ఈసారి లద్దాఖ్‌ నేతలతో అఖిలపక్ష సమావేశం..!

జమ్మూకశ్మీర్‌ అంశంపై ఇటీవల అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర సర్కారు తాజాగా లద్దాఖ్‌పై దృష్టి సారించింది. లద్దాఖ్‌ అంశంపైనా

Published : 27 Jun 2021 22:24 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ అంశంపై ఇటీవల అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర సర్కారు తాజాగా లద్దాఖ్‌పై దృష్టి సారించింది. లద్దాఖ్‌ అంశంపైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి సిద్ధమైంది. జులై 1న నిర్వహించబోయే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ ఇప్పటికే అక్కడి రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపింది. అఖిలపక్ష సమావేశానికి తమకు ఆహ్వానం అందినట్లు కార్గిల్‌ డెమొక్రాటిక్‌ అలయన్స్‌(కేడీఏ) స్పష్టం చేసింది. అధికరణ 370, 35ఏ పునరుద్ధరణ, లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే రెండు ప్రధాన డిమాండ్లను సమావేశంలో కేడీఏ లేవనెత్తనుందని సమాచారం. లద్దాఖ్‌కు శాసనసభ ఏర్పాటు చేయాలంటూ స్థానిక పౌర హక్కుల సంఘాలు ఇటీవల డిమాండ్‌ చేశాయి. ఆ ప్రాంతంలో ఆరో షెడ్యూల్‌ను అమల్లోకి తీసుకురావాలని కోరాయి. ఆరో ఫెడ్యూల్‌ అమల్లోకి వస్తే అక్కడి భూములకు స్థానికులు మాత్రమే హక్కుదారులు కావడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికే ప్రాధాన్యం పెరుగుతుంది. 

జమ్మూకశ్మీర్‌ అంశంపై ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అక్కడి నుంచి హాజరైన 14 మంది రాజకీయ పార్టీల నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు. 2019లో అధికరణ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌ నేతలతో ఇలాంటి సమావేశాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని