృద్ధి పాతాళానికే!
[ 07-05-2024]
వైకాపాను మళ్లీ గెలిపించుకుంటే మదనపల్లె నియోజకవర్గం 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు వెళ్లిపోతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్కుమార్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య