ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
ముగ్గురు ఎస్పీలు, ఒక కలెక్టర్పై ఈసీకి సీఎస్ నివేదిక
పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్కు సిఫారసు
పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయాలని సూచన
సీఎస్ నివేదిక ఆధారంగానే చర్యలు చేపట్టిన ఈసీ
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు. వారిలో పల్నాడు ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్లను సస్పెండ్ చేయాలని, పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్లను బదిలీ చేయాలని, ఈ నలుగురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. రాష్ట్ర డీజీపీ హరీశ్కుమార్ గుప్తా, నిఘా విభాగం అదనపు డీజీ కుమార్ విశ్వజిత్లతో చర్చించాకే ఆ నివేదిక సమర్పించినట్టు పేర్కొన్నారు. సీఎస్ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం ఆ నలుగురు అధికారులపై వెంటనే చర్యలు చేపట్టింది. సీఎస్ నివేదికలోని ముఖ్యాంశాలు ఇవీ..!
హింసను నివారించడంలో వైఫల్యం
పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజున, అనంతరం హింసాకాండ చెలరేగింది. 15 ఈవీఎంలను ధ్వంసం చేశారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో పోలీసుల్ని, భద్రతా సిబ్బందిని మోహరించినా ఆ ఘటనలు జరిగాయి. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ నేతృత్వంలోని పోలీసు యంత్రాంగం వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఎస్పీ విధి నిర్వహణలో వృత్తిపరమైన నిబద్ధత కనబరచలేదు. క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేయడంలో, సమాచారాన్ని పైఅధికారుల దృష్టికి తేవడంలో విఫలమయ్యారు. ఆయనను సస్పెండ్ చేసి, కఠినమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి.
పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ పోలీసులు, ఇతర భద్రతా బలగాలతో సమన్వయం చేసుకుని హింసను నివారించడంలో విఫలమయ్యారు. విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత కనబరచలేదు. ఎన్నికల ప్రక్రియ ఇంకా మిగిలి ఉన్నందున, ఆయనను కలెక్టర్గా కొనసాగించడం సరికాదు. శివశంకర్ను బదిలీ చేసి, క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి.
హింసాకాండను పసిగట్టలేదు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ నెల 13, 14 తేదీల్లో హింసాకాండ చెలరేగింది. అక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఎప్పట్నుంచో శత్రుత్వం ఉంది. ఆ విషయం తెలిసినా శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్పీ అమిత్బర్దర్ విఫలమయ్యారు. ఇరుపక్షాలు అక్కడ రాళ్లగుట్టలు సిద్ధం చేస్తున్నా... గుర్తించడంలో విఫలమయ్యారు. దానివల్లే ఈ నెల 13, 14 తేదీల్లో ఇరుపక్షాలు రాళ్లు విసురుకుని దాడులకు పాల్పడ్డాయి. ఇరువర్గాల కదలికలపై నిఘా ఉంచి, వారు అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా ఎస్పీ నిరోధించలేకపోయారు. జిల్లాలో పారామిలిటరీ దళాలు ఉన్నా రాళ్లదాడి జరిగింది. హింసాకాండను ముందుగా పసిగట్టి, నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమైన ఎస్పీ అమిత్ బర్దర్ని సస్పెండ్ చేసి, క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి.
తిరుపతిలో నిఘా వైఫల్యం
చంద్రగిరిలో గతంలోనూ ఎన్నికల హింస జరిగింది. అది తెలిసినా ఎస్పీ ముందుజాగ్రత్తలు తీసుకోలేదు. పోలింగ్ రోజున వైకాపా అభ్యర్థి వాహనాన్ని తెదేపావాళ్లు తగలబెట్టారు. ఆ గ్రామంలో హింసాకాండ చోటుచేసుకుంది. మర్నాడు తిరుపతిలో తెదేపా అభ్యర్థిపై వైకాపా వర్గీయులు దాడిచేశారు. అభ్యర్థి భద్రతా సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే రెండు పార్టీలవారు పెద్దసంఖ్యలో చేరుకుని, పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని ఉండాల్సింది. 144 సెక్షన్ విధించినా పెద్దసంఖ్యలో జనం గుమిగూడారంటే... నిఘావైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణకాంత్ పటేల్ను బదిలీ చేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే