ఆస్ట్రాజెనెకా టీకాకు యూకే అనుమతి
కరోనా కొత్తరకం వైరస్తో సతమతమవుతున్న యూకే ప్రభుత్వం మరో వ్యాక్సిన్కు అత్యవసర వినియోగం కింద అనుమతులు మంజూరు చేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాను బుధవారం
లండన్: కరోనా కొత్తరకం వైరస్తో సతమతమవుతున్న యూకే ప్రభుత్వం మరో వ్యాక్సిన్కు అత్యవసర వినియోగం కింద అనుమతులు మంజూరు చేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాను బుధవారం ఆమోదించింది. వచ్చే వారం ఈ వ్యాక్సిన్ పంపిణీని చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఫైజర్ తర్వాత యూకేలో అనుమతి లభించిన రెండో టీకా ఇదే. కాగా.. ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన మూడో కరోనా వ్యాక్సిన్ ఇది.
డిసెంబరు తొలివారంలో ఫైజర్-బయోఎన్టెక్ టీకాను యూకే ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. 90ఏళ్ల మార్గరెట్ కీనన్ ప్రపంచంలోనే తొలి కరోనా టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు ఆ దేశంలో 6లక్షలకు పైగా మంది టీకా వేయించుకొన్నారు. అయితే, ఇటీవల అక్కడ కొత్తరకం కరోనా బయటపడి కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం మరో టీకాను అత్యవసరంగా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 100 మిలియన్ ఆస్ట్రాజెనెకా డోసులను ఆర్డర్ చేసింది. వచ్చే ఏడాది తొలివారంలో ఈ టీకా పంపిణీ ప్రారంభం కానుంది. మరోవైపు బ్రిటన్లో కొత్తరకం కరోనా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. సోమవారం ఒక్కరోజే అక్కడ 20వేలకు పైగా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆసుపత్రులన్నీ కొవిడ్ బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి.
అమెరికాలోనూ రెండు..
అటు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాలోనూ రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఫైజర్తో పాటు మోడెర్నా టీకాకు కూడా యూఎస్ ఎఫ్డీఏ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ఫైజర్ టీకా.. కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మోడెర్నా టీకాను తీసుకున్నారు.
భారత్లోనూ త్వరలో అనుమతులు?
యుకేలో ఆక్స్ఫర్డ్ టీకాకు అనుమతులు రావడంతో భారత్లో టీకా విడుదలకు మార్గం మరింత సుగమమైంది. భారత్లోనూ త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆస్ట్రాజెనెకా వైపే మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫైజర్తో పోలిస్తే ఆస్ట్రాజెనెకా టీకా ధర తక్కువగా ఉండటంతో పాటు.. భద్రపరచడం కూడా సులువుగా ఉండటంతో ఈ వ్యాక్సిన్ వినియోగంపై పరిశీలనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారత్లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ టీకాను ఉత్పత్తి చేస్తోంది.
ఇవీ చదవండి..
కొవిడ్ బాధితులతో బ్రిటన్ ఆసుపత్రులు కిటకిట!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..