Harish Rao: కేసీఆర్కు పనితనం తప్ప.. పగతనం తెలియదు: హరీశ్రావు
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. పనితప్ప పగతనం తెలియని నాయకుడని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
నర్సాపూర్: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. పనితప్ప పగతనం తెలియని నాయకుడని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. నర్సాపూర్లో ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారాస కృతజ్ఞత సభలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారాస ప్రభుత్వం వచ్చాక హౌసింగ్ స్కామ్లో కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవాళ్లని ఆరోపించారు. సాధించిన తెలంగాణలో కక్షలతో, పగలతో ఇబ్బంది పడకూడదని కేసీఆర్ పనిమీద దృష్టి పెట్టారని గుర్తు చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేసి.. ప్రజల కోసం పనిచేశామన్నారు.
రాజకీయాల్లో గెలుపు.. ఓటములు సహజమని, వాటిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తామన్నారు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్, పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి విజయం వైపు అడుగులు వేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 2001 నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించాం... అపజయాలను కూడా చూశామన్నారు. విజయాలు సాధించినప్పుడు విర్రవీగలేదు.. అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోలేదని పేర్కొన్నారు. ఎంత ఎదిగితే అంత ఒదిగి పనిచేశామని గుర్తు చేశారు.
ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్..
‘‘నర్సాపూర్లో గెలిచిన పార్టీ రాష్ట్రంలో గెలవలేదనే బాధ ఉంది. తాత్కాలికంగా వేగం తగ్గొచ్చుకానీ.. అంతిమంగా గమ్యం చేరేది భారాసనే. ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అద్భుతమైన భవిష్యత్తు ఉండేది భారాస పార్టీకే. కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని, కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని అధికార పార్టీ వాళ్లు చూస్తారు. ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దు. నర్సాపూర్ భారాసకు కంచుకోట అని నిరూపించారు. నర్సాపూర్లో హ్యాట్రిక్ కొట్టడం సంతోషంగా ఉంది’’ అని హరీశ్రావు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
-
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
-
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్