పదోన్నతులు లేక నిరాశ
భాషా పండితులు అనేక సంవత్సరాలుగా ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్నారు. 8 సంవత్సరాల తరువాత ప్రభుత్వం ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ చేడుతుండటంతో వారికీ పదోన్నతి వస్తుందని భావించారు.
భాషా పండితుల నిరసన పథం
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపలిటీ
సంగారెడ్డిలో నినాదాలు చేస్తూ..
భాషా పండితులు అనేక సంవత్సరాలుగా ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్నారు. 8 సంవత్సరాల తరువాత ప్రభుత్వం ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ చేడుతుండటంతో వారికీ పదోన్నతి వస్తుందని భావించారు. అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు. గతంలో భాషా పండితులను అప్గ్రేడ్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు చేయలేదు. ప్రస్తుతమూ ఆ ప్రక్రియ చేపట్టకపోవడంతో భాషా పండితులు నిరసన తెలుపుతున్న తీరుపై కథనం.
462 మంది ఎదురుచూపు
జిల్లాలో 462 మంది భాషోపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరు ఎస్జీటీలుగా బోధన చేస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు మాత్రమే బోధించాలి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ పోస్టులు ఖాళీగా ఉండడంతో 9, 10 తరగతులకూ.. వీరితో బోధన చేయిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పాఠశాలలో సేవలందిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా పదోన్నతి రాకపోవడంతో నష్టపోతున్నారు. 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పదోన్నతులపై హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. వీరితో పాటే విధుల్లో చేరిన ఇతర ఎస్జీటీలు ఇప్పటికే రెండు సార్లు పదోన్నతి పొందినా..భాషోపాధ్యాయులను పట్టించుకోలేదు. 20-25 సంవత్సరాలుగా ఒక్క సారైనా పదోన్నతి పొందకుండా అదే కేడర్లో కొనసాగుతున్నారు. పీఈటీలదీ ఇదే పరిస్థితి. వారిని అప్గ్రేడ్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదు. వీరు ఉన్నత పాఠశాలల్లో పీడీలతో సమానంగా విద్యార్థులకు సేవలందిస్తున్నారు. జిల్లాలో పీఈటీలు 122 మంది పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు.
9,10 తరగతులకు సహాయ నిరాకరణ: పదోన్నతులు కల్పించాలని కోరుతూ భాషా పండితులు నిరసన పథాన్ని ఎంచుకున్నారు. ఐకాసను ఏర్పాటు చేసుకొని.. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి నిబంధనల ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే బోధిస్తున్నారు. 9, 10 తరగతులకు బోధన చేయకుండా.. సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారికి విన్నవించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
న్యాయం చేసే వరకు ఆందోళనలు
- చంద్రమోహన్, భాషా పండితుల ఐకాస ప్రతినిధి
భాషా పండితులు 20 సంవత్సరాలుగా పని చేస్తున్నా.. ఒక్కసారైనా పదోన్నతి కల్పించలేదు. అందరికీ అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం తమను విస్మరించడం అన్యాయం. ఎస్జీటీ కేడర్లో నియమితులైనా.. స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా ఉన్నత పాఠశాలల్లో బోధన చేస్తున్నాం. న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే