ప్రభుత్వం కోసం చూడకుండా..ప్రాణాలు కోల్పోకుండా!
ఓపక్క కరోనా మహమ్మారి ప్రళయాగ్నిలా వ్యాపిస్తోంది. దాని నుంచి తప్పించుకుందామన్నా వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. కాస్తోకూస్తో పలుకుబడి ఉన్నవాళ్లు ఏదో విధంగా టీకా వేయించుకుంటున్నా.. సామాన్యులకు అవసరమైనంత మేర వ్యాక్సిన్ లభ్యం కావడం లేదు....
దాతల సొమ్ముతో 13 గ్రామాల ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్
ఆదర్శంగా నిలుస్తున్న మొహాలీ డిప్యూటీ కమిషనర్ ఆలోచన
ఇంటర్నెట్ డెస్క్: ఓ పక్క కరోనా మహమ్మారి ప్రళయాగ్నిలా వ్యాపిస్తోంది. దాని నుంచి తప్పించుకుందామన్నా వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. కాస్తోకూస్తో పలుకుబడి ఉన్నవాళ్లు ఏదో విధంగా టీకా వేయించుకుంటున్నా.. సామాన్యులకు అవసరమైనంత మేర వ్యాక్సిన్ లభ్యం కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్లోని మొహాలీ డిప్యూటీ కమిషనర్ ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఎంతో మంది అభాగ్యులకు ఉచితంగా టీకాలు వేయిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ ఆపత్కాలంలో నేనున్నానంటూ అందరికీ భరోసా ఇస్తున్నారు. అయితే అది ఆయన ఒక్కరి వల్లే సాధ్యం కాలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా టీకా ప్రాధాన్యత ప్రత్యేకించి చెప్పక్కనర్లేదు. ఎడారిలో ఒయాసిస్లా ప్రాణాలపై ఆశలు పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్కు కొరత ఏర్పడినప్పటికీ మొహాలీలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం అసలు వ్యాక్సిన్ సమస్యే కనిపించడం లేదు. మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. డిప్యూటీ కమిషనర్ గిరీశ్ దయాలన్ ఆలోచనే దీనికి కారణం. కొవిడ్ సోకి సకాలంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆయన్ని కలచి వేశాయి. అందరికీ వ్యాక్సిన్ వేయడమే దీనికి సరైన పరిష్కారమని అనుకున్నారాయన. అయితే సొంత డబ్బుతో వ్యాక్సిన్లు కొనుగోలు చేసి వేయించడం అంత సామాన్యమైన పని కాదు. ఎవరో వచ్చి వ్యాక్సిన్లు వేస్తారనుకుంటే ఈలోగా ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో తెలియదు. దీంతో ప్రయోగాత్మకంగా తోటి అధికారులతో కలిసి ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ ఊర్లో 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి అక్కడి నుంచే సొంత డబ్బుతో వ్యాక్సిన్లు కొనుగోలు చేశారు. ఆ విషయం ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కలా వ్యాపించింది.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ప్రైవేటు సంస్థలు, కొందరు వ్యక్తులు కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తుంటారు. గిరీశ్ దయాలన్ ఆలోచనను మెచ్చిన కొందరు ఆయనకు బాసటగా నిలిచారు. సీఎస్ఆర్లో జమచేయాల్సిన మొత్తాన్ని వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు గిరీశ్కు అందించారు. దీంతో తన సేవలను మరింత విస్తృతం చేసే అవకాశం లభించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎలా జరుగుతుందో ఆయా గ్రామాల్లో పర్యటించి, చూసే అవకాశం కూడా దాతలకు గిరశ్ కల్పించారు. వారు స్వయంగా ఆయా గ్రామాలకు వెళ్లి వ్యాక్సినేషన్ తీరును పర్యవేక్షించేలా చిన్నపాటి బాధ్యతను అప్పగించారు. దీంతో తమ సొంత డబ్బుతో ప్రజలకు టీకాలు వేయగలుగుతున్నామన్న ఆత్మసంతృప్తి వారిలో కలిగింది. దీంతో మరికొందరు దాతలు మరి కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం మొదలు పెట్టారు. ఇలా ఒక గ్రామంతో మొదలైన వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండు వారాల్లో 13 గ్రామాలకు విస్తరించింది.
కనీసం ఒకరికి వ్యాక్సిన్ వేయించాలనుకునేవారు ఒక డోసుకు రూ.430 చెల్లించాలి. అదే డోసు ప్రైవేటుగా కొంటే దాదాపు రూ.1000 వరకు ఉంటుంది. అందువల్ల వ్యాక్సిన్ ప్రైవేటుగా కాకుండా నేరుగా కేంద్రం నుంచి రూ.430కే కొనుగోలు చేసి సామాన్య ప్రజలకు అందిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలే అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. ఈలోగా ఎంత ప్రాణనష్టం జరుగుతుందో ఊహించడం కష్టం. కానీ, ఈ విధంగా సామాజిక బాధ్యతగా కొందరు ముందుకు వస్తే వ్యాక్సినేషన్లో జాప్యం లేకుండా చేయవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన విషయాలు చర్చకు దారితీశాయి. -
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు. -
కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు
దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు