Corona: ప్రపంచానికి పాఠాలు నేర్పుతోన్న దేశాలు!
మహమ్మారికి ఎదురొడ్డి నిలిచిన కొన్ని దేశాలు వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా వ్యాక్సినేషన్లోనూ దూసుకెళ్తున్నాయి.
కఠిన చర్యలతో మహమ్మారి కట్టడి
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ మహమ్మారి వెలుగుచూసి ఏడాదిన్నర కావస్తున్నా.. దాని ఉద్ధృతికి ప్రపంచ దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. తొలుత పలు దేశాలు వైరస్ను కట్టడి చేసినప్పటికీ..మరోసారి మహమ్మారి చేస్తోన్న విలయానికి కోలుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారికి ఎదురొడ్డి నిలిచిన కొన్ని దేశాలు వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా వ్యాక్సినేషన్లోనూ దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, వైరస్కు అడ్డుకట్ట వేసే చర్యలతో పాటు వ్యాక్సినేషన్లో ఉత్తమంగా నిలిచిన కొన్ని దేశాలను చూద్దాం..
తైవాన్..
కరోనావైరస్ కట్టడిలో యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోన్న దేశం తైవాన్. 2.3కోట్ల జనాభా కలిగిన తైవాన్లో ఇప్పటివరకు కేవలం 1128 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 12 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది అక్డోబర్లో ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ.. 200 రోజులపాటు అక్కడ స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కఠినంగా వ్యవహరించిన తైవాన్, ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ ప్రబలుతోందనే విషయం తెలుసుకొన్న తైవాన్.. ఈ విషయాన్ని డిసెంబరు 31నే ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెల్లడించింది. అయితే, తైవాన్ మాటలను డబ్ల్యూహెచ్ఓ పెడచెవిన పెట్టినప్పటికీ.. తైవాన్ మాత్రం వైరస్ కట్టడికి ముమ్మర చర్యలు చేపట్టింది. కేవలం చైనాకు 130 కి.మీ దూరంలోనే ఉన్న తైవాన్.. అక్కడి నుంచి వస్తున్న వారిని పరీక్షించడమే కాకుండా కొన్ని రోజుల్లోనే వైరస్పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించింది. సెంట్రల్ ఎపిడమిక్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసింది. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అనుమానితులను ట్రేస్ చేయడం మొదలు పెట్టింది. ఇప్పటికీ ఆ ప్రక్రియను కొనసాగిస్తోంది. పాజిటివ్ వచ్చిన వారిని క్యాబ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక హోటళ్లలో ఉంచుతూ వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తోంది.
న్యూజిలాండ్..
కరోనా వైరస్ ప్రభావాన్ని ముందస్తుగానే అంచనా వేసిన న్యూజిలాండ్ చివరకు వైరస్పై పోరులో విజయం సాధించింది. గతేడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో పాటు సరిహద్దులోనే వైరస్ను అడ్డుకునేలా ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తోంది. దేశంలో తొలి వంద కేసులు నమోదైన వెంటనే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఆర్థికవ్యవస్థ కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమన్న న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.. కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ 2613 కేసులు మాత్రమే వెలుగుచూడగా.. 26 మరణాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం దేశీయంగా కొత్తకేసులు లేనప్పటికీ విదేశాల నుంచి వచ్చే వారిలో పాజిటివ్ వస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత 40 రోజులుగా అక్కడ ఎలాంటి సామాజిక వ్యాప్తి కేసులు నమోదు కాలేదు.
సింగపూర్
కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కోన్న దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటివరకు అక్కడ 60వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా 30మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడున్న యువ జనాభా వల్లనే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సరైన ప్రణాళిక, భారీ స్థాయిలో కొవిడ్ పరీక్షలు, సరిహద్దులపై ఆంక్షలు విధించడం, క్వారంటైన్ నిబంధనలు కఠినంగా అమలుచేయడం వంటి చర్యల ద్వారా కరోనా వైరస్ మహమ్మారిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అక్కడ పాజిటివ్ కేసులను సున్నాకు తీసుకురాగలిగింది. అయితే, 57లక్షల జనాభా కలిగిన సింగపూర్.. 2003లో వచ్చిన సార్స్ విజృంభణ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుందనే చెప్పవచ్చు. తాజాగా వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ సింగపూర్ దూసుకెళ్తోంది. ఇప్పటికే అక్కడి మొత్తం జనాభాలో ఐదోవంతు మందికి వ్యాక్సిన్ అందించగలిగింది.
వియత్నాం..
చైనాలో కరోనా వైరస్ వెలుగు చూపిన వెంటనే అప్రమత్తమైన వియత్నాం.. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో సఫలీకృతమైంది. జనవరి 30, 2020న తొలి కేసు నమోదైన వెంటనే పక్కా ప్రణాళికను రూపొందించుకుంది. అప్పటికీ చాలా దేశాలు మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కానీ, వియత్నాం మాత్రం ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో కొవిడ్ పరీక్షలను ముమ్మరంగా చేపట్టింది. అక్కడి కొత్త సంవత్సరం (ల్యూనార్ ఇయర్) కారణంగా అప్పటికే అక్కడ పాఠశాలలు మూతపడ్డాయి. వీటిని మే నెల వరకూ మూసివేసి ఉంచింది. అంతేకాకుండా విదేశీ పర్యాటకులను అక్కడ నుంచి పంపిచివేసింది. అనంతరం కొన్నిరోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించింది. వీటితో పాటు కాంటాక్ట్ ట్రేసింగ్ సమర్థవంతంగా చేపట్టడంతో పాటు మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఇలా వైరస్ నియంత్రణకు ప్రణాళికతో కట్టడిచేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అదుపులోకి తీసుకురాగలిగింది. ఇప్పటివరకు అక్కడ 2928 కేసులు, 35 మరణాలు రికార్డయ్యాయి.
ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాలు..
కరోనా వైరస్ తీవ్రతను చవిచూసిన ఇజ్రాయెల్ కూడా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో సఫలమయ్యింది. ఇప్పటివరకు అక్కడ 8లక్షల 38వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా 6363 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈనేపథ్యంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలుచేస్తోంది. దీంతో ఇప్పటికే అక్కడ దాదాపు 60శాతం జనాభాకు వ్యాక్సిన్ అందించింది.
ఇక కరోనా కట్టడిలో ముందున్న ఆస్ట్రేలియా కూడా మహమ్మారి పోరులో సఫలీకృతమైందనే చెప్పవచ్చు. ఇప్పటివరకు అక్కడ 29వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 910 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి నెల అక్కడ సరాసరి రెండు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ప్రతి పది లక్షల జనాభాకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగానే చేపడుతోంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా మొత్తం జనాభాలో దాదాపు 3.8శాతం మందికి వ్యాక్సిన్ అందించగలిగింది.
ఐస్లాండ్.. జనాభా తక్కువగా ఉన్న ఐస్లాండ్ కూడా వైరస్ వ్యాప్తిని అదేస్థాయిలో కట్టడి చేసింది. ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లిన ఐస్లాండ్ కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొంది. పాజిటివ్ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉండమని ప్రభుత్వ ఆదేశమివ్వడంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటివారికి ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందించింది. ఇప్పటివరకు అక్కడ 6472 కేసులు, 29 మరణాలు చోటుచేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ను వీడిన అనంతరం రాధికా ఖేడా పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. -
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
ఝార్ఖండ్లో భారీ మొత్తంలో వెలుగుచూసిన నగదుపై ప్రధాని మోదీ (Modi) స్పందించారు. -
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
తల్లిదండ్రుల తోడు లేకపోయినా.. చదువుతో పాటు తన సోదరి బాధ్యతను మోస్తూ ముందుకెళ్తున్న పదేళ్ల కుర్రాడిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. -
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడిది హరియాణాలోని కర్నాల్ ప్రాంతం. -
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
ఉగ్ర దాడిలో శనివారం గాయాలపాలై మరణించిన భారత వైమానిక దళ(IAF) సైనికుడు కార్పోరల్ విక్కీ పహాడే మృతదేహం సోమవారం చింద్వారాలోని అతడి స్వగ్రామానికి చేరుకుంది. -
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
అతడు రూ. 15 వేల జీతగాడు. కానీ, అతడి ఇంటిని తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా బిత్తరపోయింది. ఓ గదిలో గుట్టలుగా పేర్చిన నగదు చూసి షాకైంది. -
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
గుంతల రహదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిష్కారం కనుక్కోనుంది. నిర్మాణంలో కొత్త మెటీరియలను వినియోగించే అంశంపై పనిచేస్తోంది. -
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
నేడు గుజరాత్లోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
ఐపీఎల్ 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్