ప్రణబ్‌ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులేదు..!

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం కోమాలో ఉన్న ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్ రిఫెరల్ ఆసుపత్రి వెల్లడించింది.

Published : 24 Aug 2020 13:17 IST

దిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని దిల్లీ కంటోన్మెంట్‌లోని సైనిక ఆసుపత్రి వెల్లడించింది. వెంటిలేటర్‌ సహాయంతోనే చికిత్స అందిస్తున్నామని తెలిపింది. అయితే.. ఆయన ఆరోగ్య సూచీలు మాత్రం నిలకడగానే ఉన్నాయని తాజా హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న ప్రణబ్‌ ముఖర్జీ దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. అనంతరం ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్యబృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని