అక్రమాలకు పాల్పడకుండా గెలిచే సత్తా మీకుందా?
అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు
సీఎం జగన్కు తెదేపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సూటి ప్రశ్న
ఆర్వో వెంకటేశులుకు నామపత్రాలు అందిస్తున్న బీటెక్ రవి
పులివెందుల, న్యూస్టుడే : అక్రమాలకు పాల్పడకుండా పులివెందులలో గెలిచే సత్తా మీకుందా? అని తెదేపా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి సీఎం జగన్కు సవాల్ విసిరారు. పులివెందులలో బుధవారం ఆయన తన సోదరుడు జోగిరెడ్డి, భాజపా జిల్లా ఉపాధ్యక్షురాలు సుష్మ, న్యాయవాది రామకృష్ణారెడ్డి, కార్యకర్తలతో కలిసి ఆర్డీవో వెంకటేసులకు నామ పత్రాలు అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పులివెందులలో జగన్ పతనానికి అంకురార్పణ జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో అక్రమాలకు స్వస్తి పలికి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపించి గెలవగలిగే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా తమకు మద్దతిస్తున్నార]న్నారు. ఐదేళ్లలో పులివెందులలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేదన్నారు. రైతులకు డ్రిప్పు పరికరాలు, పంటల బీమా పరిహారం ఇచ్చిన దాఖలాల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
వివేకా హత్య, రైతులకు చేసిన అన్యాయం.. ఇలాంటి విషయాలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఎన్నికల్లో జగన్కు సరైన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. తెదేపా కడప ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి మాట్లాడుతూ.. వివేకా హత్యకేసుకు సంబంధించి తన చిన్నాన్న ఆదినారాయణరెడ్డి, పులివెందుల అభ్యర్థి బీటెక్ రవిపై అప్పట్లో నిందారోపణలు చేశారన్నారు. ఐదేళ్ల తర్వాత ఈ కేసులో పాత్రధారులెవరో, సూత్రధారులెవరో ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. ఎంపీ అవినాష్రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేరని కేవలం తన వద్దనున్న డబ్బుతో కార్యకర్తలను కొంటున్నారన్నారు. ప్రజలు తనకు, ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
పులివెందులలో తెదేపా భారీ ర్యాలీ
పులివెందులలో తెదేపా భారీ ర్యాలీ నిర్వహించింది. తెదేపా అభ్యర్థి బీటెక్ రవి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్రెడ్డి, తదితరులు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. పార్నపల్లి రింగురోడ్డు, పూలంగళ్లు, వెంకటేశ్వరస్వామి ఆలయం, ఆర్టీసీ బస్టాండ్ పాతరోడ్డు మీదుగా మినీ సెక్రటేరియట్ వరకు ర్యాలీ కొనసాగింది. బీటెక్రవి కారుపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ర్యాలీలో నియోజకవర్గంలోని ఏడు మండలాల తెదేపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ పర్యటనపై డేగ కన్నుతో నిఘా
[ 04-05-2024]
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీˆహెచ్ విజయరావు అధికారులను ఆదేశించారు. -
ఐదేళ్ల పాలనలో ఏం చేశావ్... కార్మికుల బతుకులు కూల్చేశావ్..!
[ 04-05-2024]
జిల్లాలో 55 వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోనివారు మరో 50 వేల మంది పైగా కార్మికులు ఉన్నారు. ఒకనాడు పల్లెసీమలు పాడి పంటలతో విలసిల్లాయి. -
పెద్దిరెడ్డికి రైతుల ఉసురు తగలక తప్పదు
[ 04-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి, మామిడి రైతులను దోపిడీ చేసి వారిని తీవ్రంగా నష్టపరిచారని ఆ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
అయ్యో పాపం...!
[ 04-05-2024]
మండుటెండలు, వడగాలుల మధ్య పింఛను సొమ్ము కోసం రెండో రోజైన శుక్రవారం ఉదయం నుంచే పండుటాకులు బ్యాంకుల బాట పట్టారు. తమ వంతు కోసం అక్కడే గంటలతరబడి పడిగాపులు కాశారు. -
ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతాం
[ 04-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. -
జగన్ పాపానికి ఇద్దరి బలి
[ 04-05-2024]
పింఛను కోసం బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎండథాటికి తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు మృతిచెందిన ఘటన బద్వేలులో శుక్రవారం చోటుచేసుకుంది. -
వైకాపా కంచుకోటకు బీటలు
[ 04-05-2024]
వైకాపాకు కంచుకోట ఉన్న కోమన్నూతలలో దేవిరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నుంచి ఓబులరెడ్డి, బీష్మారెడ్డి, భార్గవ్, ప్రతాప్, మరో 30 కుటుంబాలు శుక్రవారం తెదేపాలో చేరాయి. -
రాజోలి ప్రాజెక్టును పట్టించుకోని వారికి ఎందుకేయాలి ఓట్లు
[ 04-05-2024]
మీఎమ్మెల్యే ఏరోజైనా పలకడా.. ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా... ఎర్రచందనం స్మగ్లింగ్, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే మట్టి, ఇసుక మాఫియా ఇక చెప్పనవసరం లేదని -
షర్మిలకు ఓటేయాలని పిలుపు
[ 04-05-2024]
పోరుమామిళ్ల, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి వివేకాల ఆత్మలు శాంతించాలంటే కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటేయాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు వైకాపా ఎర!
[ 04-05-2024]
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో వైకాపా నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నాయకులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM