icon icon icon
icon icon icon

రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే అధికారులపై వేటు తప్పదు: సాధినేని యామినీశర్మ

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే అధికారులపై వేటు తప్పదని భాజపా అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ పేర్కొన్నారు.

Published : 25 Apr 2024 06:04 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే అధికారులపై వేటు తప్పదని భాజపా అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా అందుకే బదిలీ అయ్యారని తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘కేంద్రం పదేళ్లుగా కుల, మత భేదాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించింది. కాంగ్రెస్‌ మాత్రం మైనారిటీలను తమ ఓటు బ్యాంకు కోసం వినియోగించుకుంటోంది’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img