విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాం
‘వైకాపా పాలనలో విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చాం. నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేశాం. పిల్లలు బడికి వెళితే చాలు.. విద్యాకానుక, అమ్మఒడి ద్వారా వారికి చేయూతగా నిలిచాం.
చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు
నరసాపురం సభలో సీఎం జగన్
2.15 గంటల ఆలస్యంగా వచ్చిన సీఎం
మండుటెండలో ప్రజల అవస్థలు
ఈనాడు, భీమవరం, ఈనాడు డిజిటల్, నరసరావుపేట, కనిగిరి, న్యూస్టుడే: : ‘వైకాపా పాలనలో విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చాం. నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేశాం. పిల్లలు బడికి వెళితే చాలు.. విద్యాకానుక, అమ్మఒడి ద్వారా వారికి చేయూతగా నిలిచాం. విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చి బాసటగా నిలిచాం. బైజ్యూస్ కంటెంట్, డిజిటల్ బోధన, ట్యాబ్లు ఇచ్చి విద్యారంగాన్ని అభివృద్ధి చేశాం. మూడు సార్లు, 14 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసి పేదలకు చేసిన ఒక్క మేలు కూడా లేదు. వారి కోసం ప్రవేశపెట్టిన ఒక్క పథకమూ గుర్తు రాదు’ అని సీఎం జగన్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పల్నాడు జిల్లా క్రోసూరు, ప్రకాశం జిల్లా కనిగిరిలో శుక్రవారం నిర్వహించిన ‘జగన్ కోసం సిద్ధం’ సభల్లో ఆయన ప్రసంగించారు. మరో పదిరోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవే కావని, మీ ఇంటి భవిష్యత్తును నిర్ణయించేవని ఆయన అన్నారు. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు తన బాణాన్ని నేరుగా పేద వర్గాలు, నా అవ్వాతాతలు, వారి పింఛన్ల మీద గురిపెట్టారని విమర్శించారు. చంద్రబాబు సాధ్యంకాని హామీలతో ఇచ్చిన మ్యానిఫెస్టోకు అర్థం లేదన్నారు. ఈ అయిదేళ్లలో కూడా ప్రతిఒక్క రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు మ్యానిఫెస్టో అంతా మోసాలపుట్ట అని వీటిని ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. ఈసారి సూపర్ సిక్స్ అని, సూపర్ సెవెన్ అని అంటున్నారు నమ్ముతారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ స్థానాలు 175కు 175, ఎంపీ స్థానాలు 25కు 25 రావాలన్నారు. ‘ఆడబిడ్డలకు చేయూత, ఆసరా, సున్నావడ్డీ రుణాలతో పాటు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. రైతులకు రైతుభరోసా, 9 గంటలు పగటిపూట విద్యుత్తు, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేస్తూ అండగా నిలిచాం. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తించేలా చేసి పథకం ద్వారా చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా అందిస్తున్నాం. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ తదితర సేవలు అందిస్తున్నాం. సచివాలయాల ద్వారా 600 రకాల సేవలు అందిస్తున్నాం’ అని సీఎం జగన్ తెలిపారు. ‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరితో ప్రమేయం లేకుండా నేరుగా మీ ఖాతాల్లో పథకాల సొమ్మును జమ చేస్తున్నాం. అవ్వాతాతలకు 3 వేల పింఛన్ అందించి చరిత్ర సృష్టించాం’ అని జగన్ వివరించారు.
దుకాణాలు మూసివేత..డివైడర్ తొలగింపు
నరసాపురంలో సభ కోసం ఆ రహదారిలోని దుకాణాలను పోలీసులు ఉదయం నుంచే మూయించారు. డివైడర్ను అడ్డగోలుగా కొట్టేశారు. డివైడర్ మీద ఉన్న విద్యుత్తు స్తంభాన్ని తొలగించేశారు. బ్యారికేడ్లు అడ్డుగాపెట్టి వాహనాల రాకపోకలను నిరోధించారు. నియమావళి ఉన్నా భారీ ప్లెక్సీలను ఏర్పాటుచేశారు.
అసలే ఎండ.. ఆపై ఆలస్యం
నరసాపురం సభ కోసం ఉదయం 8 గంటలకే జనాలను తీసుకొచ్చారు. ఒక్కొక్కరికి రూ.200 చొప్పున ఇచ్చి ఆటోల్లో తరలించారు. ఉదయం పది గంటల్లోగా సభా ప్రాంగణానికి రావాల్సిన జగన్ మధ్యాహ్నం 12.15కి ప్రచార వాహనంపైకి రావడంతో ఎండకు జనాలు అల్లాడిపోయారు. నిలబడలేక జగన్ రాక ముందే వందల సంఖ్యలో జనం వెనుదిరిగారు. కొందరు దుకాణాల నీడన తలదాచుకున్నారు. పోలీసులు తమ విధులను విస్మరించి వచ్చిన వారికి మజ్జిగ, నీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తూ వైకాపా సేవలో తరించారు. సభ నేపథ్యంలో నరసాపురం బస్టాండ్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
మండుటెండలో క్రోసూరులో జనం ఇబ్బందులు
క్రోసూరు సభకు జనాన్ని తరలించేందుకు రూ.200 నగదు, రూ.200 పెట్రోల్ కూపన్, ఒక మద్యం సీసా పంపిణీ చేశారు. కొందరు యువకులు నడిరోడ్డుపై ఒకచేత్తో మద్యం సీసాలు, మరోచేత్తో పార్టీ జెండాలు పట్టుకుని తిరిగారు. సభకు వచ్చే వారిలో పలువురు ఎక్కడికక్కడ మద్యం తాగుతూ కనిపించారు. మధ్యాహ్నం 12.30గంటలకు జగన్ రావాల్సి ఉండగా ఆలస్యంగా 2 గంటలకు వచ్చారు. అరగంటలో ప్రసంగించి వెళ్లిపోయారు. జగన్ ప్రసంగంలో కొత్తదనం లేదు.
పదేపదే చెప్పిందే చెప్పి..
కనిగిరి సభలో జగన్ ప్రసంగమంతా అవ్వాతాతల పింఛన్ల చుట్టూనే సాగింది. పదే పదే తాను చేసిందే గొప్ప అన్నట్లు చెబుతూ సభకు వచ్చిన జనాల చేత బలవంతంగా చేతులు పైకి ఎత్తి చూపాలని మైకు పైకి ఎత్తారు. ఇలా పదే పదే చేతులు ఊపాలని చెప్పడంతో జనం నవ్వుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై, జనసేన గుర్తుపై విమర్శలు చేశారు. అయినా ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. సీఎం ప్రసంగం మొత్తంలో ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజకవర్గం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. పాత హామీల గురించి సైతం మాట్లాడకపోగా, కొత్తగా ఒక్క అభివృద్ధి పనినైనా చేస్తానని హామీ ఇవ్వలేదు. జగన్ ప్రసంగం చప్పగా సాగడం, పాత మాటలే చెప్పడంతో జనం నుంచి స్పందన కరవైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు
-
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
-
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్