చంపేస్తామంటున్నారు.. న్యాయం చేయండి
భర్త కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని, ఇంటి ఆవరణలో ఉన్న మూత్రశాలను కూలగొట్టారని, ద్విచక్రవాహనాన్ని లాక్కున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని మెదక్ పట్టణం ఫతేనగర్కు చెందిన మౌనిక ఫిర్యాదు చేశారు.
అర్జీదారుడితో మాట్లాడుతున్న ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్, న్యూస్టుడే: భర్త కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని, ఇంటి ఆవరణలో ఉన్న మూత్రశాలను కూలగొట్టారని, ద్విచక్రవాహనాన్ని లాక్కున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని మెదక్ పట్టణం ఫతేనగర్కు చెందిన మౌనిక ఫిర్యాదు చేశారు. సోమవారం మెదక్లోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావిజ్ఞప్తుల దినం నిర్వహించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వినతులు స్వీకరించారు. తన భర్త నవీన్, వాళ్ల అన్నకు మధ్య ఇంటి విషయంలో గొడవలు జరగ్గా, పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ప్రహరీ నిర్మించాలని సూచించడంతో పనులు చేపట్టామన్నారు. చివరకు బాధలు భరించలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని మౌనిక ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్తే తన భర్త అన్న, అతడి భార్య, మూత్రశాల కూలగొట్టి, ద్విచక్రవాహనాన్ని లాక్కున్నారని వివరించారు. న్యాయం చేయాలని ఎస్పీని విన్నవించారు. భూమిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వడం లేదని మాసాయిపేట మండలం నడిమి తండాకు చెందిన మెగావత్ గణేశ్ అర్జీ ఇచ్చారు. మొత్తం 8.10 ఎకరాలు పెద్ద అన్న నాలుగెకరాలు, రెండో అన్న, తల్లి పేరిట రెండెకరాల చొప్పున ఉందని, తనకు రావాల్సిన భూమి ఇవ్వమంటే గొడవ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం