BJP: కేంద్రం ఇచ్చిన నిధులను వైకాపా ప్రభుత్వం వృథా చేసింది: పీయూష్ గోయల్
గడిచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏపీని ఎంతో వెనక్కి తీసుకెళ్లిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
విజయవాడ: గడిచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏపీని ఎంతో వెనక్కి తీసుకెళ్లిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం, ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వృథా చేశారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం మారబోతోందని చెప్పారు. ప్రతి నెలా దేశంలో ఉన్న పేదలందరికీ ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ముద్రా యోజన పథకం ద్వారా స్టార్టప్ కంపెనీలకు చేయూతనిస్తున్నట్లు పీయూష్ గోయల్ వివరించారు.
‘‘ఏపీలో కూటమి విజయం సాధించాలని కోరుకుంటున్నా. రాష్ట్రాభివృద్ధికి ఎన్నో సహజ వనరులున్నాయి. ఈ ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదు. ఆ పార్టీ నాయకులు శాండ్, ల్యాండ్, లిక్కర్ మాఫియాలతో రూ.కోట్లు దోచుకున్నారు. ప్రధాని ఆవాస్ యోజన కింద 23 లక్షల ఇళ్లు ఏపీకి మోదీ కేటాయించారు. అందులో కేవలం 3.5 లక్షల ఇళ్లే జగన్ ప్రభుత్వం నిర్మాణం చేసింది. కేంద్రం ఇచ్చిన రూ.వేల కోట్ల నిధులను దారి మళ్లించారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలో పెట్టారు. రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూమిని జగన్ కేటాయించడం లేదు. ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే విశాఖ రైల్వే జోన్ సాకారమవుతుంది. పంచాయతీలకు కేటాయించిన నిధులను వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. గ్రామాలను అభివృద్ధి చేయకుండా జగన్ సొంత అవసరాలకు ఆ డబ్బులు వాడారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా నాశనం చేశారు’’ అని పీయూష్ గోయల్ విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీ, సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: కనకమేడల
డీజీపీ, సీఎస్ను వెంటనే బదిలీ చేయాలని సీఈసీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెదేపా సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. -
పోస్టల్ బ్యాలెట్.. నరసన్నపేటలో ఓపెన్గానే ఓటేశారు!
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది. నరసన్నపేట మండల పోలింగ్ కేంద్రానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. -
కనీవినీ ఎరగని బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం: షర్మిల
‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. ‘‘మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడ? పాక్షికంగానైనా అమలవుతోందా?.. -
పొన్నూరులో పవన్ సభ.. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ను ధ్వంసం చేసిన వైకాపా నేతలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సిన హెలిప్యాడ్ను వైకాపా నేతలు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. -
ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరుడి ఇటుకల బట్టీ వద్ద మద్యం డంప్
తిరుపతి జిల్లా పాకాల మండలంలో పెద్దఎత్తున మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల తర్వాత ఒక్కొక్క నా కొ.. కథ చెబుతా: రోడ్షోలో వైకాపా అభ్యర్థి బెదిరింపులు
ఎన్నికల్లో అడ్డుపడితే.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక్కొక్క నా కొ... కథ చెబుతానంటూ ఉరవకొండ వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి బహిరంగంగా బెదిరింపులకు దిగారు. -
మాజీ వాలంటీర్లకు వైకాపా డబ్బు సంచులు!
పోలింగ్ సమీపిస్తున్నవేళ.. రాజీనామాలు చేసిన వాలంటీర్ల చేత ఓటర్లకు డబ్బు పంచేందుకు వైకాపా నేతలు కుట్ర పన్నారు. -
రాచమల్లు అతి తెలివి.. వృద్ధుల వద్ద నటిస్తూ కుటిల రాజకీయాలు!
బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో పదేళ్లుగా కొనసాగుతున్న వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే, అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డి నోటి నుంచి నిరంతరం బూతుల జల్లు కురుస్తుంటుంది. -
‘ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపుతా’
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి... భాజపా అభ్యర్థి సత్యకుమార్ను ఉద్దేశిస్తూ బెదిరింపులు, దూషణలకు దిగారు. -
160కి పైగా గెలుస్తాం.. 25 ఎంపీ స్థానాలూ మనవే
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 160కిపైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
ఏ-1 కిట్టు.. యథావిధిగా ప్రచారం
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. ఇంకా పోలీసులు వైకాపా కోడ్నే అనుసరిస్తున్నారు. అరెస్టు విషయంలోనూ పక్షపాతం చూపిస్తున్నారు. -
‘ఇంటి నుంచే ఓటు’లో వైకాపా చొరబాటు
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వరకు రాలేని దివ్యాంగులు, వృద్థుల కోసం ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘ఇంటి నుంచే ఓటు’ ప్రక్రియలో వైకాపా నాయకులు చొరబడుతున్నారు. -
పవన్ను తిట్టించడానికే నాన్నను జగన్ వాడుకుంటున్నారు
ఇటీవల వైకాపాలో చేరి, పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శల దాడి చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి.. ఆయన సొంత కుమార్తె బార్లపూడి క్రాంతి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. -
విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాం
‘వైకాపా పాలనలో విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చాం. నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేశాం. పిల్లలు బడికి వెళితే చాలు.. విద్యాకానుక, అమ్మఒడి ద్వారా వారికి చేయూతగా నిలిచాం. -
పాటల్లోనూ సవాళ్లు, ప్రతిసవాళ్లూ.. అధికార పార్టీని ఎండగడుతున్న ప్రతిపక్షాలు
‘జూలు విప్పి దూకిండు ఎల్లో సింగమూ.. దడుసుకుని ఉరుకుతది రౌడీ సంఘమూ’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబుపై ఇటీవల విడుదలైన పాట.. ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపింది. -
నగరిలో మంత్రి రోజాకు ఎదురుదెబ్బ
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజాకు ఎదురుదెబ్బ తగిలింది. -
తెదేపా మహిళా నేతలపై వైకాపా అసభ్యకర పోస్టులు
-
ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి
అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా చూస్తూ ఎన్నికల్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర అధికారులను... కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్వ్యాస్ ఆదేశించారు. -
జగన్ పాలనలో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనే దుస్థితి
సీఎం జగన్ పాలనలో నెలల తరబడి జీతాలు అందక.. ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితులు చూసి చలించిపోయా. -
ప్రజల ఆస్తుల కబ్జాకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం
రాష్ట్రంలోని బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులు, ఎన్నారైల ఆస్తులను కబ్జా చేయడానికే సీఎం జగన్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చారని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతుల మెడకు ఉచ్చు
ల్యాండ్ టైటిలింగ్ చట్టం రైతుల మెడకు ఉచ్చు బిగించేలా ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ విమర్శించారు.
తాజా వార్తలు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి