పిల్లలకు కరోనా వ్యాక్సిన్..ఎప్పుడు రావచ్చంటే..!
వ్యాక్సిన్లన్నీ కేవలం 16-18ఏళ్ల వయసు పైబడిన వారికే అని ఆయా సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నలు మొదలయ్యాయి.
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న ప్రయోగాల ఫలితాలు సానుకూలంగానే వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, రష్యాల్లో అత్యవసర వినియోగం కింద వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్లన్నీ కేవలం 16-18ఏళ్ల వయసు పైబడిన వారికే అని ఆయా సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నలు మొదలయ్యాయి.
అమెరికా, బ్రిటన్లో ఈ మధ్యే అత్యవసర వినియోగ అనుమతి పొందిన ఫైజర్ వ్యాక్సిన్ను కేవలం 16ఏళ్లకు పైబడినవారికే వినియోగించాల్సి ఉంటుంది. అయితే, 12ఏళ్ల వయసువారిపై ప్రయోగాలను ఫైజర్ సంస్థ అక్టోబర్ నెలలోనే ప్రారంభించింది. ఈ ప్రయోగాలు మరికొన్ని నెలలపాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం వినియోగంపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వీటి ఫలితాల ఆధారంగానే చిన్నారులపై ప్రయోగాల అనుమతులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఫైజర్ తర్వాత అమెరికాలో అనుమతి పొందనున్న మరో వ్యాక్సిన్ కంపెనీగా మోడెర్నా నిలువనుంది. ఇప్పటికే మోడెర్నా తయారుచేసిన వ్యాక్సిన్ సురక్షితమని ఎఫ్డీఏ వెల్లడించింది. ఈ నేపథ్యంలో 12 నుంచి 17ఏళ్లలోపు యువకులపై ప్రయోగాలను ప్రారంభించేందుకు మోడెర్నా సిద్ధమైంది. ఈనెల నుంచే వాలంటీర్లను నమోదుచేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, వీరిని సంవత్సరంపాటు పరీక్షించనున్నట్లు సమాచారం. ఇక 12 ఏళ్లకన్నా తక్కువ వయసుగల వారిపై మాత్రం ప్రయోగాలను 2021లోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం పెద్దవారికోసం రూపొందించిన వ్యాక్సిన్లు సమర్థవంతంగానే పనిచేస్తుండడంతో చిన్నారులపై ప్రయోగాలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయని అమెరికాలోని వాండెర్బిల్ట్ యూనివర్సిటీకి చెందిన పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బడ్డీ క్రీచ్ పేర్కొన్నారు. ‘కరోనా వైరస్ వల్ల పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురౌతున్న సంఘటనలు తక్కువే అయినప్పటికీ..వారినుంచి వైరస్ ఇతరులకు వ్యాపించడంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఇప్పటికే దాదాపు 16లక్షల మంది చిన్నారులు వైరస్ బారినపడ్డట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీరిలో దాదాపు 8వేల మంది ఆసుపత్రిలో చేరగా వీరిలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు’ అని పిల్లల కోసం ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ రాబర్ట్ ఫ్రెంక్ అన్నారు. అందుచేత పిల్లలకు వ్యాక్సిన్ అందించడం కూడా ఎంతో ముఖ్యమని రాబర్ట్ ఫ్రెంక్ అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉంటే, ఇప్పటివరకు కొనసాగుతోన్న వ్యాక్సిన్ ప్రయోగాలు ఎక్కువగా 18-65ఏళ్ల మధ్య వయసువారిలోనే ఉన్నాయి. వృద్ధుల్లోనూ పరీక్షించగా.. మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు మధ్యంతర ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులపై ప్రయోగాలపై వ్యాక్సిన్ కంపెనీలు దృష్టిపెట్టాయి. వీటి ప్రయోగ ఫలితాలు వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి..
కొవిడ్ టీకా: రష్యాలో మిశ్రమ స్పందనే..!
కరోనా టీకా సైడ్ ఎఫెక్ట్స్? మంచిదేనట!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు