ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు
నామపత్రాలు సమర్పించిన నల్లారి, మండిపల్లి
భారీ ర్యాలీగా తరలి వచ్చిన ఎన్డీఏ శ్రేణులు
నామినేషన్ దాఖలు చేస్తున్న నల్లారి కిరణ్కుమార్రెడ్డి
రాయచోటి, న్యూస్టుడే: మాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. వీరు బుధవారం అట్టహాసంగా నామిసేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమానికి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తెదేపా, భాజపా, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. రాయచోటి ఎస్ఎన్ కాలనీలోని తెదేపా కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంపై మదనపల్లె రోడ్డు, కొత్తపేట, ఆర్టీసీ బస్టాండు కూడలి, నేతాజీ కూడలి వరకు భారీ ర్యాలీగా తరలి వచ్చారు. ఉదయం 11 గంటలకు నల్లారి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయగా, మండిపల్లి మూడో సెట్ నామపత్రాలు దాఖలు చేశారు. కార్యక్రమానికి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడిని డీఎస్పీలు, మహబూబ్బాషా, శ్రీధర్లు అనుమతి లేదంటూ అడ్డగించారు. అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి వెళ్లిపోతుండగా భాజపా నాయకుడు నాగోతు రమేష్నాయుడు తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. నామినేషన్ అనంతరం కిరణ్కుమార్రెడ్డిని కలిసి చర్చించి వెళ్లిపోయారు. మదనపల్లె రోడ్డులోని కొత్తపేట రోడ్డు కూడలిలో నల్లారి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, మట్టి, భూ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ధ్వజ మెత్తారు. రానున్న ఎన్నికల్లో రెండే మార్గాలున్నాయని, కేంద్రంలో ప్రధానిగా నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఓటర్లు రాజంపేట పార్లమెంట్ స్థానానికి కమలం గుర్తుకు, రాయచోటి అసెంబ్లీ స్థానానికి సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో తెదేపా పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల అభ్యర్థులు నల్లారి కిశోర్కుమార్రెడ్డి, షాజహాన్బాషా, జనసేన, భాజపా, తెదేపా నాయకులు రాందాస్చౌదరి, బాబురెడ్డి, రామచంద్రయ్య, విశ్వనాథనాయుడు, సాయిలోకేశ్, నాగోతు రమేష్నాయుడు, మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ పర్యటనపై డేగ కన్నుతో నిఘా
[ 04-05-2024]
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీˆహెచ్ విజయరావు అధికారులను ఆదేశించారు. -
ఐదేళ్ల పాలనలో ఏం చేశావ్... కార్మికుల బతుకులు కూల్చేశావ్..!
[ 04-05-2024]
జిల్లాలో 55 వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోనివారు మరో 50 వేల మంది పైగా కార్మికులు ఉన్నారు. ఒకనాడు పల్లెసీమలు పాడి పంటలతో విలసిల్లాయి. -
పెద్దిరెడ్డికి రైతుల ఉసురు తగలక తప్పదు
[ 04-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి, మామిడి రైతులను దోపిడీ చేసి వారిని తీవ్రంగా నష్టపరిచారని ఆ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
అయ్యో పాపం...!
[ 04-05-2024]
మండుటెండలు, వడగాలుల మధ్య పింఛను సొమ్ము కోసం రెండో రోజైన శుక్రవారం ఉదయం నుంచే పండుటాకులు బ్యాంకుల బాట పట్టారు. తమ వంతు కోసం అక్కడే గంటలతరబడి పడిగాపులు కాశారు. -
ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతాం
[ 04-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. -
జగన్ పాపానికి ఇద్దరి బలి
[ 04-05-2024]
పింఛను కోసం బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎండథాటికి తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు మృతిచెందిన ఘటన బద్వేలులో శుక్రవారం చోటుచేసుకుంది. -
వైకాపా కంచుకోటకు బీటలు
[ 04-05-2024]
వైకాపాకు కంచుకోట ఉన్న కోమన్నూతలలో దేవిరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నుంచి ఓబులరెడ్డి, బీష్మారెడ్డి, భార్గవ్, ప్రతాప్, మరో 30 కుటుంబాలు శుక్రవారం తెదేపాలో చేరాయి. -
రాజోలి ప్రాజెక్టును పట్టించుకోని వారికి ఎందుకేయాలి ఓట్లు
[ 04-05-2024]
మీఎమ్మెల్యే ఏరోజైనా పలకడా.. ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా... ఎర్రచందనం స్మగ్లింగ్, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే మట్టి, ఇసుక మాఫియా ఇక చెప్పనవసరం లేదని -
షర్మిలకు ఓటేయాలని పిలుపు
[ 04-05-2024]
పోరుమామిళ్ల, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి వివేకాల ఆత్మలు శాంతించాలంటే కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటేయాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు వైకాపా ఎర!
[ 04-05-2024]
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో వైకాపా నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నాయకులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM