చంద్రుడిపై చైనా కీలక ప్రయోగం
పొరుగు దేశం చైనా మరో కీలక ప్రయోగాన్ని చేపట్టబోతోంది. మానవరహిత రాకెట్ను నేరుగా చంద్రుడిపైకి పంపి నమూనాలను సేకరించేందుకు సిద్ధమైంది. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే వారంలో ఈ ప్రయోగం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఈ ప్రయోగం విజయవంతమైతే 1970ల తర్వాత చంద్రుడి నుంచి నమూనాలను...
బీజింగ్: చైనా మరో కీలక ప్రయోగాన్ని చేపట్టబోతోంది. మానవరహిత రాకెట్ను నేరుగా చంద్రుడిపైకి పంపి నమూనాలను సేకరించేందుకు సిద్ధమైంది. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే వారంలో ఈ ప్రయోగం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఈ ప్రయోగం విజయవంతమైతే 1970ల తర్వాత చంద్రుడి నుంచి నమూనాలను సేకరించిన తొలి దేశంగా చైనా రికార్డు సృష్టిస్తుంది. చంద్రుని నమూనాలను భూమిపైకి తీసుకొచ్చిన మూడో దేశంగా రికార్డులకెక్కనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యాలు మాత్రమే చంద్రమండలం నుంచి నమూనాలను సేకరించగలిగాయి. చాంగ్-5 పేరిట ఈ మిషన్ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో అపోలో మిషన్లో భాగంగా అమెరికా 1969 నుంచి 1972 వరకు 382 కిలోల చంద్ర నమూనాలను సేకరించి ప్రయోగాలు చేపట్టింది. మరోవైపు రష్యా కూడా 1970లో చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టి 170 గ్రాముల మట్టిని సేకరించింది. 1959లో రష్యా ప్రయోగించిన లూనా 2 క్రాష్ ల్యాండ్ కావడంతో ఆ దేశం ప్రయోగాల వేగాన్ని తగ్గించింది. తర్వాతి కాలంలో జపాన్, భారత్లు కూడా చంద్రుడిపై రోవర్లను పంపి ప్రయోగాలు చేపట్టి చివరి దశల్లో విఫలమయ్యాయి.
ఒక వేళ చైనా చేపడుతున్న తాజా ప్రయోగం విజవంతమైతే చంద్రుని పుట్టుక, నీటి నిల్వలు, ఆక్సిజన్ స్థాయి తదితర విషయాలపై మరింత లోతుగా అధ్యయనం చేసే వీలు కలుగుతుంది. గతంలో నమూనాలు సేకరించిన ప్రదేశం నుంచి కాకుండా.. ఇతర చోట్ల నుంచి కనీసం 2 కిలోల మట్టి, చంద్ర శిలలను సేకరించాలని చైనా యోచిస్తోంది. గత అన్వేషణల్లో అర్థం కాని విషయాలను గురించి తెలుసుకునేందుకు, చంద్రుడిపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం సహకరిస్తుందని బ్రైన్ యూనివర్సిటీకి చెందిన జేమ్స్ హెడ్ వెల్లడించారు. చంద్రుడి జీవిత కాలం, సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్ చంద్రుడిపై ఎంతమేర ప్రభావం చూపిస్తోంది? తదితర విషయాలను తెలుసుకునే అవకాశముంటుందని చెప్పారు.
నమూనాలు ఎలా సేకరిస్తారు?
చైనా ప్రయోగించిన చాంగ్-5 వాహకనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత.. రిమోట్ కంట్రోలింగ్ సిస్టమ్ సాయంతో రెండు వెహికల్స్ని చంద్రుడి ఉపరితలంపై పంపిస్తారు. ల్యాండర్ సాయంతో దిగిన ఈ రెండు వాహనాలు నిర్దేశించిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపడతాయి. దానికి అమర్చిన అసెండర్ ద్వారా శిలలు, మట్టిని సేకరిస్తాయి. ఈ నమూనాలతో వాహకనౌకలోకి చేరుకుంటాయి. చైనా 2013లో తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టింది. 2019లో ఈ దేశానికి చెందిన మానవరహిత చాంగ్-4 చంద్రుడి ఉత్తర ధృవంపై అడుగు పెట్టింది. చంద్రుడి ఉత్తర ధృవాన్ని చేరుకోవడం అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఇదే ప్రథమం. వచ్చే దశాబ్ద కాలంలో చంద్రుడి దక్షిణ ధృవంపై పరిశోధనలు చేసేందుకు వీలుగా చాంగ్ 6, చాంగ్ 7, చాంగ్ 8 మిషన్ల ద్వారా ఓ బేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. 2030 నాటికి అంగారకుడి నుంచి నమూనాలను సేకరించేందుకు చైనా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా గత జులైలోనే అంగారకుడిపైకి మానవ రహిత రాకెట్ను చైనా ప్రయోగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది. -
1992 ముంబయి దాడుల కేసులో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి
బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బిహార్లో ఒకే కాన్పులో అయిదుగురు ఆడశిశువులు
బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. -
కేరళ తీరంలో ఇరాన్ పడవ స్వాధీనం
ఇరాన్కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. -
జాఫ్నా-నాగపట్నం మధ్య 13 నుంచి ప్రయాణికుల నౌకలు
భారత్-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని