Phone Hacking: ఆ హ్యాక్ అలర్ట్.. నకిలీది కావొచ్చు: విపక్షాల ఆరోపణలపై యాపిల్ స్పష్టత
Apple 'hacking' alert row: విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ ఆరోపణలపై యాపిల్ స్పందించింది. ఒక్కోసారి తప్పుడు అలర్ట్లు కూడా వస్తుంటాయని పేర్కొంది. మరోవైపు, భారత్లోనే గాక, 150 దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు ఇలాంటి నోటిఫికేషన్లు వచ్చినట్లు తెలిసింది.
దిల్లీ: దేశవ్యాప్తంగా పలువురు విపక్ష ఎంపీల (Opposition MPs) ఐఫోన్ల (iPhones)కు మంగళవారం హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ (Apple 'hacking' alert)లు రావడం తీవ్ర కలకలం రేపింది. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు మీ ఫోన్ హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఆ సందేశం రావడంతో.. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ (Apple) స్పందించింది. అలాంటి హ్యాకింగ్ ప్రయత్నం ఏమీ జరగలేదని తెలిపింది. ఇలాంటి నోటిఫికేషన్లు ఒక్కోసారి నకిలీ అలర్ట్లు కూడా కావొచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
‘‘ఈ అలర్ట్ నోటిఫికేషన్లను నిర్దిష్టంగా అధికారికంగా పనిచేసే హ్యాకర్ల పనిగా ఆపాదించలేం. హ్యాకింగ్ చేసేందుకు వారు అధునాతన పద్ధతులను అవలంబిస్తారు.దీనికి అవసరమైన నిధులు, టెక్నాలజీ వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. వారి హ్యాకింగ్ దాడులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇలాంటి దాడులను గుర్తించడం అనేది నిఘా సంకేతాలపై ఆధారపడి ఉంటుంది. యాపిల్ ఫోన్లకు వచ్చే అలర్ట్ నోటిఫికేషన్లు ఒక్కోసారి నకిలీ హెచ్చరికలు అయి కూడా ఉండొచ్చు. లేదా కొన్ని దాడులను గుర్తించలేం కూడా..!’’ అని యాపిల్ (Apple) తమ ప్రకటనలో వెల్లడించింది.
అయితే, విపక్ష ఎంపీలకు నేడు ఆ హ్యాక్ అలర్ట్ మెసేజ్లు ఎందుకు వచ్చాయన్నది చెప్పేందుకు యాపిల్ నిరాకరించింది. ‘‘ఈ అలర్ట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి గల కారణాలను మాత్రం మేం వెల్లడించలేం. ఎందుకంటే.. దాన్ని బయటపెడితే హ్యాకర్లు భవిష్యత్తులో మా నిఘా నుంచి తప్పించుకునే అవకాశముంది’’ అని యాపిల్ స్పష్టం చేసింది.
విపక్ష నేతల ఫోన్లకు హ్యాక్ అలర్ట్ మెసేజ్లు.. కేంద్రంపై ధ్వజం
కాంగ్రెస్ నేతలు శశిథరూర్, పవన్ ఖేడా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా సహా పలువురు విపక్ష పార్టీల నేతల ఐఫోన్లకు మంగళవారం ఈ అలర్ట్ మెసేజ్ వచ్చింది. దీంతో వారు ఆ స్క్రీన్షాట్లను సోషల్మీడియాలో షేర్ చేస్తూ.. కేంద్రం తమ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. అయితే, భారత్లోనే గాక.. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో పలువురు ఐఫోన్ యూజర్లకు ఈ అలర్ట్ నోటిఫికేషన్లు వచ్చినట్లు యాపిల్ వర్గాలు వెల్లడించాయి.
దర్యాప్తు చేస్తున్నాం: కేంద్రం
కాగా.. ఈ పరిణామాలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ విపక్షాల ఆరోపణలు కొట్టిపారేశారు. ‘‘ఈ అలర్ట్ నోటిఫికేషన్లు భారత్లో మాత్రమే గాక, 150 దేశాల్లోని యూజర్లకు వచ్చినట్లు యాపిల్ వర్గాలు స్పష్టం చేశాయి. ఒక్కోసారి నకిలీ అలర్ట్లు కూడా వస్తుంటాయని ఆ సంస్థ పేర్కొంది. అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించాం. ఈ మెసేజ్లు వచ్చినవారు దర్యాప్తునకు సహకరించాలని కోరుతున్నాం’’ అని కేంద్రమంత్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా