ఎత్తు పెంపునకు మోక్షం ఎన్నడో..!
జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపురం ఆనకట్ట (వనదుర్గా) ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు ముందుకు సాగడం లేదు. గతంలో నిధులు మంజూరవడంతో పనులు ప్రారంభించగా ఐదేళ్లు కావస్తున్నా ఇంత వరకు పూర్తి చేయలేదు.
న్యూస్టుడే, పాపన్నపేట: జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపురం ఆనకట్ట (వనదుర్గా) ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు ముందుకు సాగడం లేదు. గతంలో నిధులు మంజూరవడంతో పనులు ప్రారంభించగా ఐదేళ్లు కావస్తున్నా ఇంత వరకు పూర్తి చేయలేదు. కొల్చారం-పాపన్నపేట మండలాల మధ్య 1905లో మంజీరా నదిపై ఘనపురం ఆనకట్టను నిర్మించగా దీని పూర్తి సామర్థ్యం 0.135 టీఎంసీలు. ఇది ఇలా ఉండగా ఈ ప్రాజెక్టు కింద 21,625 ఎకరాల సాగు భూమి ఉంది. ప్రాజెక్టుకు రెండు కాల్వలు ఉన్నాయి. మహబూబ్నహర్ కాల్వ ద్వారా కొల్చారం, మెదక్, హవేలి ఘనపూర్ మండలాలకు, ఫతేనహర్ కాల్వ ద్వారా పాపన్నపేట మండలంలోని పంట పొలాలకు నీరు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనకట్ట కింద సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో పాటు చివరి ఆయకట్టుకు కూడా నీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తు పెంపునకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2016లో రూ.43.64 కోట్లతో పనులు ప్రారంభించగా ఐదేళ్లు దాటుతున్నా ఇంకా పనులు పూర్తికాలేదు. మొదట్లో ఎత్తు పెంపు పనుల్లో భాగంగా వరద తాకిడిని తట్టుకునేందుకు పునాది, ఆప్రాన్ పనులను చేపట్టారు. భూసేకరణ, పరిహారం చెల్లించడంలో జాప్యంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇందులో రూ.13.1 కోట్లను భూసేకరణ కోసం, మిగతా వాటిని ఎత్తు పెంపు పనులకు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఆనకట్ట ఎత్తు 462.775 జీటీఎస్ లెవల్ ఉండగా ఎత్తును 464.7 జీటీఎస్ లెవల్కు పెంచాల్సి ఉంది. తద్వారా పాపన్నపేట, కొల్చారం మండలాల్లోని సుమారు 300 మంది రైతులకు చెందిన 191 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. ఎత్తు పెంచడంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 0.3 టీఎంసీలకు పెరగనుంది. దీంతో అదనంగా ఐదు వేల ఎకరాలకు, మరీ ముఖ్యంగా యాసంగిలో సింగూరుపై ఆధారపడకుండా చివరి ఆయకట్టు వరకు నీటిని అందించవచ్చు. ఎత్తు పెంచే ప్రక్రియలో భాగంగా ముంపునకు గురయ్యే పొలాలకు ఎకరాకు రూ.7.56 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం రూ.13.1 కోట్లకుగాను రూ.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రూ.లక్షలు విలువ చేసే భూములకు ప్రభుత్వం నామమాత్రం పరిహారం ఇస్తుందని గతంలో రైతులు ఆందోళనకు దిగారు. న్యాయంగా పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలన్నారు. నిధులు కూడా పూర్తిగా రాకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పరిహారాన్ని విడుదల చేసి, ఎత్తు పెంచాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
వరద తాకిడిని తట్టుకునేందుకు ఆప్రాన్ను నిర్మించారిలా..
న్యాయపరమైన పరిహారం చెల్లించాలి..- హన్మంతు, రైతు, కొడుపాక
ముంపునకు గురవుతున్న భూములకు న్యాయపరమైన పరిహారం చెల్లించిన తర్వాతే పనులు మొదలుపెట్టాలి. అధికారులు అంచనా వేసిన భూముల కంటే అధికంగా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఎత్తు పెంచితే ఆయకట్టు పరిధిలోని అన్నదాతలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రతిపాదనలు పంపించాం.. - శ్రీనివాసరావు, ఈఈ, నీటి పారుదల శాఖ
భూసేకరణకు సంబంధించిన పరిహారం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు రావాల్సి ఉంది. అవి రాగానే పనులు ప్రారంభిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే