Black fungusపై జాగ్రత్త సుమా!
కొవిడ్-19 నుంచి కోలుకున్నవారిలో మ్యుకర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) పెరిగిపోతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతున్న
ఐసీఎంఆర్ సూచనలు
ఈనాడు, దిల్లీ: కొవిడ్-19 నుంచి కోలుకున్నవారిలో మ్యుకర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) పెరిగిపోతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. వివిధ అనారోగ్య సమస్యలతో మందులు వాడుతున్న వారిలో పర్యావరణంలో ఉన్న సూక్ష్మక్రిములతో పోరాడే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వారిలో మ్యుకర్మైకోసిస్ ప్రబలడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని పేర్కొంది. ఈ ఇన్ఫెక్షన్ సోకినవారిలో కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారడం, నొప్పి తలెత్తడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి అందకపోవడం, రక్తవాంతులు, మతిస్థిమితంలో మార్పులు వంటివి తలెత్తుతాయని తెలిపింది.
ఎందువల్ల వస్తుంది ?
*మధుమేహం అదుపులో లేనప్పుడు
* స్టిరాయిడ్స్ వినియోగం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గిపోవడం
*ఐసీయూలో సుదీర్ఘకాలం ఉండటం
*ఇతరత్రా ఆరోగ్య సమస్యలు, అవయవ మార్పిడి/ కేన్సర్ ్న వోరికొనాజోల్ థెరఫీ
ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి
*మధుమేహం ఉన్న కొవిడ్ బాధితుల్లో రోగ నిరోధక వ్యవస్థను అదుపు చేయడానికి మందులు వాడినప్పుడు ఈ దిగువ లక్షణాలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్గా అనుమానించాలి.
* సైనసైటిస్- ముక్కు రంధ్రాలు మూసుకుపోయినప్పుడు, ఇబ్బంది తలెత్తినప్పుడు, దవడ ఎముకలో నొప్పి తలెత్తినప్పుడు.
* మొహంలో ఒకవైపు నొప్పి, తిమ్మిరి, వాపు.
* ముక్కుపై నల్లరంగు ఏర్పడటం, పంటినొప్పి.
*కంటి నొప్పితోపాటు, చూపు మందగించడం, రెండుగా కనిపించడం. జ్వరం రావడం.
* ఛాతీలోనొప్పి, శ్వాసకోసవ్యవస్థలో తీవ్ర ఇబ్బందులు.
వ్యాధి నివారణకు
*హైపర్గ్లైసీమియాను నియంత్రణలో ఉంచుకోవాలి.
*కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ను పరిశీలిస్తూ, మధుమేహాన్ని అదుపులో ఉంచాలి.
* స్టిరాయిడ్స్, యాంటీ బయాటిక్స్ను సహేతుకంగా ఉపయోగించాలి.
*ఆక్సిజన్ థెరఫీ సమయంలో హ్యుమిడిఫైయర్స్ కోసం శుభ్రమైన నీటిని ఉపయోగించాలి.
ఎలా ఎదుర్కోవాలి
* మ్యుకర్మైకోసిస్కు సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. ్న స్టిరాయిడ్స్ తగ్గించాలి. ్న రోగ నిరోధకశక్తిని అదుపులో ఉంచే మందులను వాడటం మానేయాలి. ్న 4-6వారాలపాటు యాంటీఫంగల్ చికిత్స తీసుకోవాలి. * రేడియో ఇమేజింగ్ ద్వారా రోగిలోని స్పందన, రోగ పురోగతిని పరిశీలించాలి. ్న ఫంగల్ ఇటియాలజీని కనుగొనేందుకు కేఓహెచ్ స్టెయినింగ్, మైక్రోస్కోపీ, కల్చర్, మాల్డీటాఫ్లాంటి పరీక్షలు చేయించుకోవాలి.
జాగ్రత్తలు
* దుమ్ముతో కూడిన నిర్మాణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్కు ఉపయోగించాలి.
*మట్టి, ఎరువులు ముట్టుకొనేటప్పుడు, తోట పనిలాంటివి చేసేటప్పుడు బూట్లు, ఫ్యాంటు, పొడవు చేతుల చొక్కా వేసుకోవాలి.
*వ్యక్తిగత శుభ్రత పాటించాలి.
నిర్లక్ష్యమే భారత్ కొంపముంచింది
జెనీవా: భారత్లో ప్రజలు కరోనా వ్యాప్తి ముగిసిందని పొరపడి.. మాస్కుల ధారణ వంటి నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఫలితంగా వైరస్ ఉద్ధృతి పెరిగిందని చెప్పారు. ప్రజలు గుమిగూడేందుకు, భారీస్థాయి సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇవ్వడం మహమ్మారి వ్యాప్తిని మరింత వేగవంతం చేసిందని పేర్కొన్నారు. గత అక్టోబరులో గుర్తించిన బి.1.617 రకం ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వ్యాపిస్తోందన్నారు. టీకాతో ఏర్పడే రోగ నిరోధకత నుంచి అది తప్పించుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాపిస్తున్నకొద్దీ కొత్త రకాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయన్నారు. భారీ స్థాయిలో రూపాంతరం చెందే వైరస్ రకాలపై వ్యాక్సిన్లు పెద్దగా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అదే జరిగితే ప్రపంచం మరోసారి భారీ ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. డబ్ల్యూహెచ్వో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడిది హరియాణాలోని కర్నాల్ ప్రాంతం. -
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
ఉగ్ర దాడిలో శనివారం గాయాలపాలై మరణించిన భారత వైమానిక దళ(IAF) సైనికుడు కార్పోరల్ విక్కీ పహాడే మృతదేహం సోమవారం చింద్వారాలోని అతడి స్వగ్రామానికి చేరుకుంది. -
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
అతడు రూ. 15 వేల జీతగాడు. కానీ, అతడి ఇంటిని తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా బిత్తరపోయింది. ఓ గదిలో గుట్టలుగా పేర్చిన నగదు చూసి షాకైంది. -
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
గుంతల రహదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిష్కారం కనుక్కోనుంది. నిర్మాణంలో కొత్త మెటీరియలను వినియోగించే అంశంపై పనిచేస్తోంది. -
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
నేడు గుజరాత్లోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!