Mehul Choksi: ఆ అమ్మాయి ట్రాప్ చేసింది
నమ్మిన అమ్మాయే తనను ట్రాప్ చేసి ఎత్తుకెళ్లటానికి సాయం చేసిందని..
నన్ను కిడ్నాప్ చేశారు: చోక్సీ
దిల్లీ: నమ్మిన అమ్మాయే తనను ట్రాప్ చేసి ఎత్తుకెళ్లటానికి సాయం చేసిందని.. కోట్ల రూపాయలు కొల్లగొట్టి, దొరక్కుండా వెళ్లిన భారత నగల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆరోపించారు. ఆంటిగ్వ్వా నుంచి తనను స్థానిక పోలీసులు, కొంతమంది కిరాయి దుండగులు కిడ్నాప్ చేసి డొమినికాకు తీసుకొచ్చారన్నారు. ఈ మేరకు ఆంటిగ్వా రాయల్ పోలీసులకు చోక్సీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ తెలిపారు.
‘‘బార్బరా జబరికా అనే అమ్మాయి నన్ను వలలో ఇరికించి కిడ్నాప్కు సాయం చేసింది. ఆంటిగ్వాలో కిడ్నాప్ చేసి... డొమినికాలో ఓ ఉన్నతస్థాయి భారత రాజకీయవేత్తకు ఇంటర్వ్యూ ఇప్పించేందుకు తీసుకొచ్చారు. తర్వాత వారి ప్రణాళిక మారినట్లుంది. నన్ను డొమినికా కోస్టుగార్డులకు అప్పగించారు. ఇంటర్పోల్ నోటీసున్న కారణంగా నన్ను అరెస్టు చేస్తున్నట్లు ఆ పోలీసులు చెప్పారు. బార్బరా జబరికా అనే అమ్మాయి నాకు ఏడాది కాలంగా తెలుసు. మా ఇంటివద్దే నివసించేది. గతనెల 23న సాయంత్రం ఇంటికొచ్చి తనను తీసుకెళ్లమని చెబితే వెళ్లాను. సాయంత్రం ఐదింటికి వెళ్లా. ఆ సమయంలో... 10 మంది ఆంటిగ్వా పోలీసులుగా చెప్పుకొంటున్న బలమైన వ్యక్తులు నాపై దాడి చేసి కొట్టారు. వారికి కొంతమంది కిరాయి ఆగంతకులు... బహుశా భారతీయులు కావొచ్చు... కలిశారు. ఇదంతా జరుగుతుంటే బార్బరా వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నాకేమాత్రం సాయం చేయలేదు. అంటే ఆమె కూడా వారితో కలసే నన్ను కిడ్నాప్ చేసినట్లున్నారు. పడవల్లో నన్ను ఆంటిగ్వా నుంచి డొమినికాకు చేర్చారు. నరీందర్సింగ్ అనే భారతీయ కిరాయి వ్యక్తి నాపై చేయి చేసుకున్నాడు. కేసులో సహకరించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు’’ అని చోక్సీ ఆరోపించారు.
భారతీయ బ్యాంకులకు సుమారు 13 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కేసులో నిందితుడైన చోక్సీ పరారై... 2018 నుంచి ఆంటిగ్వాలో ఉంటున్నారు. ఇటీవలే ఆయనను పక్క దేశం డొమినికాలో పట్టుకున్నారు. అక్కడి నుంచి భారత్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేశారనేది చోక్సీ ఆరోపణ. డొమినికా కోర్టులో బెయిల్కు కూడా చోక్సీ దరఖాస్తు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.