అమ్ముడుపోని తునికాకు యూనిట్లు
ఈ ఏడాదిలో తునికాకు కూలీల ఉపాధికి పెద్ద మొత్తంలో గండి పడనుంది. జిల్లా వ్యాప్తంగా 16 తునికాకు యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.
ఉపాధి కోల్పోనున్న కూలీలు
చిగురిస్తున్న తునికాకు
భూపాలపల్లి, న్యూస్టుడే: ఈ ఏడాదిలో తునికాకు కూలీల ఉపాధికి పెద్ద మొత్తంలో గండి పడనుంది. జిల్లా వ్యాప్తంగా 16 తునికాకు యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మిగతా 19 యూనిట్లలో ఆకు సేకరణ నిలిచిపోవడంతో ఆయా అటవీ గ్రామాలకు చెందిన వేలాది మంది కూలీలకు వేసవిలో ఉపాధి లేకుండా పోయింది. వేసవిలో వ్యవసాయ పనులు అంతగా లేెకపోవడంతో అటవీ గ్రామాలకు చెందిన వేలాది మంది కూలీలు తునికాకు సేకరణతో ఉపాధి పొందుతారు. తునికాకు సేకరణ మే మొదటి వారంలో ప్రారంభించనున్నారు. టెండర్లు పొందిన గుత్తేదారులు ఆకు సేకరణ చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ మేరకు జిల్లాలోని చాలా వరకు అటవీ గ్రామాల్లో అనేక మంది కూలీలు ఆకు సేకరణపైనే ఆధారపడతారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలోనే అడవి బాటపడతారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల్లోపే ఆకును సేకరించుకొని మళ్లీ ఇంటికి చేరుకుంటారు. ఇళ్లలోనే కుటుంబ సభ్యులందరూ కలిసి కట్టలు కట్టి, వాటిని విక్రయించి ఆదాయం సమకూర్చుకుంటారు. ఏటా కూలీలు, కొందరు వ్యవసాయ రైతులు తునికాకు సేకరణపైనే ఆసక్తి చూపుతారు.
జిల్లాలోని రెండు అటవీ డివిజన్లలో మొత్తం 35 వరకు తునికాకు యూనిట్లు ఉన్నాయి. యూనిట్ల వారీగా ఆన్లైన్లోనే టెండర్లు నిర్వహించారు. ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు నాలుగుసార్లు చేపట్టిన తునికాకు యూనిట్ల టెండర్లలో జిల్లావ్యాప్తంగా కేవలం 16 యూనిట్ల వరకే అమ్ముడుపోయాయి. మిగతా 19 యూనిట్లలో ఆకు సేకరణ కోసం గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ యూనిట్లలో ఆకు సేకరణ దాదాపు నిలిచిపోయినట్లే.. అమ్ముడుపోయిన యూనిట్లలోనే గుత్తేదారులు ఆకు సేకరిస్తారు. అయితే ముందుగా నాణ్యతగా తునికాకు రావడానికి కొందరు గుత్తేదారులు కొమ్మకొట్టడం(ప్రూనింగ్) చేయిస్తారు. కానీ, ఈ పని కూడా కొన్నేళ్లుగా చాలా వరకు యూనిట్లలో గుత్తేదారులు చేపట్టలేకపోతున్నారు.
ఆకు సేకరణ లక్ష్యం..
జిల్లాలోని మహదేవపూర్, భూపాలపల్లి అటవీ డివిజన్లలో మొత్తం 35 తునికాకు యూనిట్లలో ఈ ఏడాదిలో 38,400 స్టాండర్డ్ బ్యాగుల(ఎస్బీ) లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ఇందులో భూపాలపల్లి అటవీ డివిజన్లో 19 యూనిట్లకు 19,800 ఎస్బీల లక్ష్యం కాగా, ఈ డివిజన్లో మొత్తం కల్లాలు 119 వరకు ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ డివిజన్ పరిధిలో కేవలం 5 యూనిట్లు అమ్ముడుపోగా మిగతా 14 అమ్ముడుపోలేదు. అదేవిధంగా మహదేవపూర్ డివిజన్లో 16 యూనిట్లలో 20,100 ఎస్బీల లక్ష్యం.. ఈ డివిజన్లో మొత్తం 112 కల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డివిజన్లో 11 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇంకా 5 యూనిట్లలో ఆకు సేకరణ కోసం గుత్తేదారులు ముందుకు రాలేదు. దీంతో అమ్ముడుపోని యూనిట్లలో ఆకు సేకరణ నిలిచిపోనుంది. ఒక్క ఎస్బీలో వెయ్యి తునికాకు కట్టలుంటాయి. ఈ లెక్క ప్రకారమే కూలీలకు డబ్బులు చెల్లిస్తారు. 50 ఆకుల తునికాకు కట్టకు రూ.రూ.1.40 పైసల చొప్పున గుత్తేదారులు చెల్లిస్తారు. ఒక ఎస్బీపై వచ్చే కూలీకి రూ.1,450 వరకు అందుతాయి. అయితే జిల్లావ్యాప్తంగా కూలీలు నష్టపోకుండా రెండు అటవీ డివిజన్లలో అమ్ముడుపోని తునికాకు యూనిట్లలో ప్రభుత్వమే ఆకు సేకరణ చేపట్టాలని పలు అటవీ గ్రామాల కూలీలు, సీపీఎం నాయకులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులను అరికట్టేందుకు.. మహిళా కమిటీలు
[ 20-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. -
నగరం.. చినుకులకే వణుకుతోంది..!
[ 20-05-2024]
‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’ -
కొలువు కల్ల.. జేబు గుల్ల!
[ 20-05-2024]
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు. -
ఆడిట్ విభాగంలో లెక్కలేనితనం
[ 20-05-2024]
గతేడాది సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేష్ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు. -
బాల చోదకులు.. ప్రమాద కారకులు
[ 20-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్లు వాహనాలు నడుపుతూ.. తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నా.. తీరు మారడం లేదు. -
ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సమన్వయకర్తలు వీరే
[ 20-05-2024]
వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకు భారాస ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాకేశ్రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సెగ్మెంటు వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
అతివలకు ఉపాధి వెలుగులు
[ 20-05-2024]
విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
‘విద్యావంతుడైన రాకేశ్రెడ్డిని గెలిపించుకుందాం’
[ 20-05-2024]
-
పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే
[ 20-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. -
వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్!
[ 20-05-2024]
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. -
భారాస గెలుపునకు కృషి చేయాలి..
[ 20-05-2024]
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
కిసాన్ నిధి.. కొందరికేనా?
[ 20-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. -
వరి వైపే మొగ్గు
[ 20-05-2024]
జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు. -
మోడికుంట.. కాలయాపన ఎందుకంట?
[ 20-05-2024]
సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా