Azadi ka Amrit Mahotsav: భారత్ సాధించాల్సింది ఎంతో ఉంది: దత్తాత్రేయ
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. దిల్లీలోని తెలంగాణ
దిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. దిల్లీలోని తెలంగాణ భవన్ అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘స్వతంత్ర భారతి నాట్య హారతి’ కార్యక్రమానికి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, శిఖరం ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దత్తా్త్రేయతో పాటు వివిధ రంగాల్లో సేవలు అందించిన మరో 14 మందికి శిఖరం ఆర్ట్ థియేటర్స్
సంస్థ సేవా భారతి-2021 జాతీయ అవార్డులు ప్రదానం చేసింది.
దత్తాత్రేయ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ చరిత్రలో భారత స్వాతంత్ర్య పోరాటం చాలా గొప్పది. అత్యుత్తమ సంగ్రామంగా చరిత్రలో నిలిచింది. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. 75 ఏళ్లలో ఎంతో సాధించిన భారత్.. ఇంకా సాధించాల్సింది మరెంతో ఉంది. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచినా సమాజంలో ఇప్పటికీ అసమానతలు ఉన్నాయి. వివిధ భాషలు, సంస్కృతులు ఉన్న భారతదేశాన్ని కాపాడుకోవాలంటే సామరస్యం, అభివృద్ధి ఎంతో కీలకమైనవి. ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడం చాలా సంతోషకరం. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి. ఇవి సమకూరినట్లయితే అభివృద్ధిలో భారత్ మరింత ముందుకు దూసుకెళ్తుంది. కరోనా కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలు చాలా గొప్పగా ఉన్నాయి. కొవిడ్ టీకాలు కనుగొని ఫార్మా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ తనదైన ముద్ర వేసుకుంది’’ అని దత్తాత్రేయ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్ చేశారు.. క్యాట్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై విచారణ జరిగింది. -
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు కాంగ్రెస్ నాయకులు, పార్టీ సోషల్ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ