క్యాబ్ డ్రైవర్ నిద్ర: కారు నడిపిన మహిళ
సాధారణంగా మనం క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు డ్రైవర్ కారు నడుపుతుంటే మనం వెనక సీట్లో కూర్చొని సేద తీరుతాం. కానీ దీనికి భిన్నంగా క్యాబ్ బుక్ చేసుకొన్న వ్యక్తి డ్రైవర్ని కూర్చొబెట్టుకొని కారు.....
ముంబయి: సాధారణంగా మనం క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు డ్రైవర్ కారు నడుపుతుంటే మనం వెనక సీట్లో కూర్చొని విశ్రాంతి తీసుకొంటాము. కానీ, దీనికి భిన్నంగా క్యాబ్ బుక్ చేసుకొన్న వ్యక్తే డ్రైవర్ని పక్కన కూర్చొబెట్టుకొని వాహనం నడుపుకొంటూ గమ్యస్థానానికి చేరుకొంటే.. ముంబయిలో ఇలాంటి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఫిబ్రవరి 21 ముంబయిలో చోటుచేసుకొంది. దీని సంబంధించిన వీడియోను బాధితురాలు సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అది కాస్తా వైరల్గా మారింది.
తేజస్విని దివ్య నాయక్ అనే 28 ఏళ్ల మహిళ పుణె నుంచి ముంబయిలోని అంథేరీలో తన ఇంటికి వెళ్లేందుకు ఫిబ్రవరి 21 క్యాబ్ బుక్ చేసుకొంది. అయితే సదరు క్యాబ్ డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా కారు నడుపుతుండటంతో ఆమె అతణ్ని ఫోన్ మాట్లాడటం ఆపి జాగ్రత్తగా కారు నడపాలని కోరింది. దీంతో అతను ఫోన్ మాట్లాడటం ఆపి కారు నడుపుతూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అలా అతను కొంత దూరం వెళ్లిన తర్వాత ఎదురుగా వస్తున్న కారును తప్పించిబోయి డివైడర్ను ఢీ కొట్టబోయాడు. ఇది గమనించిన దివ్య అతణ్ని కాసేపు నిద్ర పొమ్మని చెప్పి.. వెన్ను నొప్పితో బాధపడుతున్నప్పటికీ తానే డ్రైవింగ్ చేసింది.
తాను కారు నడుపుతున్న సమయంలో డ్రైవర్ నిద్ర పోకుండా ఫోన్లో మాట్లాడుతూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడని తెలిపారు. అలా అతను నిద్ర పోతున్న సమయంలో తీసిన ఫొటోలను, వీడియోను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి ఉబెర్ సంస్థకు ట్యాగ్ చేశారు. ఇంకా కొద్ది సేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటామనగా డ్రైవర్ నిద్రలేచి కారు నడిపినట్లు దివ్య వెల్లడించారు. అయితే దానిపై స్పందించిన ఉబెర్ సంస్థ, జరిగిన ఘటన బాధాకరమని.. సదరు డ్రైవర్ని వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Manipur Violence: మణిపుర్లో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. 13 మంది మృతి
మణిపుర్లో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో 13 మంది మృతి చెందారు. -
Chhattisgarh: రాజవంశీయులకు బై బై.. పోటీలో ఉన్న ఏడుగురూ ఓటమి!
ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా, ఆప్ నుంచి పోటీచేసిన ఏడుగురు రాజవంశీయులు ఓటమి చెందడంతో తొలిసారిగా అసెంబ్లీలో వారికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. -
Railway: రైల్వే ‘బీస్ట్’ను చూశారా..? వైరల్ అవుతున్న వీడియో
Beast of Indian Railways: అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వీడియోను రైల్వే శాఖ ఎక్స్లో పోస్ట్ చేసింది. దాన్ని రైల్వే బీస్ట్గా అభివర్ణించింది. -
Jobs: ఐఐటీ కాన్పూర్లో కొలువుల జోష్.. ఒకేరోజు 485మందికి జాబ్ ఆఫర్లు
ఐఐటీ కాన్పూర్లో కొలువుల జోష్ మొదలైంది.. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తొలిరోజే 485మందికి జాబ్ ఆఫర్లు వచ్చాయి. -
Raghav Chadha: ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డాపై సస్పెన్షన్ ఎత్తివేత
Raghav Chadha: ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డాపై విధించిన నిరవధిక సస్పెన్షన్ను రాజ్యసభ ఛైర్మన్ ఎత్తివేశారు. దీంతో మళ్లీ ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. -
Congress: ఆత్మపరిశీలన చేసుకుంటాం.. మధ్యప్రదేశ్ ఫలితం అంతుపట్టడం లేదు!
మూడు రాష్ట్రాల్లో పార్టీ వైఫల్యంపై ఆత్మపరిశీలన చేసుకుంటామని.. మధ్యప్రదేశ్లో మాత్రం ఏం జరిగిందో అనే విషయం ఇప్పటికీ అంతుపట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. -
Chennai Rains: కొట్టుకుపోయిన కార్లు.. రన్వేపైకి వరద.. చెన్నైలో వర్ష బీభత్స దృశ్యాలు
Chennai Rains: భారీ వర్షాలతో చెన్నై నగరం దాదాపు స్తంభించింది. పలు చోట్ల వరద బీభత్సం సృష్టించింది. ఎయిర్పోర్టులోకి వరద చేరి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. -
Udhayanidhi Stalin: నా మాటలను భాజపా వక్రీకరించింది.. సనాతన వివాదంపై ఉదయనిధి
సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివరణ ఇచ్చుకొన్నారు. తన వ్యాఖ్యలను భాజపా, ప్రధాని మోదీ వక్రీకరించి వాడుకొన్నారని ఆరోపించారు. -
Mary Milliben: ప్రధాని మోదీ ఉత్తమ నాయకుడు.. మూడు రాష్ట్రాల్లో భాజపా విజయంపై అమెరికన్ సింగర్
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా (BJP) విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ (Mary Milliben) ప్రశంసల జల్లు కురింపించారు. -
PM Modi: ‘మీ ఓటమి అసహనాన్ని పార్లమెంట్లో చూపించొద్దు’: కాంగ్రెస్కు మోదీ సూచన
PM Modi: అసెంబ్లీ ఎన్నికల్లో సుపరిపాలనకు పట్టం కట్టిన ప్రజలు.. నెగెటివిటీని ప్రచారం చేసేవారిని ఓడించారని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఫలితాలపై స్పందించారు. -
Chennai: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. స్తంభించిన చెన్నై
మిగ్జాం తుపాను తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం దాదాపు స్తంభించిపోయింది. -
మొయిత్రా అంశం అలజడి రేపుతుందా!
అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహం మీద ఉన్న భాజపా.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహాలతో సిద్ధమవుతోంది. -
రక్తదానంపై ప్రచారం చేస్తూ 17,700 కి.మీ. పాదయాత్ర
దిల్లీకి చెందిన కిరణ్వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 17,700 కిలోమీటర్లు తిరిగారు. -
గోపాల్ భార్గవ.. తొమ్మిదోసారి..
మధ్యప్రదేశ్లో భాజపా దిగ్గజ నేతల్లో ఒకరైన గోపాల్ భార్గవ (71) రహ్లీ నియోజకవర్గంపై తన పట్టును మరోసారి చాటుకున్నారు. -
అటువంటి సందర్భంలో పరిమిత బెయిల్ చట్టవిరుద్థమే: సుప్రీం కోర్టు
ఏదైనా కేసులో నిందితుడు బెయిల్ పొడిగింపు పొందడానికి అర్హుడుగా తేలిన సందర్భంలో అతనికి పరిమిత కాల బెయిల్ మంజూరు చేయడం చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
GST: ఈ ఏడాది సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లు
-
Chandrababu: చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
-
Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
-
Team India: ముగ్గురు కెప్టెన్లు.. భవిష్యత్తుకు సంకేతం కావచ్చు: ఇర్ఫాన్ పఠాన్
-
Manipur Violence: మణిపుర్లో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. 13 మంది మృతి
-
Yashasvi Jaiswal: బాదుడు సరే.. తొందరెందుకు యశస్వి.. కుదురుకోవాలి కదా!