చంద్రుడిపై చైనా కీలక ప్రయోగం
పొరుగు దేశం చైనా మరో కీలక ప్రయోగాన్ని చేపట్టబోతోంది. మానవరహిత రాకెట్ను నేరుగా చంద్రుడిపైకి పంపి నమూనాలను సేకరించేందుకు సిద్ధమైంది. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే వారంలో ఈ ప్రయోగం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఈ ప్రయోగం విజయవంతమైతే 1970ల తర్వాత చంద్రుడి నుంచి నమూనాలను...
బీజింగ్: చైనా మరో కీలక ప్రయోగాన్ని చేపట్టబోతోంది. మానవరహిత రాకెట్ను నేరుగా చంద్రుడిపైకి పంపి నమూనాలను సేకరించేందుకు సిద్ధమైంది. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే వారంలో ఈ ప్రయోగం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఈ ప్రయోగం విజయవంతమైతే 1970ల తర్వాత చంద్రుడి నుంచి నమూనాలను సేకరించిన తొలి దేశంగా చైనా రికార్డు సృష్టిస్తుంది. చంద్రుని నమూనాలను భూమిపైకి తీసుకొచ్చిన మూడో దేశంగా రికార్డులకెక్కనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యాలు మాత్రమే చంద్రమండలం నుంచి నమూనాలను సేకరించగలిగాయి. చాంగ్-5 పేరిట ఈ మిషన్ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో అపోలో మిషన్లో భాగంగా అమెరికా 1969 నుంచి 1972 వరకు 382 కిలోల చంద్ర నమూనాలను సేకరించి ప్రయోగాలు చేపట్టింది. మరోవైపు రష్యా కూడా 1970లో చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టి 170 గ్రాముల మట్టిని సేకరించింది. 1959లో రష్యా ప్రయోగించిన లూనా 2 క్రాష్ ల్యాండ్ కావడంతో ఆ దేశం ప్రయోగాల వేగాన్ని తగ్గించింది. తర్వాతి కాలంలో జపాన్, భారత్లు కూడా చంద్రుడిపై రోవర్లను పంపి ప్రయోగాలు చేపట్టి చివరి దశల్లో విఫలమయ్యాయి.
ఒక వేళ చైనా చేపడుతున్న తాజా ప్రయోగం విజవంతమైతే చంద్రుని పుట్టుక, నీటి నిల్వలు, ఆక్సిజన్ స్థాయి తదితర విషయాలపై మరింత లోతుగా అధ్యయనం చేసే వీలు కలుగుతుంది. గతంలో నమూనాలు సేకరించిన ప్రదేశం నుంచి కాకుండా.. ఇతర చోట్ల నుంచి కనీసం 2 కిలోల మట్టి, చంద్ర శిలలను సేకరించాలని చైనా యోచిస్తోంది. గత అన్వేషణల్లో అర్థం కాని విషయాలను గురించి తెలుసుకునేందుకు, చంద్రుడిపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం సహకరిస్తుందని బ్రైన్ యూనివర్సిటీకి చెందిన జేమ్స్ హెడ్ వెల్లడించారు. చంద్రుడి జీవిత కాలం, సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్ చంద్రుడిపై ఎంతమేర ప్రభావం చూపిస్తోంది? తదితర విషయాలను తెలుసుకునే అవకాశముంటుందని చెప్పారు.
నమూనాలు ఎలా సేకరిస్తారు?
చైనా ప్రయోగించిన చాంగ్-5 వాహకనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత.. రిమోట్ కంట్రోలింగ్ సిస్టమ్ సాయంతో రెండు వెహికల్స్ని చంద్రుడి ఉపరితలంపై పంపిస్తారు. ల్యాండర్ సాయంతో దిగిన ఈ రెండు వాహనాలు నిర్దేశించిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపడతాయి. దానికి అమర్చిన అసెండర్ ద్వారా శిలలు, మట్టిని సేకరిస్తాయి. ఈ నమూనాలతో వాహకనౌకలోకి చేరుకుంటాయి. చైనా 2013లో తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టింది. 2019లో ఈ దేశానికి చెందిన మానవరహిత చాంగ్-4 చంద్రుడి ఉత్తర ధృవంపై అడుగు పెట్టింది. చంద్రుడి ఉత్తర ధృవాన్ని చేరుకోవడం అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఇదే ప్రథమం. వచ్చే దశాబ్ద కాలంలో చంద్రుడి దక్షిణ ధృవంపై పరిశోధనలు చేసేందుకు వీలుగా చాంగ్ 6, చాంగ్ 7, చాంగ్ 8 మిషన్ల ద్వారా ఓ బేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. 2030 నాటికి అంగారకుడి నుంచి నమూనాలను సేకరించేందుకు చైనా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా గత జులైలోనే అంగారకుడిపైకి మానవ రహిత రాకెట్ను చైనా ప్రయోగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ