అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి

పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్‌ విశ్వమ్‌ (సీపీఐ) కోరారు.

Published : 10 May 2024 05:34 IST

ప్రధానికి సీపీఐ ఎంపీ విశ్వం వినతి

దిల్లీ: పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్‌ విశ్వమ్‌ (సీపీఐ) కోరారు. గురువారం ఈ మేరకు లేఖ రాశారు. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు టెంపోల కొద్దీ డబ్బును ఒక రాజకీయ పార్టీకి ఇచ్చినట్లు కరీంనగర్‌లో మోదీ ఒక బహిరంగ సభలో ఆరోపించిన విషయాన్ని దీనిలో ప్రస్తావించారు. అదానీ గ్రూపు, అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూపు అనేక రకాల వ్యాపార అవకతవకలకు, ఆశ్రిత పెట్టుబడిదారీతనానికి పాల్పడుతున్నట్లు తరచూ ఆరోపణలు వస్తున్నాయని గుర్తుచేశారు. వారి విమానాలను ప్రధాని వాడడం వల్ల ఆయనతో సాన్నిహిత్యం గురించీ ఆరోపణలున్నాయని, వివాదాస్పద రీతుల్లో ఆ ఇద్దరికీ పలు ప్రాజెక్టుల్ని అప్పగించారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని