Ketamine Therapy: డిప్రెషన్కికెటమిన్ థెరపీ.. గంటల్లోనే కుంగుబాటు మాయం!
మానసిక కుంగుబాటు మహా చెడ్డది. తీవ్ర ఒత్తిళ్లు.. నిరాశ చుట్టుముట్టినప్పుడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను కలుగుతుంటుంది. కుంగుబాటు నుంచి స్వతహాగా లేదా మానసిక నిపుణుల కౌన్సెలింగ్ ద్వారా బయటపడే మార్గాలే ఉన్నాయి కానీ.. ప్రత్యేకించి ఔషధాలు పెద్దగా అందుబాటులో
లండన్: మానసిక కుంగుబాటు మహా చెడ్డది. తీవ్ర ఒత్తిళ్లు.. నిరాశ చుట్టుముట్టినప్పుడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంటుంది. కుంగుబాటు నుంచి స్వతహాగా లేదా మానసిక నిపుణుల కౌన్సెలింగ్ ద్వారా బయటపడే మార్గాలే ఉన్నాయి కానీ.. ప్రత్యేకించి ఔషధాలు పెద్దగా అందుబాటులో లేవు. అయితే, కెటమిన్ అనే ఔషధంతో చికిత్స చేయడంపై కొన్నాళ్లుగా పరిశోధకులు దృష్టి సారించారు. కెటమిన్ అనేది ఒక మత్తుమందు. దీన్ని అనస్థిషియాలో ఉపయోగిస్తారు. కొందరు అక్రమంగా మాదకద్రవ్యంగానూ వాడుతుంటారు. అయితే, కెటమిన్ను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే.. మానసిక కుంగుబాటును, ఆత్మహత్య ఆలోచనలను వేగంగా తగ్గించవచ్చని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది.
మానసిక కుంగుబాటుకు గురైన వ్యక్తులకు ఒక్క డోసు కెటమిన్ ఇస్తే నాలుగు గంటలలోపే అది సమర్థంగా పనిచేసి కుంగుబాటును తగ్గిస్తుందని పరిశోధకులు గుర్తించారు. దీని ప్రభావం రెండు వారాల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇది తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురయ్యే వ్యక్తులను ఆత్మహత్య ఆలోచనల నుంచి తక్షణమే కాపాడేందుకు దోహదపడుతుందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ పరిశోధకులు తెలిపారు. కెటమిన్తో యాక్సైటీ, పోస్ట్ ట్రొమాటిక్ స్ట్రెస్, ఒబ్సెసీవ్ కంపల్సీవ్ డిజార్డర్ వంటి ఎన్నో మానసిక వ్యాధులను నయం చేయొచ్చన్నారు. అయితే, కెటమిన్పై పరిశోధనను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహించామని, ఈ ఔషధంతో ప్రతికూల ప్రభావాలూ ఉన్న నేపథ్యంలో దీన్ని సరైన ఔషధంగా అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై మరింత విస్తృత అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ చికిత్సకి కెటమిన్ థెరపీగా నామకరణం చేశారు. ఈ మేరకు కెటమిన్ థెరపీపై ‘బ్రిటీష్ సైకియట్రీ ఓపెన్’ జర్నల్లో ఆర్టికల్ ప్రచురితమైంది.
► Read latest General News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
పులివెందుల సీఐ శంకర్రెడ్డి వైకాపా నాయకులతో చేతులు కలిపారని, తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
రెండ్రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను క్యాట్ కొట్టి వేసింది. -
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్