కరోనా కట్టడిలో ఆ దేశాల విజయ రహస్యం!
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే 43లక్షలకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారినపడగా దాదాపు 3లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ధనిక, పేద దేశాలనే తేడా లేకుండా అన్ని దేశాలను భయోత్పాతం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే 43లక్షలకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారినపడగా దాదాపు 3లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ధనిక, పేద దేశాలనే తేడా లేకుండా అన్ని దేశాలను భయోత్పాతం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దశలో కొన్ని దేశాలు దీన్ని నియంత్రించలేమని చేతులెత్తేయగా మరికొన్ని మాత్రం పోరాడుతూనే ఉన్నాయి. ఈ సమయంలో కొన్ని దేశాలు మాత్రం ఈ మహమ్మారిని నియంత్రించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాటిలో స్లోవేనియా, జోర్డాన్, ఐస్లాండ్, గ్రీస్, వియత్నాం ముందస్తు చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలుచేశాయి. భౌతిక దూరంపై అవగాహన కలిగించడంతోపాటు వేల సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ కరోనా వైరస్ కట్టడిలో విజయం సాధిస్తున్నాయి.
స్లోవేనియా
కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ఇటలీపక్కనే స్లోవేనియా ఉన్నప్పటికీ కరోనా వైరస్పై ముందుగానే మేల్కొంది. అక్కడి ప్రధాన మంత్రి రాజీనామా చేయడంతో మార్చి 13నే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలోనే కరోనా విస్తృతి గమనించిన ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ను అమలులోకి తెచ్చిన ప్రభుత్వం కారణం లేకుండా ఎవ్వరినీ బయటకు అనుమతించలేదు. ఆ సమయంలో అనుమానం కలిగిన ప్రతిఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక రక్షణ పరికరాలను అందరికీ అందుబాటులో ఉంచింది. కరోనా కట్టిడిలో స్లోవేనియా విజయం సాధించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అక్కడి ప్రజల స్పందన, ఆ దేశ మెరుగైన ఆరోగ్య వ్యవస్థలతో పాటు అక్కడి నిబద్ధత గల వైద్య సిబ్బంది ఎంతో దోహదం చేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని అమలుచేస్తూ, నిబంధనలను కచ్చితంగా పాటించారు. అత్యవసర వస్తువుల ఉత్పత్తి మినహా అన్ని రకాల ఉత్పత్తులను ఆసివేసింది. అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయనప్పటికీ విదేశీయుల రాకను నియంత్రించారు. 14రోజుల క్వారంటైన్ అమలుపరచడంతోపాటు వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించడంతోపాటు ప్రజలనుంచి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని సేకరించారు. ప్రపంచంలో ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు ఏ దేశంలోనూ చూడలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.
పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్లోవేనియాలో మార్చి 4న తొలి పాజిటివ్ కేసు నిర్ధారణ అయ్యింది. అనంతరం రెండు వారాల్లోనే దేశంలోని పాఠశాలలు, వాణిజ్య కార్యకలాపాలు, రవాణా వ్యవస్థ నిలిపివేశారు. దేశవ్యాప్తంగా షట్డౌన్ విధించి.. ఉద్దీపన కింద దాదాపు 3బిలియన్ల యూరోలను తమ పౌరులకు అందించింది. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సరైన సమయంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కరోనా నియంత్రణకు ఎంతగానో దోహదం చేశాయి. ప్రస్తుతం అక్కడ 1460 పాజిటివ్ కేసులు నమోదుకాగా 102మరణాలు సంభవించాయి.
జోర్డాన్
అరబ్ దేశాల్లో ఒకటైన జోర్డాన్లో కరోనా వైరస్ను అనతికాలంలోనే కట్టడిచేసింది. మార్చి 2న తొలి పాజిటివ్ కేసు నమోదయ్యింది. అప్పటికి ఐదు వారాల ముందే ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఒకవేళ కరోనా కేసులు నమోదైతే రోగులకు ఏయే ఆసుపత్రిలో చికిత్ప చేయాలి?, ఆసమయంలో వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగులకు ఎలా చికిత్స చేయాలనే విషయాలపై అవగాహన కల్పించింది. అంతేకాకుండా రాజు ఆదేశాల మేరకు లాక్డౌన్, కర్ఫ్యూను కచ్చితంగా అమలుచేసేందుకు మిలటరీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి చర్యలతో వైరస్ను కట్టడి చేయడంతో దేశంలో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యను తగ్గించుకోగలిగింది. ఇప్పటివరకు దేశంలో 560 పాజిటివ్ కేసులు, 9మరణాల సంభవించాయి.
ఐస్లాండ్
తక్కువ జనాభా కలిగిన ఐస్లాండ్లో 1800 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా స్వల్ప లక్షణాలు కలిగిన వారిని వెంటనే గుర్తించి ఐసోలేషన్ ఉంచే ప్రక్రియ ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం. ఇలా చేయడం ద్వారా వైరస్ను ఇతరులకు సోకడాన్ని నివారించగలిగింది. దీంతో మరణాల సంఖ్యనూ నియంత్రించగలిగింది. ఇప్పటివరకు ఐస్లాండ్లో వైరస్ సోకినవారిలో 10మంది మరణించారు.
గ్రీస్
ఇక అత్యధిక వృద్ధ జనాభా కలిగిన గ్రీస్ కరోనా కట్టడిలో అందర్నీ ఆశ్చర్య పరిచింది. అంతేకాకుండా పర్యాటకంపైనే ఎక్కువ ఆధారపడే గ్రీస్ సరైన సమయంలో లాక్డౌన్ అమలుపరిచింది. మెరుగైన ఆరోగ్య వ్యవస్థ ఉన్న గ్రీస్లో భౌతికదూరంపై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈస్టర్ సమయంలోకూడా ప్రజలు పెద్దఎత్తున గుమిగూడకుండా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా పర్యాటకులు తమ దేశంలోని రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దీంతో దేశంలో 2700పాజిటివ్ కేసులు, 150 మరణాల వద్దే నియంత్రించగలిగింది. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో వేసవిలో తమ దేశానికి పర్యాటకులు రావొచ్చని ఆహ్వానం పలకడం గమనార్హం.
వియత్నాం
ఇక కరోనా మహమ్మారి పుట్టిన చైనాకు సరిహద్దు కలిగిన వియత్నాం కొవిడ్-19ను సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఇప్పటివరకు ఇక్కడ కేవలం 288పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయంటే ఈ వైరస్ను ఎంతలా కట్టడి చేసిందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో ఒక్కరుకూడా మరణించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల కన్నా ముందే వియత్నాం కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. పాజిటివ్ కేసులు నమోదవుతున్నా కొద్దీ వారి కాంటాక్ట్లను ట్రేస్ చేసి వారిని క్వారంటైన్లో పెట్టడం ద్వారా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలిగింది. చైనాలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న సమయంలోనే వియత్నాం ముందస్తు చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇలా ఆదిలోనే మేల్కోన్న ఈ దేశ ప్రభుత్వాలు తీసుకున్న చర్యల ఫలితంగా కరోనా వైరస్ను పూర్తిస్థాయిలో కట్టడి చేయగలిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..