Drugs Case: ఆర్యన్ ఖాన్కు బెయిల్ మంజూరు.. ఏ రోజు ఏం జరిగిందంటే!
క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్కు బెయిల్ మంజూరైంది. బాంబే హైకోర్టు అతడికి గురువారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది......
ముంబయి: క్రూజ్ నౌక డ్రగ్స్ (Cruise Drugs Case) కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు (Aryan Khan) ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. బాంబే హైకోర్టు గురువారం ఆర్యన్తో పాటు అర్బాజ్ మర్చంట్, మూన్మూన్ ధమేచాలకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు మూడు వారాలుగా జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. బెయిల్ పిటిషన్పై బాంబే హైకోర్టులో మూడు రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఆర్యన్ ఖాన్ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
కుట్రపూరితంగానే ఆర్యన్ను ఎన్సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు. ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని.. డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవని కోర్టుకు పదేపదే తెలిపారు. తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ దొరికితే.. ఆర్యన్ను ఎలా అరెస్టు చేస్తారు? 20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారు? అని ఎన్సీబీని ప్రశ్నించారు. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్కు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఎన్సీబీ తరఫున గురువారం ఏఎస్జీ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. ఆర్యన్ డ్రగ్స్ వాడటం తొలిసారేమీ కాదని వాదించారు. డ్రగ్స్ విక్రేతలను చాలా సార్లు సంప్రదించాడనీ.. డ్రగ్స్ విక్రయించే ప్రయత్నంలోనూ ఉన్నట్టు వాట్సాప్ చాట్లలో తేలిందన్నారు. వాదోపవాదాలు విన్న బాంబే హైకోర్టు ఆర్యన్తో పాటు అర్బాజ్, మూన్మూన్లను జైలులో ఉంచేందుకు సరైన ఆధారాల్లేవని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేసింది.
రేపో, ఎల్లుండో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం!
ఈ కేసులో పూర్తిస్థాయి కోర్టు ఆర్డర్ రేపు వెలువడే అవకాశం ఉంది. ఆర్యన్ఖాన్, అర్బాజ్ మర్చంట్, మూన్మూన్ ధమేచాలో జైలు నుంచి రేపు లేదా ఎల్లుండి విడుదలై బయటకు వచ్చే అవకాశం ఉందని ముకుల్ రోహత్గీ మీడియాకు తెలిపారు.
ఆర్యన్ ఖాన్ కేసులో ఏరోజు ఏం జరిగిందంటే..
* అక్టోబర్ 2న ముంబయి-గోవా క్రూజ్ నౌకలో రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. ఆర్యన్ ఖాన్తో పాటు అతడి స్నేహితుడు అర్బాజ్ మెర్చంట్, మూన్మూన్ ధమేచాలతో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు.
* అక్టోబర్ 3న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆర్యన్ ఖాన్ అరెస్టును ధ్రువీకరించారు. డ్రగ్స్కు సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్టు తెలిపారు. అదేరోజు ఆర్యన్తో పాటు ఏడుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
* అక్టోబర్ 4న ఆర్యన్ ఖాన్తో పాటు ఈ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై తొలిసారి వాదనలు జరిగాయి. అయితే, ఎన్సీబీ అక్టోబర్ 11 వరకు తమ కస్టడీకి అప్పగించాలని వాదించింది. ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాల్లేవని అతడి తరఫున్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, అక్టోబర్ 7వరకు కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.
* అక్టోబర్ 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం ఆర్యన్ ఖాన్తో పాటు ఏడుగురు నిందితులకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు ఇచ్చింది.
* అక్టోబర్ 8న ఆర్యన్ ఖాన్ను ముంబయిలోని ఆర్థర్ రోడ్డులో ఉన్న జైలుకు తరలించారు.
* అక్టోబర్ 10న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ డ్రైవర్ వాంగ్మూలాన్ని ఎన్సీబీ రికార్డు చేసింది.
* అక్టోబర్ 11న బెయిల్ పిటిషన్పై విచారణను అక్టోబర్ 13కు న్యాయస్థానం వాయిదా వేసింది. రిప్లై దాఖలు చేయాలంటూ ఎన్సీబీని ఆదేశించింది.
* అక్టోబర్ 14న ఆర్యన్ బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వులో ఉంచింది. దీంతో ఆర్యన్ ఖాన్ ఈ నెల 20వరకు జైలులోనే ఉండాల్సి వచ్చింది.
* అక్టోబర్ 20న విచారణలో ఆర్యన్కు ఎన్డీపీఎస్ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. ఈ కేసును ప్రాథమికంగా చూస్తే నిందితుడు తరచూ మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టుగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. నిషిద్ధ డ్రగ్స్ను చేరవేసేవారితో అతడు టచ్లో ఉన్నట్టుగా వాట్సాప్ చాట్ సంభాషణలను బట్టి తెలుస్తోందని న్యాయమూర్తి వీవీ పాటిల్ వ్యాఖ్యానించారు. బెయిల్పై విడుదలైతే ఇలాంటి మరో నేరం చేయరని చెప్పలేం..గనక బెయిల్ ఇవ్వలేం అని స్పష్టంచేశారు. దీంతో ఆర్యన్ తరఫు న్యాయవాది బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
* అక్టోబర్ 26న బాంబే హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆర్యన్ తరఫున మాజీ ఏజీ ముకుల్ రోహత్గీ, సతీశ్ మానెశిందే వాదనలు వినిపించారు. ఈ కేసులో ఆర్యన్ని కావాలనే ఇరికించి 20 రోజుల పాటు జైలులో ఉంచారని వాదించారు. తదుపరి వాదనలను ఈ నెల 27కు న్యాయస్థానం వాయిదా వేసింది.
* అక్టోబర్ 27న బాంబే హైకోర్టులో ఆర్యన్తో పాటు సహ నిందితులుగా ఉన్న అర్బాజ్ మర్చంట్, మూన్మూన్ ధమేచాల బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. అర్బాజ్ మర్చెంట్ తరఫున అమిత్ దేశాయ్, మూన్మూన్ ధమేచా తరఫున అలీ కాశీఫ్ ఖాన్ దేశ్ముఖ్ వాదించారు. ఎన్సీబీ వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈరోజు విచారించిన న్యాయస్థానం ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..