శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ :ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని జూనిమార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో.......

Updated : 21 Jun 2020 11:46 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని జూనిమార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో జమ్మూకశ్మీర్‌ పోలీసులతో పాటు భద్రతాబలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడడంతో దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగర వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారు. ప్రజారవాణాపై కూడా నిషేదాజ్ఞలు విధించారు. 

మరోవైపు పాక్‌ సైన్యం సరిహద్దుల వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. సరిహద్దు గ్రామాలు, సైనిక శిబిరాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతోంది. మోర్టార్లతో విరుచుకుపడుతోంది. భారత సైన్యం పాక్‌ కుయుక్తులను దీటుగా తిప్పికొడుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సైనికాధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని