Corona: ప్రపంచానికి పాఠాలు నేర్పుతోన్న దేశాలు!
మహమ్మారికి ఎదురొడ్డి నిలిచిన కొన్ని దేశాలు వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా వ్యాక్సినేషన్లోనూ దూసుకెళ్తున్నాయి.
కఠిన చర్యలతో మహమ్మారి కట్టడి
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ మహమ్మారి వెలుగుచూసి ఏడాదిన్నర కావస్తున్నా.. దాని ఉద్ధృతికి ప్రపంచ దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. తొలుత పలు దేశాలు వైరస్ను కట్టడి చేసినప్పటికీ..మరోసారి మహమ్మారి చేస్తోన్న విలయానికి కోలుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారికి ఎదురొడ్డి నిలిచిన కొన్ని దేశాలు వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా వ్యాక్సినేషన్లోనూ దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, వైరస్కు అడ్డుకట్ట వేసే చర్యలతో పాటు వ్యాక్సినేషన్లో ఉత్తమంగా నిలిచిన కొన్ని దేశాలను చూద్దాం..
తైవాన్..
కరోనావైరస్ కట్టడిలో యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోన్న దేశం తైవాన్. 2.3కోట్ల జనాభా కలిగిన తైవాన్లో ఇప్పటివరకు కేవలం 1128 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 12 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది అక్డోబర్లో ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ.. 200 రోజులపాటు అక్కడ స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కఠినంగా వ్యవహరించిన తైవాన్, ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ ప్రబలుతోందనే విషయం తెలుసుకొన్న తైవాన్.. ఈ విషయాన్ని డిసెంబరు 31నే ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెల్లడించింది. అయితే, తైవాన్ మాటలను డబ్ల్యూహెచ్ఓ పెడచెవిన పెట్టినప్పటికీ.. తైవాన్ మాత్రం వైరస్ కట్టడికి ముమ్మర చర్యలు చేపట్టింది. కేవలం చైనాకు 130 కి.మీ దూరంలోనే ఉన్న తైవాన్.. అక్కడి నుంచి వస్తున్న వారిని పరీక్షించడమే కాకుండా కొన్ని రోజుల్లోనే వైరస్పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించింది. సెంట్రల్ ఎపిడమిక్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసింది. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అనుమానితులను ట్రేస్ చేయడం మొదలు పెట్టింది. ఇప్పటికీ ఆ ప్రక్రియను కొనసాగిస్తోంది. పాజిటివ్ వచ్చిన వారిని క్యాబ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక హోటళ్లలో ఉంచుతూ వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తోంది.
న్యూజిలాండ్..
కరోనా వైరస్ ప్రభావాన్ని ముందస్తుగానే అంచనా వేసిన న్యూజిలాండ్ చివరకు వైరస్పై పోరులో విజయం సాధించింది. గతేడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో పాటు సరిహద్దులోనే వైరస్ను అడ్డుకునేలా ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తోంది. దేశంలో తొలి వంద కేసులు నమోదైన వెంటనే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఆర్థికవ్యవస్థ కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమన్న న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.. కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ 2613 కేసులు మాత్రమే వెలుగుచూడగా.. 26 మరణాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం దేశీయంగా కొత్తకేసులు లేనప్పటికీ విదేశాల నుంచి వచ్చే వారిలో పాజిటివ్ వస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత 40 రోజులుగా అక్కడ ఎలాంటి సామాజిక వ్యాప్తి కేసులు నమోదు కాలేదు.
సింగపూర్
కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కోన్న దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటివరకు అక్కడ 60వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా 30మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడున్న యువ జనాభా వల్లనే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సరైన ప్రణాళిక, భారీ స్థాయిలో కొవిడ్ పరీక్షలు, సరిహద్దులపై ఆంక్షలు విధించడం, క్వారంటైన్ నిబంధనలు కఠినంగా అమలుచేయడం వంటి చర్యల ద్వారా కరోనా వైరస్ మహమ్మారిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అక్కడ పాజిటివ్ కేసులను సున్నాకు తీసుకురాగలిగింది. అయితే, 57లక్షల జనాభా కలిగిన సింగపూర్.. 2003లో వచ్చిన సార్స్ విజృంభణ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుందనే చెప్పవచ్చు. తాజాగా వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ సింగపూర్ దూసుకెళ్తోంది. ఇప్పటికే అక్కడి మొత్తం జనాభాలో ఐదోవంతు మందికి వ్యాక్సిన్ అందించగలిగింది.
వియత్నాం..
చైనాలో కరోనా వైరస్ వెలుగు చూపిన వెంటనే అప్రమత్తమైన వియత్నాం.. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో సఫలీకృతమైంది. జనవరి 30, 2020న తొలి కేసు నమోదైన వెంటనే పక్కా ప్రణాళికను రూపొందించుకుంది. అప్పటికీ చాలా దేశాలు మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కానీ, వియత్నాం మాత్రం ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో కొవిడ్ పరీక్షలను ముమ్మరంగా చేపట్టింది. అక్కడి కొత్త సంవత్సరం (ల్యూనార్ ఇయర్) కారణంగా అప్పటికే అక్కడ పాఠశాలలు మూతపడ్డాయి. వీటిని మే నెల వరకూ మూసివేసి ఉంచింది. అంతేకాకుండా విదేశీ పర్యాటకులను అక్కడ నుంచి పంపిచివేసింది. అనంతరం కొన్నిరోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించింది. వీటితో పాటు కాంటాక్ట్ ట్రేసింగ్ సమర్థవంతంగా చేపట్టడంతో పాటు మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఇలా వైరస్ నియంత్రణకు ప్రణాళికతో కట్టడిచేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అదుపులోకి తీసుకురాగలిగింది. ఇప్పటివరకు అక్కడ 2928 కేసులు, 35 మరణాలు రికార్డయ్యాయి.
ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాలు..
కరోనా వైరస్ తీవ్రతను చవిచూసిన ఇజ్రాయెల్ కూడా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో సఫలమయ్యింది. ఇప్పటివరకు అక్కడ 8లక్షల 38వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా 6363 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈనేపథ్యంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలుచేస్తోంది. దీంతో ఇప్పటికే అక్కడ దాదాపు 60శాతం జనాభాకు వ్యాక్సిన్ అందించింది.
ఇక కరోనా కట్టడిలో ముందున్న ఆస్ట్రేలియా కూడా మహమ్మారి పోరులో సఫలీకృతమైందనే చెప్పవచ్చు. ఇప్పటివరకు అక్కడ 29వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 910 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి నెల అక్కడ సరాసరి రెండు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ప్రతి పది లక్షల జనాభాకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగానే చేపడుతోంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా మొత్తం జనాభాలో దాదాపు 3.8శాతం మందికి వ్యాక్సిన్ అందించగలిగింది.
ఐస్లాండ్.. జనాభా తక్కువగా ఉన్న ఐస్లాండ్ కూడా వైరస్ వ్యాప్తిని అదేస్థాయిలో కట్టడి చేసింది. ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లిన ఐస్లాండ్ కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొంది. పాజిటివ్ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉండమని ప్రభుత్వ ఆదేశమివ్వడంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటివారికి ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందించింది. ఇప్పటివరకు అక్కడ 6472 కేసులు, 29 మరణాలు చోటుచేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ