కరోనా వల్ల జరిగింది ఇదే!
కొవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మనుషుల మీదే కాదు, పర్యావరణంపై కూడా ప్రభావం చూపిస్తోంది. మనుషులను అనారోగ్యానికి గురిచేస్తున్న ఈ వైరస్.. ఓ విధంగా పర్యావరణాన్ని చక్కదిద్దుతోంది. ఇందుకు వైరస్ ప్రభావం
కొవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో అంతటా లాక్డౌన్ ప్రకటించారు. దీంతో పర్యావరణపరంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న చైనా, ఇటలీ లాంటి దేశాల్లో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా భారత్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఘజియాబాద్, నొయిడా హైవేలో వాహన రాకపోకలు తగ్గడంతో గాలిలో నాణ్యత పెరిగింది.
గాలి కాలుష్యం తగ్గడం
2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇచ్చిన నివేదిక ప్రకారం.. 15 ఏళ్లలోపు పిల్లల్లో 93శాతం మంది విషపూరితమైన, కలుషితమైన గాలిని పీల్చుకుంటున్నారు. అయితే కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి అనేక దేశాలు లాక్డౌన్లోకి వెళ్లడంతో కార్లు, ఇతర వాహనాలు తిరగడం గణనీయంగా తగ్గింది. దీంతో చైనాలోని హుబీ ప్రావిన్స్లో కాలుష్య స్థాయి పడిపోవడాన్ని నాసా గమనించింది. మహమ్మారి కారణంగా చైనాలో కార్బన్డైయాక్సైడ్ ఉద్గారాలను పావు శాతం తగ్గినట్లు కార్బన్ బ్రీఫ్ నివేదించింది.
‘ఒక నిర్దిష్ట సంఘటనతో ఇంతటి పెద్ద ప్రదేశంలో గాలి కాలుష్య స్థాయిలు పడిపోవడాన్ని నేను చూడటం ఇదే తొలిసారి’అని నాసా గొడ్దార్డ్ అంతరిక్ష విమాన కేంద్రంలోని ఓ వాయు నాణ్యత పరిశోధకులు తెలిపారు.
‘చైనాలో వాయు కాలుష్యం తగ్గడం వల్ల ఐదు సంవత్సరాలలోపు సుమారు 4,000 మంది పిల్లల ప్రాణాలు రక్షించబడ్డాయి. 70 ఏళ్లు పైబడిన 73,000 మంది ప్రాణాలు నిలబడ్డాయి’ అని పర్యావరణ వనరుల ఆర్థికవేత్త మార్షల్ బుర్కే లెక్కగట్టారు.
విమానాల్లో ప్రయాణం తగ్గింది
విమాన ప్రయాణాలు 13.5శాతం తగ్గినట్లు ఈ నెల 10న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ తమ నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేయడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ట్రాఫిక్ తగ్గింది
24 గంటలూ మేల్కొని ఉండే న్యూయార్క్ నగరంలో ట్రాఫిక్ 35శాతం పడిపోయింది. కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు గణనీయంగా తగ్గాయి. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో ఎప్పుడూ అధికంగా ఉండే ట్రాఫిక్ 14.3శాతం తగ్గిందని స్పెయిన్ డైరెక్టరేట్ జనరల్ ఫర్ ట్రాఫిక్ నివేదికలో వెల్లడైంది. ‘‘ఉత్తర ఇటలీలోని పో వ్యాలీలో నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గారాల క్షీణత స్పష్టంగా ఉంది’’ అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కోపర్నికస్ సెంటినెల్ -5పీ మిషన్ మేనేజర్ క్లాజ్ జెహ్నర్ తెలిపారు.
తగ్గిన నీటి కాలుష్యం
వెనిస్ కాలువల్లో అనేక వన్యప్రాణులు తిరుగుతున్నట్లు నకిలీ వీడియోలు కనిపించాయి. కానీ వీడియోలో కనిపించినట్లు హంసలు, తిమింగలాలు తిరుగుతున్నట్లు వచ్చిన వార్తలు నకిలీవని తెలుస్తోంది. ఎందుకంటే అక్కడున్న నీరు స్పష్టంగా కనిపిస్తున్న ఫొటోలు ఇంటర్నెట్లో కనిపించాయి. పర్యాటకులు లేకపోవడంతో పడవల రాకపోకలు ఆగిపోయాయి. దాంతో నీటి నాణ్యత పెరిగినట్లు తెలుస్తోంది.
జంతువుల ఇక్కట్లు
థాయిలాండ్లోని ఫ్రా ప్రాంగ్ సామ్ యోట్ కోతి ఆలయానికి వచ్చే పర్యాటకులు అక్కడి కోతులకి ఆహార పదార్థాలు తినిపించడం అలవాటుగా మారింది. అయితే, ఇప్పుడు అక్కడ పర్యాటకులు తగ్గడంతో వచ్చిన వారిపై అవి ఎక్కువ దూకుడుగా ప్రవర్తిస్తున్నాయి. ‘కోతులకి ఒకసారి ఆహారం ఇవ్వడం అలవాటు చేశాక, అవి మనుషుల మీదే ఆధారపడతాయి. ఒకవేళ ఆహారం ఇవ్వకపోతే ఎక్కువ దూకుడుతనాన్ని ప్రదర్శిస్తాయి’ అని బెంగుళూరుకి చెందిన ఆశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో పనిచేసే పర్యావరణ శాస్త్రవేత్త అస్మితా సేన్గుప్తా తెలిపారు.
జపాన్లోని నారా పార్క్లోని సికా జింకలకు పర్యాటకులు బియ్యం, ఆహారం తినిపించడానికి.. వాటితో స్వీయచిత్రాలు తీసుకోవడానికి పోటీపడేవారు. కానీ ఇప్పుడు పర్యాటకులు లేరు. దాంతో జంతువులు ఆహారం కోసం వీధుల్లో తిరగడం ప్రారంభించాయి.
వైద్య వ్యర్థాలు
కరోనా వైరస్ బాధితులు పెరగడంతో.. వారికి చికిత్స భాగంగా ఉపయోగించి వస్తువులు, పదార్థాలు.. అలాగే రోగులు, వైద్య సిబ్బంది ఉపయోగించే మాస్కులు, గ్లౌజులు కూడా పెరిగాయి. దీంతో వైద్య వ్యర్థాలు విపరీతంగా పెరిగాయి. చైనా వాసులు వాడి పడేసిన ఫేస్ మాస్క్లు, వైద్య వ్యర్థాలు టన్నుల కొద్దీ ఉన్నాయి. ఒక్క వుహాన్లోనే రోజుకు 200 టన్నుల వైద్య వ్యర్థాలు పోగయ్యయాంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హాంకాంగ్ సముద్రతీరాల్లో వందలాది మాస్క్లు పోగుపడుతున్నాయి.
‘గత ఆరు నుంచి ఎనిమిది వారాలుగా సముద్రంలో భారీ పరిమాణంలో మాస్క్లను గుర్తిస్తున్నాం. కరోనా పర్యావరణంపై ప్రభావం ఎలా చూపుతుందో ఇప్పుడు మేం చూస్తున్నాం’అని ఎన్విరాన్మెంట్ గ్రూప్ ఓసెన్స్ ఆసియా వ్యవస్థాపకుడు గ్యారీ స్టోక్స్ అన్నారు.
దక్షిణాఫ్రికాలో వాడుతున్న శానిటైజర్లు, క్రిమిసంహారక మందుల వాడకంపై కూడా ఆందోళనలు ఉన్నాయి. ఎందుకంటే వీటిని సరిగా పారేయకపోతే పర్యావరణాన్ని విషపూరితం చేయొచ్చు. అలాగే ఇక్కడ రసాయన ఉత్పత్తులు, ప్లాస్టిక్ సీసాలు లాంటివి ఎక్కడ పడితే అక్కడ పడేయడం వలన అవి నదీ ప్రవాహాల్లో కొట్టుకొచ్చి పల్లపు ప్రదేశాలలో పేరుకుపోతున్నాయి.
ఇంటర్నెట్.. వినియోగం పెరిగింది
కరోనా నియంత్రణలో భాగంగా పలు దేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ప్రజలు ఇంట్లోనే ఉండటంతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ నెల 11న ఇంటర్నెట్ ప్రపంచ రికార్డు సాధించిందని డీఇ-సీఐఎక్స్ నివేదించింది. దీని ప్రకారం... ఫ్రాంక్ఫర్ట్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్లో సెకనుకు 9 టెరాబిట్లకు పైగా డేటాను వాడుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డేటా వినియోగం అని ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ చెబుతోంది. ఇంటర్నెట్ ప్రొవైడర్లకు డిమాండు పెరిగింది. ఉదాహరణకు, యూరప్లో ఇంటర్నెట్ వాడకం 50శాతం పెరిగినట్లు వోడాఫోన్ నివేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!