ED raids: ఈడీ అధికారులపై టీఎంసీ మద్దతుదారుల దాడి.. వాహనాలు ధ్వంసం
తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ నివాసంలో తనిఖీలు చేసేందుకు వచ్చిన ఈడీ (ED) అధికారులపై టీఎంసీ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రేషన్ పంపిణీ కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుతో సంబంధమున్నట్లు భావిస్తోన్న 15 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం దాడులకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ నివాసంలో తనిఖీలు చేసేందుకు వచ్చిన ఈడీ (ED) అధికారులపై టీఎంసీ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రంలో వెలుగు చూసిన రేషన్ పంపిణీ కుంభకోణంలో మంత్రి జ్యోతిప్రియ మలిక్ ఇటీవల అరెస్టయ్యారు. ఆయనకు షాజహాన్ అత్యంత సన్నిహితుడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ శుక్రవారం 15చోట్ల దాడులు నిర్వహించింది. సీఆర్పీఎఫ్ బలగాల భద్రత నడుమ షాజహాన్ ఇంటికి చేరుకోగానే.. అక్కడున్న ఆందోళనకారులు వారి కాన్వాయ్ను అడ్డుకున్నారు. వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించారు. వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు ఈడీ అధికారులు, కేంద్ర బలగాలపైనా దాడులకు తెగబడ్డారు. దీంతో పరుగులు పెట్టిన అధికారులు.. ఆటోలు, బైకుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ఎన్ని కుట్రలు చేసినా..‘మా దోస్తీ’ ఎప్పటికీ చెదరనిది: సిసోదియాకు కేజ్రీవాల్ విషెస్
ఈ ఘటనలో ఇద్దరు ఈడీ అధికారులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మీడియాపైనా దాడులకు పాల్పడటంతో కొందరికి గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ దాడులను బెంగాల్ భాజపా తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో తాజా ఘటన రుజువు చేస్తోందని భాజపా నేత సువేందు అధికారి పేర్కొన్నారు. ఈ దాడుల్లో రోహింగ్యాలు ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రహోంశాఖ సహా ఇతర విభాగాలకు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.