తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది.
‘సందేశ్ఖాలీ’పై కొత్త వీడియోలు బయటపెట్టిన టీఎంసీ
అవి కల్పితం.. కోర్టును ఆశ్రయిస్తాం : భాజపా
కోల్కతా, దిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. కొందరు మహిళల చేత తెల్లకాగితాలపై సంతకాలు చేయించిన భాజపా మహిళానేత (పియాలీ దాస్) వాటినే అత్యాచార ఫిర్యాదులుగా మార్చారని టీఎంసీ నేతలు గురువారం ఆరోపించారు. భాజపా కుట్రకు ఆధారమంటూ స్థానిక కమలం పార్టీ నాయకుడైన గంగాధర్ వ్యాఖ్యలతో మూడు రోజుల కిందట శూలశోధన వీడియోను విడుదల చేసిన టీఎంసీ.. తన తాజా వాదనకు మద్దతుగా మరికొన్ని వీడియోలను బయటపెట్టింది. భాజపా నేతలు తమను మభ్యపెట్టి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారని, అత్యాచారాలు జరిగినట్లు తప్పుడు ఫిర్యాదులుగా వాటిని మార్చినట్లు ‘బాధిత’ మహిళలు చేసిన వ్యాఖ్యలు ఈ వీడియోల్లో ఉన్నాయి. సందేశ్ఖాలీ ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్న బశీర్హాట్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రేఖాపాత్ర ఆ మహిళలతో మాట్లాడుతున్న వీడియో కూడా ఇందులో ఉంది. ఈ వీడియోలు తాము బయటపెట్టాక ‘బాధిత’ మహిళలకు భాజపా నేతల నుంచి చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని టీఎంసీ పేర్కొంది. కాగా, తాజా వీడియోల ఆధారంగా స్థానిక పోలీసులు భాజపా మహిళానేత పియాలీ దాస్ను విచారణకు పిలిచారు. టీఎంసీ ఆరోపణలను ఖండించిన రాష్ట్ర భాజపా నేత సువేందు అధికారి.. ఆ వీడియోలు ‘భాయిపొ’ (సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ) సృష్టి అని కొట్టిపారేశారు. హానికరమైన అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నవారిపై తాము త్వరలో కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
భాజపాపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
సందేశ్ఖాలీ అత్యాచార ఘటనలు కల్పితమని, ఈ విషయాన్ని స్వయానా భాజపా నేత కెమెరా ముందు అంగీకరించారంటూ టీఎంసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ కుట్ర వెనుక ఉన్న రాష్ట్ర భాజపా నేత సువేందు అధికారితోపాటు ఇతరులపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా కోరింది. ఈ మేరకు టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సాగరికా ఘోష్ గురువారం ఈసీకి లేఖ సమర్పించారు. షేక్ షాజహాన్ (టీఎంసీ బహిష్కృత నేత), శిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్లపై తప్పుడు అత్యాచార ఆరోపణలు చేయడం ద్వారా భాజపా నేతలు దారుణమైన కుట్రకు పాల్పడి సమాజాన్ని తప్పుదోవ పట్టించారని లేఖలో పేర్కొన్నారు. సందేశ్ఖాలీపై వందతులు వ్యాప్తి చేస్తున్న భాజపా నేతలు దీనిపై మరెక్కడా మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఓ వార్తాసంస్థ శూలశోధన జరిపి చిత్రీకరించిన వీడియోను ‘ఎక్స్’ ద్వారా షేర్ చేసిన టీఎంసీ.. ఆ వీడియో ఆధారంగానే ఈ ఫిర్యాదు చేసింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి ఆదేశాల మేరకే తప్పుడు లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేసినట్లుగా స్థానిక భాజపా నేత గంగాధర్ కోయల్ చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి నేపథ్యంలో.. ఆయన గౌరవార్థం భారత్లో మే 21న సంతాపదినం పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
Bail conditions for Pune teen: తన డ్రైవింగ్తో ఇద్దరి మృతికి కారణమైన ఓ మైనర్కు పుణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, షరతుల కింద ప్రమాదంపై ఆ బాలుడిని వ్యాసం రాయమని న్యాయస్థానం చెప్పడం గమనార్హం. -
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటేశారు. మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. -
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం