మా నాన్న చికిత్సకు స్పందిస్తున్నారు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన కుమారుడు, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ అభిజిత్‌ ముఖర్జీ..

Updated : 16 Aug 2020 13:18 IST

ప్రణబ్‌ కుమారుడు

దిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన కుమారుడు, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ అభిజిత్‌ ముఖర్జీ ఆదివారం వెల్లడించారు. గతంలో కంటే ఇప్పుడు బాగా స్పందిస్తున్నారని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నిన్న మా నాన్న చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లాను. దేవుడి దయ, మీ ప్రార్థనల వల్ల గతంలో కన్నా ఆయన ఇప్పుడు చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే ఆయన మన మధ్యలోకి వస్తారు’ అని ట్వీట్‌ చేశారు. 

అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ఆదివారం ఉదయం పేర్కొన్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, ఇంకా వెంటిలేటర్‌ పైనే చికిత్స అందిస్తున్నట్లు దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రి తెలిపింది. ‘మాజీ రాష్ట్రపతి పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. స్పెషలిస్టు వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోంది’ అని వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు