ఆ అణు ప్రమాదం.. కట్టప్ప పనే..!
ఇరాన్ అణుకేంద్రంలో మరో కుట్రకు తెరలేచింది. జులైలో మొదట్లో ఇరాన్లోని నాన్తెజ్ అణు భారీ పేలుడు జరిగి సెంట్రిఫ్యూజ్లు దెబ్బతిన్నాయి. అనంతరం రక్షణ శాఖకు చెందిన కీలక భవనాల్లో కూడా పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. అప్పట్లో ఈ పేలుళ్లు ఎలా చోటు చేసుకొన్నాయో కూడా ఇరాన్కు అంతుచిక్కలేదు.
పేలుళ్లకు వెన్నుపోటే కారణమన్న ఇరాన్
ఇదే తొలిసారి కాదు..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఇరాన్ అణుకేంద్రంలో మరో కుట్రకు తెరలేచింది. జులై మొదట్లో ఇరాన్లోని నాన్తెజ్ యురేనియం శుద్ధి కేంద్రంలో భారీ పేలుడు జరిగి సెంట్రిఫ్యూజిలు దెబ్బతిన్నాయి. అనంతరం రక్షణ శాఖకు చెందిన కీలక భవనాల్లో కూడా పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. అప్పట్లో ఈ పేలుళ్లు ఎలా చోటు చేసుకొన్నాయో కూడా ఇరాన్కు అంతుచిక్కలేదు. ఒక దశలో ఇజ్రాయిల్కు చెందిన ఎఫ్35 యుద్ధవిమానాలు దాడులు చేశాయని అనుమానించింది. ఈ పేలుళ్లపై దర్యాప్తు చేసిన ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ చివరికి ఇది వెన్నుపోటుగా తేల్చాయి. కచ్చితంగా ఇది కంప్యూటర్లను హ్యాక్చేసి చేశారా.. లేక ఎవరైనా కావాలని చేశారా అనేదానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. గతంలో కూడా ఈ అణుకేంద్రంపై భారీగా సైబర్ దాడులు జరిగాయి. ఆ దెబ్బకు ఇరాన్ కొన్నేళ్లపాటు కోలుకోలేదు.
నాన్తెజ్ అంత కీలకమైందా..
టెహ్రాన్కు దాదాపు 250 మైళ్ల దూరంలో నాన్తెజ్ యురేనియం శుద్ధి కేంద్రం ఉంది. యురేనియం-238 శుద్ధి చేసి ఆయుధాలకు అవసరమైన యూ-235ను తయారు చేస్తారు. ఈ శుద్ధికి సెంట్రిఫ్యూజిలు అనే పరికరాలను వాడతారు. ఇలాంటి వేలకొద్దీ సెంట్రిఫ్యూజిలను ఉపయోగించి నెలల కొద్దీ యురేనియంను శుద్ధి చేస్తేకానీ అణుబాంబుకు సరిపడా యురేనియం తయారు కాదు. ఈ సెంట్రిఫ్యూజిలు పనిచేయడానికి ఉపయోగించే కంప్యూటర్లను దెబ్బతీస్తే.. ఆ సెంట్రిఫ్యూజిలు కూడా పనికిరాకుండా పోతాయి. ఇప్పుడు నాన్తెజ్లో ఇరాన్ వేల సంఖ్యలో సెంట్రిఫ్యూజిలను ఉపయోగిస్తోంది. తాజా దాడిలో ఎన్ని దెబ్బతిన్నాయో తెలియరాలేదు.
గతంలో స్టక్స్ నెట్ దెబ్బకు విలవిలా..
గతంలో ఇరాన్ అణుకార్యక్రమాన్ని అమెరికా దెబ్బకొట్టింది. ఇరాన్లోని ‘నాన్తెజ్’ యురేనియం శుద్ధి కేంద్రానికి సామగ్రిని సరఫరా చేసే నాలుగు సంస్థలను అమెరికా ‘స్టక్స్నెట్’ అనే డిజిటల్ ఆయుధంతో లక్ష్యంగా చేసుకొంది. ఆ సంస్థల్లోని ఒక దానికి చెందిన ఉద్యోగి తన పెన్డ్రైవ్ను ‘నాన్తెజ్’ అణుకేంద్రంలోని కంప్యూటర్కు అనుసంధానించాడు. అంతే, దాదాపు 984 ‘గ్యాస్ సెంట్రిఫ్యూజి’లు పనికిరాకుండా పోయాయి. ఫలితంగా ఇరాన్ ఇప్పటికీ అణుకార్యక్రమంలో పురోగతి సాధించలేని స్థితికి చేరింది. తాజా దాడితో ‘స్టక్స్నెట్’ ఘటన మరోసారి కళ్లముందు మెదిలింది.
‘ఎయిర్గ్యాప్’ను ఛేదించిందెవరు..?
సాధారణంగా ఏ దేశంలోనైనా అత్యంత కీలకమైన విభాగాల్లో పనిచేసే కంప్యూటర్లను హ్యాకర్ల నుంచి కాపాడటానికి ఇంటర్నెట్కు అనుసంధానించరు. ఇలాంటి స్థితిని ‘ఎయిర్ గ్యాప్’ అంటారు. ఈ స్థితిలో ఉన్న కంప్యూటర్లలోకి వైరస్ ప్రొగ్రామ్ను చొప్పించాలంటే ఎవరో ఒకరు ఆ కంప్యూటర్లను ఆపరేట్ చేసి ఉండాలి. స్టక్స్ నెట్ ఘటనలో కూడా ఓ ఉద్యోగి కీలక కంప్యూటర్లకు పెన్డ్రైవ్ అనుసంధానించడంతో వైరస్ వ్యాపించింది. ఈ సారి ఎవరు చేశారో ఇరాన్ గుర్తించలేదు.
గతంలో ఇరాక్లో ‘ఆపరేషన్ ఒపెరా’
ఇరాక్ 1976లో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఓ న్యూక్లియర్ రియాక్టర్ను బాగ్దాద్కు 17 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసింది. దీని ఆధారంగా అణ్వాయుధం తయారు చేస్తోందని ఇజ్రాయెల్ గుర్తించింది. దీనిని ధ్వంసం చేయడానికి 1981 జూన్ 7వ తేదీ ఇజ్రాయెల్కు చెందిన యుద్ధవిమానాలు ఆ కేంద్రంపై దాడి చేశాయి. ఆ సమయంలో ఇరాక్ గగనతల నిఘా రాడార్లను పర్యవేక్షించే సిబ్బంది భోజనాలకు వెళ్లడంతో ఈ విమానాలను గుర్తించడంలో జాప్యం జరిగింది. అంతే ఇజ్రాయెల్ విమానాలు ఆ అణు రియాక్టర్పై బాంబుల వర్షం కురిపించి వెళ్లిపోయాయి. క్షణాల్లో ఈ ఆపరేషన్ ముగిసిపోయింది. ఒక చిన్న ఏమరపాటు అణుకేంద్రాలకు ఎంత ముప్పో ఈ ఘటన చెబుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.