కంగనకు చేదు అనుభవం.. కారును చుట్టిముట్టిన రైతులు

బాలీవుడ్‌ నటి కంగనకు పంజాబ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారును కొందరు రైతులు నిలువరించారు.

Updated : 03 Dec 2021 19:56 IST

దిల్లీ: బాలీవుడ్‌ నటి కంగనకు పంజాబ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారును కొందరు రైతులు నిలువరించారు. పంజాబ్‌లోని చండీగఢ్‌ - ఉనా జాతీయ రహదారిపై కిరాత్‌పుర్‌ సాహిబ్‌ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పంజాబ్‌లో ప్రవేశించగా.. ఓ మూక తన కారుపై దాడి చేసిందని, తాము రైతులమని వారు చెబుతున్నారంటూ కంగన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. రైతు ఉద్యమంపై ఆమె పలుమార్లు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

రైతులను విమర్శిస్తూ గతంలో చేసిన వ్యాఖ్యలకు గానూ ఆమె నుంచి వారు క్షమాపణ కోరినట్లు సమాచారం. అయితే, కాసేపటికే అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులకు సర్దిచెప్పారు. దీంతో కాసేపటికే అక్కడి నుంచి కంగన పయనమయ్యారు. ఈ సందర్భంగా పంజాబ్‌ పోలీసులకు కంగన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తన అభిప్రాయాలను వ్యతిరేకిస్తున్న కొందరు తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఇటీవలే ఆమె వెల్లడించారు. దీనిపై పంజాబ్‌ పోలీసులకు ఇటీవలే ఫిర్యాదు చేశారు. పంజాబ్‌లోని భటిండాకు చెందిన వ్యక్తి తనను బెదిరించారని, అలాంటి బెదిరింపులకు తాను భయపడడనని పేర్కొన్నారు. తనను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ సీఎంకు సూచించాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి ఆమె విజ్ఞప్తి చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని