US: మనోళ్లకు కొలువుల కలవరం
అమెజాన్లో పనిచేస్తున్న గీత(పేరు మార్చాం) మూడు నెలల క్రితమే అమెరికాకు వెళ్లారు. ఇటీవల లేఆఫ్లో భాగంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ యాజమాన్యం సమాచారమిచ్చింది.
అమెరికాలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయులు
పెద్దఎత్తున లేఆఫ్లు ప్రకటించిన ఐటీ సంస్థలు
ప్రవాసుల మెడపై కత్తిలా హెచ్-1బీ వీసా నిబంధనలు
తీవ్ర ఆందోళనలో వేల కుటుంబాలు
అమెజాన్లో పనిచేస్తున్న గీత(పేరు మార్చాం) మూడు నెలల క్రితమే అమెరికాకు వెళ్లారు. ఇటీవల లేఆఫ్లో భాగంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ యాజమాన్యం సమాచారమిచ్చింది. మార్చి 20 ఆమె చివరి పనిదినం అని తెలిపింది. హెచ్-1బీ వీసాతో అగ్రరాజ్యానికి వెళ్లిన ఆమె.. ఇప్పుడు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిందే. లేదంటే స్వదేశానికి తిరిగివెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.
హెచ్-1బీ వీసాతో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేస్తున్న సీత(పేరు మార్చాం) ఈ నెల 18న లేఆఫ్కు గురైంది. ఆమె ఒంటరి తల్లి. తన కుమారుడు త్వరలోనే కళాశాలలో చేరబోతున్నాడు. ఈ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది.
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం.. ఆరంకెల జీతం.. అందమైన జీవితం.. ఇప్పటిదాకా భారతీయులు అనుభవిస్తున్న సౌకర్యం ఇది. ..కానీ ఇప్పుడు పరిస్థితి తల్లకిందులవుతోంది. రాత్రికిరాత్రే కొలువులు ఊడుతున్నాయి. బాస్ ఎప్పుడు తనను ఉద్యోగం నుంచి తొలగిస్తాడో అన్న బెంగ వీరిని వెంటాడుతోంది. ఆర్థికమాంద్యం బూచి చూపి బడా ఐటీ కంపెనీలు లే ఆఫ్లు అంటూ పెద్దఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇలా కొలువులు కోల్పోయిన మనవాళ్లు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికితోడు హెచ్-1బీ వీసా నిబంధనల కత్తి వీరి మెడపై వేలాడుతోంది. 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేదా స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలన్న నిబంధన ప్రవాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఉన్న ఉద్యోగం ఊడిపోయి.. కొత్త ఉద్యోగం దొరక్క.. ఓ వైపు సతమతమవుతుంటే.. ఈ రెండు నెలల గడువు మరింత కుంగదీస్తోంది. మరో ఉద్యోగం దొరక్కపోతే తమ కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, పిల్లల చదువులకు అడ్డంకులు ఎదురవుతాయని వారు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలా ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో తెలుగువారూ ఉన్నారు.
కొలువు కోల్పోయినవారిలో భారతీయులు 40 శాతం
ఇటీవల కొన్ని నెలలుగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ సహా పలు సంస్థలు వరుసబెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి వేళ వ్యయభారాన్ని తగ్గించుకోవడానికి కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని పేర్కొంటున్నాయి. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్నవారిలో భారతీయులు అధికంగా ఉన్నారు. దీంతో ఉద్యోగాల కోతల ప్రభావం భారతీయులపై ఎక్కువగా ఉంది. అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. అమెరికాలో గత నవంబరు నుంచి సుమారు 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి. వీరిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయులే అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిలో అత్యధికులు హెచ్-1బీ, ఎల్1 వీసాలపై వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారే. ఈ వీసా నిబంధనల ప్రకారం 60 రోజుల్లోపు కొత్త ఉద్యోగంలో చేరితే సరి. లేకపోతే గడువు ముగిసిన 10 రోజుల్లోపు దేశాన్ని వీడాలి. దీంతో కొలువు కోల్పోయినవారంతా ఎలాగైనా అగ్రరాజ్యంలో ఉండేందుకు మరో ఉద్యోగం కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఉద్యోగావకాశాల గురించి ఆరా తీస్తున్నారు. వీరికి ప్రవాస భారతీయ సంఘాలు సహకారం అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం దాదాపు అన్ని ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ఇంత తక్కువ వ్యవధిలో మరో ఉద్యోగం సాధించడం చాలా కష్టంగా ఉందని నిరుద్యోగులు చెబుతున్నారు.
హెచ్1-బీ వీసాదారులకు మినహాయింపు ఇవ్వాలి
అత్యుత్తమ నైపుణ్యాలున్న ఉద్యోగులను కాపాడుకోవడానికి అమెరికా వీసా విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని సిలికాన్ వ్యాలీకి చెందిన ఓ సంస్థ యజమాని అజయ్ జైన్ భుటోరియా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉద్యోగావకాశాల విషయంలో ఉన్న క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐటీ సంస్థలు హెచ్1-బీ ఉద్యోగుల తొలగింపు తేదీని మరికొన్ని నెలలు పొడిగించాలని ఆయన సూచించారు. ‘‘వేల మంది ఐటీ ఉద్యోగులు లేఆఫ్లను ఎదుర్కోవడం దురదృష్టకరం. ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారులకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. వీరు ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని సంపాదించాలి. లేదంటే దేశాన్ని వీడాలి. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి కుటుంబాలపై పెను ప్రభావం పడుతోంది. పిల్లల చదువులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. భారీ స్థాయిలో పన్నులు చెల్లిస్తూ అమెరికా అభివృద్ధికి కీలకంగా మారిన హెచ్-1బీ వీసాదారులకు టెక్ కంపెనీలు కొన్ని మినహాయింపులు ఇస్తే బాగుంటుంది. వారి ఉద్యోగాల తొలగింపు తేదీని మరికొన్ని నెలలు పొడిగించాలి’’ అని అజయ్ జైన్ పేర్కొన్నారు.
కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి: కేజ్రీవాల్
అమెరికాతోపాటు దేశంలోనూ ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తుండటంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తగినచర్యలు తీసుకోవాలని సూచించారు.
మొత్తంగా ఐటీ రంగంలో గత నెలరోజుల్లోనే సుమారు 50వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!