Civils: విధి వీల్చైర్కు పరిమితం చేసినా.. కృషి కలెక్టర్ను చేసింది!
ఎనిమిదేళ్లకే కండరాల బలహీనత. అవయవాల పనితీరు స్తంభించిపోయి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తోటి మిత్రులతో కలిసి ఆడుతూపాడుతూ గడపాల్సిన......
స్ఫూర్తిని రగిల్చే ఓ యువకుడి కథ ఇదీ..
ఇంటర్నెట్ డెస్క్: ఎనిమిదేళ్లకే కండరాల బలహీనత. అవయవాల పనితీరు స్తంభించిపోయి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తోటి మిత్రులతో కలిసి ఆడుతూపాడుతూ గడపాల్సిన అతడి బాల్యం ఆసుపత్రులు, శస్త్రచికిత్సలతో గడిచిపోయింది. ఆ పాడు వ్యాధి అవయవాలను మింగేస్తూ.. శరీరాన్ని కదలనీయకుండా చేసినా.. అతడి ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయింది. చేతులతో రాయలేని పరిస్థితి.. అయినా వ్యాధి ఎంత కిందికి లాగినా బంతిలా పైకి దూసుకొచ్చాడు. అంగవైకల్యం ఉన్న వీడేంసాధిస్తాడురా అంటూ విమర్శలు చేసినవారి నోరు మూయిస్తూ.. ప్రతిష్ఠాత్మక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO)లో కొలువు సాధించాడు. మరో అడుగు ముందుకేసిన ఆ కుర్రాడు.. ఇటీవలే విడుదలైన యూనియన్ పబ్లిక్ సర్వీసు పరీక్ష ఫలితాల్లో సత్తా చాటాడు.
అంగవైకల్యంతో వీల్చైర్కే పరిమితమైన శాస్త్రవేత్త అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు స్టీఫెన్ హాకింగ్.. కానీ మన దేశంలోనూ ఓ యువ శాస్త్రవేత్త ఉన్నాడు. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక ఇస్రోలో పనిచేస్తున్నాడు కార్తిక్ కన్సల్. వీల్ చైర్లోనే ఆఫీస్కు వచ్చి తన విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా అతడు యూపీఎస్సీ ఫలితాల్లో 271వ ర్యాంకు సాధించి తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఏదైనా సాధించాలంటే అంగవైకల్యం అడ్డు కాదని.. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం మన పాదాక్రాంతమవుతుందని నిరూపించాడు.
వైకల్యం కారణంగా దక్కని ప్లేస్మెంట్
కార్తిక్ ఎనిమిదేళ్లున్న సమయంలో కండరాలు బలహీనమయ్యే మస్క్యులర్ డిస్ట్రఫీ వ్యాధి బారిన పడ్డాడు. పలు శస్త్రచికిత్సలు, వ్యాయామాలతో కోలుకున్నప్పటికీ.. లేచి నిల్చోలేని పరిస్థితి. దీంతో వీల్చైర్కే పరిమితయ్యాడు. కానీ, లేవలేని స్థితిలోనైనా పట్టుదల ప్రదర్శించాడు. అనారోగ్యం, అవహేళనలు, అవమానాలు ఎదుర్కొంటూ చదువుల్లో రాణించాడు. 2018లో ఐఐటీ రూర్కీలో విద్యాభ్యాసం పూర్తి చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్తో సహా అనేక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాడు. అయినా అంగవైకల్యం కారణంగా ప్లేస్మెంట్ పొందలేకపోయాడు.
వ్యవస్థలో మార్పు తీసుకురావాలని..
ఓ జాతీయ మీడియాతో కార్తిక్ ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ.. ఈ వివక్షే తనలో స్ఫూర్తిని రగిలించిందని పేర్కొన్నాడు. ‘నేను ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ బాగా రాశాను. కానీ మెయిన్స్కు అర్హత సాధించలేకపోయా. నా వైకల్యం కారణంగా నేను ఏ పోస్టుకు కూడా అర్హత పొందలేదని తెలిసింది. అప్పుడు ఎంతో క్షోభకు గురయ్యా. కానీ, మానసికంగా బలంగా ఉన్నా.. శారీరకంగా నాలా ఉన్నవారికి ఇలాంటివి ఆటంకం కలిగిస్తున్నాయని తెలుసుకున్నా. ఈ తిరస్కరణే నేను సివిల్స్పై దృష్టిపెట్టేందుకు దారితీసింది. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని అప్పుడే దృఢంగా నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నాడు.
తొలి ప్రయత్నంలో 813 ర్యాంకు సాధించినా..
2019లో సివిల్స్ తొలి ప్రయత్నంలోనే కార్తిక్ 813 ర్యాంకు సాధించాడు. కానీ మరిన్ని మార్కులు పెంచుకుని అడ్మినిస్ట్రేటివ్ పోస్టు సాధించాలనుకున్నాడు. కానీ 2020లో మెయిన్స్కు అర్హత సాధించలేకపోయాడు. 2021లో మూడో ప్రయత్నంలో 271వ ర్యాంకుతో మెరిశాడు. ‘యూపీఎస్సీ పరీక్ష రాసేందుకు చేతి వేళ్లు సహకరించకపోవడంతో మూడు నెలలపాటు ప్రతిరోజు నాలుగు గంటలు సాధన చేశాను’ అని కార్తిక్ తెలిపాడు. ప్రస్తుతం ఇస్రోలో పనిచేస్తూనే ఈ ర్యాంకు సాధించాడు. పనిదినాల్లో ఉదయం రెండు గంటలు, ఆఫీస్ నుంచి వచ్చాక 6.30 నుంచి రాత్రి 11 గంటలపాటు చదువుకునేవాడినని పేర్కొన్నాడు. వారాంతరాల్లో మరింత సమయం కేటాయించినట్లు వివరించాడు. తన ఈ జర్నీలో అమ్మ పాత్ర ఎంతో ఉందని, ఆమె సహకారంతోనే ఇదంతా సాధ్యమైనట్లు చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు