
తుపాన్లను మరింత ముందుగా కనిపెట్టొచ్చు
సరికొత్త విధానాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తల బృందం
దిల్లీ: ఉష్ణ మండల తుపాన్లను ముందస్తుగా పసిగట్టేందుకు ఓ సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తల బృందం ఆవిష్కరించింది. తుపాను రావడానికి ముందు సముద్రాల్లో ఏర్పడే సుడిగుండాల ఆనవాళ్లను ఉపగ్రహ చిత్రాల కన్నా ముందుగానే కనిపెట్టడం, తుపాను ఏ ప్రాంతంలో, ఏ సమయంలో సంభవించనుందో గుర్తించడం ఈ విధాన ఉద్దేశం అని శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ) తెలిపింది. ఇప్పటివరకూ రిమోట్ సెన్సింగ్ పద్ధతులే తుపాన్లను వీలైనంత ముందుగా పసిగడుతున్నాయి. అయితే సముద్ర ఉపరితలంపై అల్ప పీడనం అభివృద్ధి చెందాకే ఈ పద్ధతుల్లో తుపాన్ల సంభావ్యతను కనిపెట్టడానికి వీలవుతోంది. తుపానును పసిగట్టడానికి, దాని ప్రభావం మొదలయ్యే సమయానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉంటే సన్నాహక చర్యలను పటిష్ఠంగా చేపట్టడానికి వీలవుతుంది. తుపాను పుట్టుకకు ముందు సుడిగుండాల లక్షణాలను క్షుణ్నంగా పరిశీలించి, వాటిని తుపాను సంభవించాక ఏర్పడిన పరిస్థితులతో పోల్చి చూడడం ద్వారా ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ నూతన విధానం ద్వారా తుపానుల పుట్టుకను కనీసం నాలుగు రోజుల ముందే అంచనా వేయొచ్చని వారు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: 4 శాతానికి పైగా పాజిటివిటీ రేటు..!
-
India News
Spicejet: క్యాబిన్లో పొగలు.. స్పైస్జెట్ విమానం వెనక్కి
-
Sports News
Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
-
Related-stories News
Ayodhya Ram Mandir: రామమందిర నిర్మాణానికి రూ.3,400 కోట్ల విరాళాలు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
TS TET: టెట్ పేపర్-2లో ఉత్తీర్ణత డబుల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్ను విడిచిన రష్యా
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన