Odisha Train Tragedy: కోరమాండల్ ఎక్స్ప్రెస్ ట్రాక్ మారడం వల్లే.. రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక
ఒడిశా రైలు దుర్ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక వెల్లడించింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ పొరబాటుగా లూప్లైన్లోకి మారడం వల్లే ఈ పెను విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
భువనేశ్వర్: ఒడిశా (Odisha)లోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న ఘటన యావత్ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ దుర్ఘటన.. ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అయితే, సిగ్నల్ లోపం కారణంగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ (Coromandel Express) మరో ట్రాక్లోకి ప్రవేశించడం వల్లే ఈ పెను విషాదం సంభవించినట్లు రైల్వే శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. (Odisha Train Tragedy)
ఒడిశా ప్రమాదంపై రైల్వే శాఖ (Indian Railway) ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. సిగ్నల్ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆ నివేదికలో పేర్కొంది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ ఎక్స్ప్రెస్.. లూప్లైన్లోకి మారినట్లు తెలిపింది. ‘‘చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ మెయిన్ లైన్ (Main Line)కి బదులుగా లూప్ లైన్లోకి ప్రవేశించింది. ఈ రైలు మెయిన్లైన్లోనే చెన్నై వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, ఈ రైలు పొరపాటున లూప్లైన్ (Loop Line)లోకి ప్రవేశించింది. అప్పటికే ఆ లూప్లైన్లో గూడ్స్ రైలును నిలిపి ఉంచారు. దీంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్ దాన్ని వేగంగా ఢీకొట్టి పట్టాలు తప్పింది. దీని బోగీలు పక్క ట్రాక్పైన పడ్డాయి. అదే సమయంలో ఆ ట్రాక్పైకి బెంగళూరు-హావ్డా ఎక్స్ప్రెస్ వచ్చింది. ఈ ఎక్స్ప్రెస్ సాయంత్రం 6.50 గంటలకు బహనగ స్టేషన్ దాటింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 6.52 గంటలకు ఖాంతాపార స్టేషన్ను దాటింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ను ఢీకొట్టగానే దాని 21 బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో కొన్ని బోగీలు పక్కనున్న ట్రాక్పై పడిపోయాయి. అదే సమయంలో వచ్చిన బెంగళూరు-హావ్డా ఎక్స్ప్రెస్ వీటిని ఢీకొట్టింది. దీంతో ఈ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయి’’ అని రైల్వే శాఖ తమ నివేదికలో వెల్లడించింది.
సిగ్నలింగ్లో మానవ తప్పిదం కారణంగానే ఇది జరిగి ఉండొచ్చని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ప్రమాద సమయంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ గంటకు 130 కి.మీల వేగంతో వెళ్తోంది. దీంతో లూప్లైన్ ఉన్న గూడ్స్ రైలును గుర్తించినా వేగాన్ని నియంత్రించలేకపోయినట్లు తెలుస్తోంది. గూడ్స్ను ఢీకొట్టగానే కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఇంజిన్.. దానిమీదకు దూసుకెళ్లినట్లు రైల్వే అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా కొన్ని బోగీలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంతమంది ప్రయాణికులు ఉన్నారంటే..
కోరమాండల్ ఎక్స్ప్రెస్లో 1257 మంది రిజర్వ్డ్ ప్రయాణికులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు-హావ్డా ఎక్స్ప్రెస్లో 1039 మంది రిజర్వ్డ్ ప్రయాణికులు ఉన్నట్లు తెలిపాయి. అయితే వీరు కాకుండా జనరల్ బోగీల్లో ఎంతమంది ఎక్కారన్నది తెలియదు.
ఎంటీ లూప్లైన్..?
రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. స్టేషన్ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ లూప్లైన్లను నిర్మిస్తారు. ఈ లూప్లైన్ల పొడవు 750 మీటర్లు ఉంటుంది. మల్టిపుల్ ఇంజిన్లు ఉండే ఒక గూడ్స్ రైలు ఆగేందుకు వీలుగా వీటిని నిర్మిస్తారు.
సాధారణంగా.. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు లూప్లైన్లోకి వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చేప్పుడు..హైస్పీడ్లో వెళ్లే విధంగా నీలిరంగు సిగ్నల్ కాకుండా నెమ్మదిగా వెళ్లే విధంగా సిగ్నల్ ఇస్తారు. అయితే, ఇక్కడ కోరమాండల్ ఎక్స్ప్రెస్ మెయిన్లైన్లోకి వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చినా లూప్లైన్లోకి ఎలా వచ్చిందన్న దానిపై రైల్వే శాఖ దర్యాప్తు చేపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్