గుంత పూడ్చడానికీ.. డబ్బుల్లేవ్..!
కొత్త రహదారుల నిర్మాణంతో పాటు పాత వాటిపై ఉన్న గుంతలను పూడ్చాల్సిన బాధ్యత రహదారులు, భవనాల శాఖది.
పార్వతీపురం-కూనేరు రహదారిపై అర్తాం వద్ద పరిస్థితి
పార్వతీపురం, న్యూస్టుడే: కొత్త రహదారుల నిర్మాణంతో పాటు పాత వాటిపై ఉన్న గుంతలను పూడ్చాల్సిన బాధ్యత రహదారులు, భవనాల శాఖది. జిల్లాలో ఏటా రోడ్ల నిర్వహణకు రూ.కోటిన్నర వరకు అవసరం కాగా ప్రభుత్వం బడ్జెట్లో 272 ప్రధాన పద్దులో కేటాయిస్తుంది. జిల్లాల వారీగా సమర్పించిన ప్రతిపాదనల మేరకు విడుదల చేస్తుంది. ప్రస్తుతం నిర్వహణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ర.భ.శాఖ ఆధ్వర్యంలో రోడ్లపై గుంతలున్నా బాగు చేయలేని పరిస్థితిలో ఇంజినీరింగ్ విభాగం ఉండిపోతోంది.
ఒడిశా, ఛత్తీస్గఢ్కు భారీ వాహనాలు జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తుండటంతో ఎక్కడికక్కడ రహదారులపై గోతులు పడుతున్నాయి. ఈ సమయంలో వర్షాలు పడితే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. గతంలో రాష్ట్ర హైవేల నిర్వహణ బాధ్యతను ఐదేళ్ల పాటు గుత్తేదారులకు అప్పగించేవారు. పెద్దా, చిన్నా లేకుండా ఎలాంటి మరమ్మతులు అయినా వారు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎక్కడైనా గుంతలు పడితే వాటిని పూడ్చడానికి ప్రభుత్వమే నిధులు విడుదల చేస్తూ వస్తుంది. 2022-23లో నిర్వహణ పనులకు రాష్ట్ర రహదారులకు రూ.77 లక్షలు, జిల్లా స్థాయి మేజర్ రోడ్లకు రూ.54 లక్షలు మంజూరయ్యాయి. దీంతో పనులు చేపట్టగా ఇప్పటికీ కొన్నింటికి బిల్లుల చెల్లింపులు జరగలేదు.
బాగు చేయాల్సి ఉంది
జిల్లాలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో 463.726 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిలో 180 కిలోమీటర్ల పొడవున నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది. దీని కోసం రూ.85.54 లక్షలు అవసరమవుతుంది. కురుపాం, బలిజిపేట, సీతంపేట, తోటపల్లి, వీరఘట్టం, సీతానగరం సెక్షన్ల పరిధిలో 15 కిలోమీటర్లకు పైగా రహదారులను మెరుగుపర్చాల్సి ఉందని ర.భ.శాఖ అంచనా వేసింది. వీటితో పాటు మేజర్ జిల్లా రహదారులు, జిల్లా రహదారులు 565.813 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. వీటిలో 297 కిలోమీటర్ల మేర ఈ ఏడాది నిర్వహణ పనులు చేపట్టాలి. ఇందుకోసం రూ.120.31 లక్షలు అవసరమని ప్రతిపాదించారు. ఇప్పటికే పలు చోట్ల రోడ్లు పాడవుతున్న నేపథ్యంలో వాటిని బాగు చేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
నిధులు వస్తాయని చూస్తున్నాం
ఏటా రహదారుల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఈ సారి రూ.205.85 లక్షలతో జిల్లాలో రాష్ట్ర, జిల్లా రహదారుల నిర్వహణకు ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటి వరకు మంజూరు కాలేదు. అత్యవసర పనులు గుర్తించి ఉన్నంతలో చేస్తున్నాం. గతేడాది నిర్వహణ పనులు కూడా పూర్తి చేశాం. దానికి సంబంధించి కొంత మొత్తం రావాల్సి ఉంది. ఈ ఏడాది కూడా నిధులు వస్తాయని ఆశిస్తున్నాం. వచ్చిన వెంటనే ప్రతిపాదిత పనులు చేస్తాం.
జేమ్స్, ర.భ.శాఖ ఈఈ, పార్వతీపురం మన్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజల గొంతులో గరళం!
[ 20-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పుర, నగర పాలక, నగర పంచాయతీల ప్రజలకు స్వచ్ఛజలం అందడం లేదు. చాలా చోట్ల రంగుమారి.. మురుగు వాసన, నలకలతో సరఫరా అవుతోంది. తాగునీటి పథకాలను, రిజర్వాయర్లను శుభ్రం చేయకపోవడం, -
ముంచెత్తిన వర్షం
[ 20-05-2024]
పార్వతీపురంలో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా నాలుగు గంటల పాటు ఉరుములు, పిడుగులతో ఎడతెరిపి లేకుండా పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. -
కాలువలకు గండ్లు.. రైతులకు కడగండ్లు
[ 20-05-2024]
ఏటా వర్షాభావంతో కరవు దోబూచులాడుతోంది. ప్రకృతిసిద్ధంగా వనరులు అపారంగా ఉన్నా.. సాగుజలం వట్టిమాటే అవుతోంది. ఓ వైపు ఖరీఫ్ ముంచుకొస్తున్నా.. ప్రాజెక్టుల ఆధునికీకరణపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. -
నాలుగేళ్లయినా బాలారిష్టాలే!
[ 20-05-2024]
ఉత్తరాంధ్రకు సంబంధించి గరివిడిలో ఏర్పాటైన పశు వైద్య (వెటర్నరీ సైన్స్) కళాశాల వైకాపా పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా సమస్యలతో మూలుగుతోంది. కళాశాలను ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా.. -
వారధి కిందే అక్రమ తవ్వకాలు
[ 20-05-2024]
ఎన్నికల అనంతరం అధికార యంత్రాంగంలో నెలకొన్న స్తబ్ధతను సైతం అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సంతకవిటి మండలం రంగరాయపురం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న వంతెన కాంక్రీటు పిల్లర్ల వద్ద యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. -
కేజీబీవీల్లో అక్రమాలు..!
[ 20-05-2024]
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీలు) అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ నిధులు సైతం దుర్వినియోగం అవుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది. -
ఆయకట్టు ఆయువు తీసేశారు
[ 20-05-2024]
అధికారికంగా 2,200 ఎకరాల ఆయకట్టు.. అనధికారికంగా మరో 500 ఎకరాలు.. వందలాది మంది రైతులకు ప్రధాన నీటి వనరు.. 40కు పైగా చెరువులకు దిక్కైన ఎస్.కోట మండలంలోని చిలకలగెడ్డ ఆనకట్ట పాలకుల తీరుతో నేడు అధ్వాన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
పట్టాలిచ్చినా ప్రయోజనం శూన్యం
[ 20-05-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజలకు గ్రామీణ మండలంలోని కొండకరకం సమీపంలోని ఓ కొండపై జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ నాలుగేళ్ల కిందట దాదాపు 2,500 మందికిపైగా లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. -
సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
తొలకరికి ముందే వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు విత్తనాలను అందించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ సైతం సమయాత్తమవుతోంది. -
నారాయణపురం ఆనకట్ట వెలవెల
[ 20-05-2024]
సంతకవిటి మండలంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఇది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని 50 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు పలు మండలాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టుది కీలక భూమిక.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ- సుకుమార్ కాంబో.. అప్డేట్ ఇచ్చిన నిర్మాత
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి