logo

CRDA: ప్లాట్ల అమ్మకానికి సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌

మంగళగిరి మండలం నవులూరులోని అమరావతి టౌన్‌ షిప్‌లో మిగిలిన ప్లాట్ల అమ్మకానికి ఏపీ సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు సీఆర్‌డీఏ కార్యాలయ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 12 లాట్లలో

Updated : 13 May 2022 09:22 IST

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : మంగళగిరి మండలం నవులూరులోని అమరావతి టౌన్‌ షిప్‌లో మిగిలిన ప్లాట్ల అమ్మకానికి ఏపీ సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు సీఆర్‌డీఏ కార్యాలయ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 12 లాట్లలో లాట్‌-1ను ఈ-ఆక్షన్‌ పద్ధతిలో అమ్మేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్లాట్లకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ కొనుగోలు పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి గల వారు ఈ నెల 13వ తేదీ నుంచి 27వ తేదీలోపు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని