Ramadan: ఘనంగా రంజాన్‌ వేడుకలు.. భక్తిశ్రద్ధలతో ముస్లింల ప్రార్థనలు

దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో రంజాన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.

Updated : 11 Apr 2024 12:04 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. చిన్నాపెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. హైదరాబాద్‌లోని మీర్‌ ఆలం ఈద్గా, చార్మినార్‌, మక్కా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఇంటికి వెళ్లి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సనత్‌నగర్‌లో వేడుకలకు భారాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు. ఆదిలాబాద్‌లో సామాన్యులతో కలిసి జిల్లా ఎస్పీ ఆలం ప్రార్థనలు చేశారు. దిల్లీలోని జామా మసీదు భక్తులతో కిటకిటలాడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని